వైసీపీ బరితెగింపు.. 

Publish Date:Apr 9, 2021

Advertisement

దేశం లో నైనా రాష్ట్రము లోనైనా. పాలక పక్షం ఉండాలి. ప్రతిపక్షం కూడా ఉండాలి. అది రాయకీయంలో అయినా.. రౌడీ ఇజమైన,  ఆటైనా, వేటకైనా ప్రతిపక్షం తప్పక ఉండాలి. ఎందుకంటే పాలక పక్షం తప్పును ఎత్తిచూపేది ప్రతిపక్షమే కాబట్టి. అసలు ప్రతిపక్షమే ఉండొద్దు అనుకుంటే. అది రాజకీయం కాదు రాచరికం అవుతుంది. ఎప్పుడో సమాధి కట్టిన రాచరికాన్ని మళ్ళీ ప్రాణం పోస్తుందనే చెప్పాలి వైసీపీ ప్రభుత్వం. ప్రాంతం ఏదైనా సరే  భయ పెట్టడం వారి నైజం. దాడులు చేయడం వారి ఇజం గా మారింది వైసీపీ తీరు. ఏపీలో ఎప్పుడు లేని విధంగా ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తున్నారు .

ఓపెన్ చేస్తే.. అది కిర్లంపూడి మండలం. కృష్ణవరం గ్రామం. సమయం  అర్ధరాత్రి. ఆ ఊరిలోని జనం అంత నిద్రలోకి జారుకున్నారు. ఒక్కసారిగా ఒక ఇంట్లో అరుపులు వినపడుతున్నాయి. ఓ పార్టీ కార్యకర్తలు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కర్రలతో, ఇనుపరాడ్లతో మరో పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. 

కట్ చేస్తే.. అది కృష్ణవరం గ్రామం టీడీపీ నాయకుడి ఇల్లు. కొంత మంది వైకాపా నాయకులు దాడి చేశారు. తమపైకి దాడికి వస్తున్నారన్న విషయం  తెలిసింది. తెదేపా కార్యకర్తలు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ప్రాణాలను రక్షించుకున్నారు. అక్కడితో ఆగని వైకాపా కార్యకర్తలు. రాళ్లతో, కర్రలతో తెదేపా నాయకుడు బొదిరెడ్ల సుబ్బారావు ఇంటి కిటికీలను, తలుపులు, ఫర్నీచర్‌ను పగలగొట్టారు. అక్కడ ఉన్న నాలుగు మోటారు సైకిళ్లను ధ్వంసం చేశారు. కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న తెదేపా నాయకుడు జ్యోతుల నెహ్రూ అర్ధరాత్రి 1.30 సమయంలో కృష్ణవరం చేరకుని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అక్కడి నుంచే జిల్లా ఎస్పీ, పెద్దాపురం డీఎస్పీలకు ఫోన్‌ ద్వారా జరిగిన విషయాన్ని వివరించారు. ప్రశాంతమైన జిల్లాలో ఫ్యాక్షన్‌ రాజకీయాలకు కృష్ణవరంలో జరిగిన ఘటనే నిదర్శనమని నెహ్రూ పోలీసు అధికారులకు వివరించారు. తమ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డవారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న గ్రామానికి చెందిన గోరకపూడి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో దాడి జరగడం హేయమైన చర్యగా నెహ్రూ అభివర్ణించారు. ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.         

ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. మొత్తం  26 మందిపై కేసులు నమోదు చేశారు. కేసు ను దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అప్పలరాజు తెలిపారు. గ్రామంలోని ముఖ్య కూడలి ఉంది. ఆ కూడలిలో వైకాపా కార్యకర్త చాగంటి రాజారావు ద్విచక్ర వాహనానికి తెదేపా కార్యకర్త రాయవరపు దుర్గాప్రసాద్‌ ద్విచక్ర వాహనం అడ్డువచ్చిందంటూ బుధవారం రాత్రి 10గంటల సమయంలో ఘర్షణ పడ్డారు. 11 గంటల సమయంలో వైకాపా కార్యకర్త చాగంటి రాజారావు, బూర్రేడి వీరబాబు మోటారు సైకిల్‌పై గ్రామ తెదేపా నాయకుడు బొదిరెడ్ల సుబ్బారావు ఇంటి ముందు నుంచి పాతకృష్ణవరం వెళ్తుండగా తెదేపా కార్యకర్తలు వారిని అడ్డగించి దాడిచేశారు. విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు, కార్యకర్తలు సుమారు 100 మంది వరకు తెదేపా నాయకుడు బొదిరెడ్ల సుబ్బారావు ఇంటిపై దాడికి దిగారు. గ్రామంలో ప్రత్యేక పోలీసు బలగాలతో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.       
      

