కిడ్నీ సమస్యలతో జీవించడం అసాధ్యమా ?

Publish Date:Mar 13, 2021

Advertisement

సాధ్యమా అన్న సందేహం కిడ్నీ రోగులను వేదిస్తోన్న ప్రశ్న ? అయితే ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నిజాం ఇన్స్టిట్యూట్ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి చెందిన ప్రొఫెసర్, హెచ్ ఓ డి డిపార్ట్ మెంట్ అఫ్ నేఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు వన్ హెల్త్ తో మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న నేఫ్రాలజిస్ట్లులు సమావేశాలు అవగాహన సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. కిడ్నీ ఫేయిల్యూర్ తరువాత చాలా మంది రోగులు ఇక జీవించడం ఎందుకని అసంతృప్తి నిరుత్సాహంతో ఉంటారు. కిడ్నీ సమస్య ఒకప్పుడు మరణసశానమే అని అన్నారు. అయితే కిడ్నీ సమస్య ఉన్నవారు జీవించడం సాధ్యమే అని, రోగులకు భరోసా కల్పించారు.డాక్టర్ శ్రీభూషణ్ రాజు 40 - 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ సమస్యతో బాధపడుతున్నారు అని ఆయన వన్ హెల్త్ చానల్ కు వివరించారు. అయితే డయాలసిస్ తో అందరూ బాగుపడవచ్చని ఆయన అన్నారు. డయాలసిస్ తరువాత తిగి వెనక్కు చూడలేదని అన్నారు. డయాలసిస్ చేసుకుని సాధారణ జీవితం గడుపుతున్న లక్షలాది మంది ఇప్పటికీ జీవిస్తున్నారని శ్రీభూషణ్ రాజు అన్నారు. కిడ్నీ ఫేయిల్యూర్ వస్తే చింతించాల్సిన అవసరం లేదని 30 ఏళ్లుగా డయాలసిస్ చేసుకుంటున్నవారు ఉన్నారని అన్నారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు,లివర్ పాడైతే తీవ్ర ఇబ్బందులు తప్పవని ఇలాంటి మల్టిపుల్ సమస్యలు ఉంటే కిడ్నీ ని సహజంగా డయాలసిస్ చేసిన కొన్నిసార్లు కష్టమౌతుందని అన్నారు.కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిన వాళ్ళు 100 % పాడైపోయిన వారే ఎక్కువగా వస్తు ఉంటారని శ్రీభూషణ్ రాజు అన్నారు. డయాలసిస్ అనగానే భయపడేవారు ఎక్కువ అని వివరించారు. కిడ్నీ పాడైతే డయాలసిస్స్ నా?అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ కొంత మందికి తీవ్రతను బట్టి తక్కువ రోజులు లేదా కిడ్నీ డ్యామేజ్ తో పాటు ఇన్ఫెక్షన్ లేదా చీము వచ్చిన వారికీ పూర్తిగా కోలుకునే వరకు చికిత్స ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. కొంత మంది వ్యాధి తీవ్రతను గుర్తించకుండా తాము ఎక్కువ రోజులు అసుపత్రిలో ఉండలేమని ఇంటికి వెళ్లిపోతామని ఒత్తిడి చేస్తారు. అలాంటాప్పుడు కుటుంబ సభ్యులు స్నేహితులు వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలనీ అన్నారు. కిడ్నీ వంద శాతం పాడైనా ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికత వల్ల పరీక్షలు చేయించుకుంటూ ముందుగానే కనుక్కుని జాగ్రత్తలు పాటిస్తూ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటనలు చూసామని వన్ హెల్త్ కు చెప్పారు. కిడ్నీ పాడైతే శరీరం పాడై పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కిడ్నీ పాడైతే బిపి పెరుగుతుందని,దీర్ఘకాలికంగా కిడ్నీ పాడై కండరాలు పాడై పోతాయని అయితే దీర్ఘకాలంగా మందులు వాడితే జీవించగలమన్న ఆశ పెరుగుతోందని శ్రీ భూషణ్ రాజు అన్నారు. క్రానిక్ కిడ్నీ సమస్యలతో బాధపడేవారు రెండు పద్దతులలో డయాలసిస్ చేసుకోవచ్చని అన్నారు. ఒకటి కడుపులో వేసుకునేది. ఇంట్లోనే డాయలసిస్ చేసుకోవచ్చు. కిడ్నీ డయాలసిస్ చేసుకుంటేనే ఆనందంగా జీవిస్తున్నారని ఆయన అన్నారు.

