ఆకలి మీద బ్రహ్మాస్త్రం

Publish Date:Oct 16, 2021

Advertisement

అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది పెద్దల మాట. అంటే అన్నాన్ని దైవంతో సమానంగా చూస్తారు. శరీరానికి శక్తినిచ్చి, ఆరోగ్యాన్ని చేకూర్చి జీవితకాలాన్ని హాయిగా సాగేలా చేసేది ఆహారం. అన్నమే కాదు మనిషి కడుపు నింపే ప్రతి ఆహారం కూడా దైవ స్వరూపమే.

ఒక పండ్ల మొక్క నాటుతాం, లేదా విత్తనాన్ని విత్తుతాం. దానికి నీళ్లు పోసి, అపుడపుడు కలుపు తీస్తూ, దానికి పోషకంగా ఎరువులు వేస్తూ రోజులు, నెలలు, సంవత్సరాలు నిరీక్షిస్తే అప్పుడు చెట్టుగా ఎదిగి కాయలు కాస్తుంది. ఆ కాయలున్న చెట్టును పెంచిన వ్యక్తి ఎంతో జాగ్రత్తగా కాడుకుని కాయలు పండ్లుగా మారే దశలో వాటిని కోసి, మార్కెట్లలోనూ లేక రోడ్ల మీద లేక ఇంకా ఇతర మార్గాల ద్వారా అమ్ముతారు. ఒక పండు ధర పది రూపాయలు అయితే దాని వెనుక ఒకరు లేదా ఇంకా ఎక్కువ మంది కష్టం చేసి చిందించిన చెమట తాలూకూ అనుభవాలు కూడా ఉంటాయి. కానీ కొన్న వాటి మీద ఏదో హక్కు ఉన్నట్టు సరిగా తినీ తినక, చెత్త బట్టలలోకి వేస్తూ పండు తాలూకూ కష్టాన్ని అవమానిస్తూ ఉంటాము. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇలాంటి విషయాలు తెలియదు. చాలా ఇళ్లలో పిల్లలు సగం తిని వదిలేసిన పండ్లు, ఆహారపదార్థాలు ఎక్కువగా కనబడుతుంటాయి. వాళ్ళది తెలియని వయసు కావచ్చు కానీ పెద్దలది తెలియని వయసా?? లేక డబ్బె పెట్టి కొనడం ద్వారా వచ్చిన నిర్లక్ష్యపు ధోరణినా??

అన్నమో రామచంద్ర!!

ఒకవైపు  ఇంట్లో ఇలాంటి వృథా జరుగుతూ ఉంటే మరొకవైపు బయట మాత్రం అన్నమో రామచంద్ర అని ఆకలికి నకనకలాడుతున్న అభాగ్యులు ఎందరో!!  మనకేంటి తల్లిదండ్రులు కొద్దో గొప్పో మంచి జీవితాన్నే ఇచ్చారు, ప్రతి తల్లిదండ్రి అలాగే ఇవ్వాలని అనుకుంటారు కూడా, కానీ కొన్ని జీవితాలు తెగిన గాలిపటాల్లా ఉంటాయి. గాలి ఎటు వేస్తే అటు గాలిపటం వెళ్లినట్టు, ఎక్కడ పని దొరికితే అక్కడ చేసుకుంటూ బతికేవాళ్ళు ఉంటారు. కష్టానికి తగ్గ డబ్బులు చేతికి అందని అమాయకులు ఉంటారు, దోపిడీ చేయబడేవారు, బానిస బతుకుకు లోబడిన వారు ఇలా ఎందరో!! వీళ్ళందరూ మురికివాడల్లోనూ, ఊరి పొలిమేరల్లోనూ చిన్న గుడిసెలు వేసుకుంటూ రేపటి గూర్చి కాకుండా ప్రస్తుతం గడిచిపోవడం గురించి ఆలోచిస్తూ బతికే వాళ్ళు. అలాంటివాళ్ళకు ఒకోసారి తిండి కష్టం అవుతుంది. నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లడం కష్టమవుతుంది.

మరోవైపు అన్నదాతా సుఖీభవ అనే స్లోగన్ లతో తెగ చైతన్యపు గొంతులు వినబడతాయి కానీ, ఆహారం దగ్గర అదొక అజమాయిషీ చేసేవాళ్ళు కోకొల్లలు. ఇష్టం వచ్చినట్టు వడ్డించుకుని, నచ్చినంత తిని, చెత్తబుట్టలో పడేసేవాళ్ళు ఎక్కువ. 
జనాభా పెరుగుదల, పేదరికపు  సమస్య, జనాభా లెక్కల్లో నమోదు కాని ప్రజల దైన్యం, పారిశ్రామిక అభివృద్ధిలో యంత్రాల పాత్ర పెరుగుతూ మనిషికి సగటు ఉపాధి మార్గాలు దొరకక, ప్రభుత్వ పథకాల లబ్దికి నోచుకోక, నిరంతరం జీవితంతోనూ, ఆకలితోనూ యుద్ధం చేసేవాళ్ళు ఎందరో కనబడుతుంటారు. 

ఇప్పుడేం చేయాలి??

అవగాహన ముఖ్యం, తదుపరి ఆచరణ అవసరం. అవగాహన చాలామందిలో ఉంటుంది, నిజానికి మనుషులుగా పుట్టిన అందరికి ఆకలి విలువ తెలుసు, అయితే వారి మనసు అంతరాలలో అది ఎక్కడో పెద్ద ప్రాధాన్యత లేని అంశంగా మరుగున పడి ఉంది. దాని ప్రాముఖ్యాన్ని మొదట గుర్తించాలి. ప్రతి మెతుకు వెనుక కష్టాన్ని, ప్రతీ పంట సాగుకు చిందే చెమట ధారను తెలుసుకుంటూ, పిల్లలకు చెబుతూ ఉండాలి. 

పెళ్లిళ్లు, శుభకార్యాలలో అనవసరపు డాబు పోకుండా ఆహారాన్ని దైవంగా భావించి వీలైనంత వరకు వృథా కాకుండా జాగ్రత్త వహించాలి. ప్రతి ఇంట్లో పిల్లలతో ఒక చిన్న విత్తనాన్ని నాటించి వాళ్ళతోనే ఆ మొక్క సంరక్షణ చేయిస్తూ ఉంటే దాని తాలూకూ ఫలితం తప్పకుండా పిల్లల క్రమశిక్షణతో, నడవడికలో, ముఖ్యంగా ఆహారం పట్ల అవగాహన, వృథా చేయకుండా ఉండటం వంటివి అర్థమవుతాయి.అలాగే పిల్లలకు అపుడపుడు ఆహారానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళను చూపిస్తూ వారి కష్టాన్ని తెలియచేస్తూ ఉండాలి. దానివల్ల తాము వృథా చేయడం మాని ఇతరులకు ఇవ్వడమనే మంచి అలవాటు కూడా పెంపొందుతుంది. తిండి కలిగితే కండ కలదోయ్ కండ గలిగిన వాడే మనిషోయ్ అనే మాట నిజమవ్వాలంటే ఆహారం తీసుకోవడం చాలా అవసరమని ఆహారం తీసుకోవడం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో, వృథా చేయకుండా అంతే జాగ్రత్త వహించాలని పిల్లలకు చెబుతూ పెద్దలు ఆచరిస్తే ఈ భారతంలో ఆకలి బాధ ఎక్కడో ఒకచోట పరోక్షంగా అణువంత అయినా తగ్గించిన వాళ్ళం అవుతాము.
                                                                                                                            ◆ వెంకటేష్ పువ్వాడ

By
en-us Political News

  
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.