By
en-us Political News

  
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తమ విధులకు ఆటంకం కలిగించిన కారణంగా పోలీసులు గోరంట్ల మాధవ్ ను గురువారం (ఏప్రిల్ 10) సాయంత్రం అదుపులోనికి తీసుకున్నారు.
ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెతుక్కోవాలి అంటారు పెద్దలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తోందా అంటే.. అవుననే సమాధానమే వస్తోంది. కాంగ్రెస్ పార్టీ సుదీర్గ చరిత్రలో చాలా ఎత్తుపల్లాలు చూసింది. కానీ, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి చరిత్రలో ఎరగని ఘోరాతి ఘోరమైన ఓటమి.
పవన్ మాజీ సతీమణి రేణూదేశాయ్ బీజేపీ గూటికి చేరనున్నారా? తాను మోడీ భక్తురాలినని చెప్పిన రేణూదేశాయ్ తన జాతకంలోనే రాజకీయ నాయకురాలినని ఉందని చెప్పడం వెనుక ఉద్దేశం బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించడమేనా?
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ రోడ్డు ప్రమాద కేసు నుంచి తన కుమారుడిని తప్పించే ప్రయత్నం చేసినందుకు షకీల్ పై పోలీసులు గతంలోనే అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌కి వచ్చారు. జనరల్ చెకప్‌లో భాగంగా కేసీఆర్ ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ ‌లో జరగబోయే బీఆర్‌ఎస్ పార్టీ రజత్సోవాల్లొ పార్టీ నాయకులతో కేసీఆర్ వరుస సమావేశలతో బీజీగా ఉండటంతో అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది.
వివాదాస్పద దర్శకుడు రామగోపాల వర్మపై రాజమహేంద్రవరంలో ఒక ఫిర్యాదు నమోదైంది. ఆయన హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది మేడా శ్రీనివాస్ రాజమహేంద్రవరం మూడో టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
చత్తీస్ గడ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు చెలరేగిపోయారు. ప్రెషర్ బాంబు పేలిన వెంటన కూంబింగ్ చేస్తున్న పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే  ప్రెషర్ బాంబు దాడికి ఒక జవానుకు తీవ్రగాయాలయ్యాయి.
విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ లో మళ్లీ క్రికెట్ సందడి చేయనుంది. దాదాపు 128 ఏళ్ల తరువాత క్రికెట్ కు మళ్లీ ఒలింపిక్స్ లో స్థానం లభించనుంది. ఒలింపిక్స్ లో చివరి సారిగా 1900లో క్రికెట్ ఆడారు.
2008 ముంబై ఉగ్రదాడి సూత్రదారి తహవూర్ రాణాను అమెరికా అప్పగించింది. ప్రత్యేక విమానంలో రాణా ఇండియాకు బయలు దేరారు. మరికొద్ది సేపట్లో రాణా భారత్ కు చేరుకునే అవకాశం ఉంది.
తెలుగుదేశం నుంచి చేబ్రోలు కిరణ్ సస్పెన్షన్ఐ టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై తెలుగుదేశం పార్టీ వేటు వేసింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధర్ నెడ్డిపై పొలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. తనపై నమోదైన కేసుల విచారణపై స్టే విధించాలని దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.
అధికారంలోకి వస్తే పేద ప్రజలందరికీ ఇళ్లు కట్టిస్తాం.. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు చేసే ప్రధాన వాగ్దానాలలో ఇదొకటి. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని ఎన్నికల్లోనూ అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల్లో ఇంటి’ హామీ గ్యారెంటీ’గా ఉంటుంది. అయితే, పేర్లు మారుతూ ఉంటాయి. ఒకరు ఇందిరమ్మ ఇళ్లు, అంటే ఇంకొకరు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంటారు.
ఎవరు చేసిన ఖర్మ వారనుభవింపకా తప్పదన్నా అన్నట్లు జగన్ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పడం లేదు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా చెలరేగి.. ఎదురేలేదన్నట్లుగా రెచ్చిపోయిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పుడు వాటి ఫలితాన్ని అనుభవించక తప్పని పరిస్థితుల్లో పడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.