రక్త హీనతతో ఉండడం వల్ల నీరసంగా ఆయాసం గా ఉంటారని అన్నారు. బిపి వల్ల కిడ్నీ సమస్య ముదరకుండా చూడవచ్చు అని విశ్లేషించారు. దీనికి త్వరగా మందులు వేసుకుంటే బయటపడవచ్చునని సూచించారు..రెట్రోహార్మోన్ వల్ల మామూలుగానే జీవించవచ్చని తెలిపారు. ఫాస్ట్ ఫుడ్ వల్ల కిడ్నీపాడైపోతుందని ఈవిషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సాత్విక ఆహరం తీసుకోవాలని సూచించారు.. ఇక డయాలసిస్ తో కిడ్నీమెరుగు కాకుంటే కిడ్నీ ఫెయిల్ అయితే నిరుత్సహపడవదని కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే లక్షలాది మంది కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేశాక ఆనందంగా జీవిస్తున్నారని అన్నారు. సరైన సమయంలో సరైన చికిత్సమందులు డాక్టర్ సూచన పాటిస్తే కిడ్నీ వ్యాదుల నుండి బయటపడి ఆనందంగా జీవించవచని. అది సాధ్యమే అని డాక్టర్ శ్రీభూషణ్ రాజు విశ్వాసం కల్పించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం రోజున మన మందరం కిడ్నీ రోగులకు వారు తిరిగికోలుకునే విధంగా వారికి అవగాహన కల్పించి ఆరోగ్యంగా ఉండేవిధంగా చూడాల్సిన బాధ్యత మనదే అని అన్నారు.

By
en-us Political News

  
మూత్రం పోయే సమయంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను చాలా మంది సాధారణంగా తీసుకుంటారు.
శరీరంలో కొవ్వు పెరగడం అనేది చాలామంది చూస్తూనే ఉంటారు.  కొందరికి శరీరంలో కొన్ని ప్రదేశాలలో కొవ్వు పెరిగి, ఆ ప్రదేశాలు చాలా లావుగా కనిపిస్తూ ఉంటాయి.
బిఎమ్ఐ.. దీన్నే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు. ఎత్తుకు తగ్గ బరువు  ఉన్నారా లేదా తెలుసుకోవడంలో ఇది సహాయపడుతుంది. నేటి కాలంలో అన్ని వయసుల వారిలో అధిక బరువు , ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది.
ఇష్టమైన ఆహారం తింటూనే సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ సూచించిన అట్కిన్స్ డైట్ ప్లాన్ విశేషాలు తెలుగులో తెలుసుకోండి.
రోజంతా అలసటగా, నీరసంగా అనిపిస్తుందా? ఎంత విశ్రాంతి తీసుకున్నా శరీరంలో శక్తి లేకపోతే, అది కేవలం సాధారణ అలసట మాత్రమే కాకుండా Chronic Fatigue Syndrome (CFS) అనే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
టి కాలంలో రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవడం కామన్.  ఉదయం టిఫిన్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తప్పకుండా చేస్తారు.
మధుమేహం అనేది వేగంగా పెరుగుతున్న ఒక  వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కొందరికి కాలివేళ్లు , చేతివేళ్ల కీళ్లలో నొప్పి, మోకాళ్లు , చీలమండలలో వాపు, , నడవడంలో ఇబ్బంది వంటివి ఎదురవుతుంటాయి.  ఇవి యూరిక్ యాసిడ్ పెరగడానికి సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మినుముల పులగం అనేది మన సంప్రదాయ ఆహారాల్లో ఎంతో విలువైనది. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, బలం, శక్తిని అందించే సహజమైన ఆహారం.
వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వర్షం, నీరు నిలవడం, వరదలు వంటివి  వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అనేది పెద్దవారికే వచ్చే వ్యాధి అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సమస్య పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే..
గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలకు ఇంట్లోనే వాము, ధనియాలు, జీలకర్ర, సోంపుతో ఆయుర్వేద చూర్ణం ఎలా తయారు చేయాలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించిన పూర్తి వీడియో.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.