పుస్తకం మన ప్రియ నేస్తం

Publish Date:Nov 16, 2021

Advertisement

పుస్తకాలు ఎక్కువగా చదివే వాళ్ళని నమ్మకూడదు అని అన్నాడు హెన్రీ డేవిడ్ అనే ఒక రచయిత. కారణం తన ఇంటికి వచ్చిన స్నేహితుడొకరు తన దగ్గరున్న పుస్తకాన్ని చెప్పకుండా పట్టుకుపోయి, అది బాగా నచ్చటంతో తిరిగి ఇవ్వలేదట. ఆశ్చర్యపోవక్కర్లెద్దు ఇలా కూడా ఉంటారండి పుస్తక ప్రియులు.


ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుడు లాంటిది అంటారు. నిజంగానే ఎంత తిరిగినా, ఎంత తిన్నా, ఎంత సేపు పడుకున్నా రాని ఆనందం ఒక మంచి పుస్తకం చదివితే వస్తుంది. ఎప్పుడైనా కాస్త చికాకుగా ఉన్నా, లేదా నిస్పృహలో పడినా పుస్తక పఠనం మనని అందులోంచి బయటకి లాగగలదు.


ఈ రోజు ప్రపంచ పుస్తక దినోత్సవం. ఎవరికి వారు ఒక మంచి పుస్తకాన్ని కొని మనకి ఇష్టమైన వాళ్ళకి కానుకగా ఇద్దాం. పుస్తకం మనిషికి అత్యంత ప్రియ నేస్తం కాబట్టి ఇందుకోసం కూడా ఒక ప్రత్యేకమైన రోజుని కేటాయించాలని నిర్ణయించుకున్న యునెస్కో 1995వ సంవత్సరంలో ఏప్రిల్ 23వ తారీఖుని ఖరారు చేసింది. అప్పటి నుంచి మనం ఈ ఇంటర్నేషనల్ బుక్ డేని జరుపుకుంటున్నాం. ఇదే రోజున సెయింట్ జార్జ్ జన్మదినాన్ని స్పెయిన్ లో జరుపుకుంటారు. ఇప్పటికీ స్పెయిన్ లో ప్రతి పుస్తక కొనుగోలు పై ఒక గులాబీని గిఫ్ట్ గా ఇస్తారు తెలుసా.


ఈ బుక్ రీడింగ్ అలవాటు మనలో సృజనాత్మకతని పెంచుతుంది. మన ఆలోచనా విధానాన్ని కూడా మార్చుతుందనటంలో సందేహమే లేదు. అందుకే పుస్తకం చదివే అలవాటు లేకపోతే వెంటనే అలవాటు చేసుకుంటే చాలా ఉపయోగాలే ఉన్నాయండోయ్. ఒక పుస్తకం మన చిన్నప్పుడు చదివితే మనకు వచ్చే అనుభూతికి, అదే పుస్తకాన్ని కాస్త వయసులోకి వచ్చాకా చదివితే వచ్చే అనుభూతికి మద్య చాలా తేడా ఉంటుంది. కావాలంటే టెస్ట్ చేసి చూసుకోండి.


రిటైరయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళు చేసే పని ఈ బుక్ రీడింగ్ అనుకుంటే పొరపాటే. అసలు వాళ్ళకన్నా జీవితాన్ని మొదలుపెట్టటానికి ప్రపంచంలోకి అడుగుపెట్టేవారికే  ఇది చాలా అవసరం. ఎందుకంటే పుస్తకాలు చదవటం వల్ల కొత్త విషయాల సేకరణ జరుగుతుంది. ఒక పుస్తకం చదివాకా అందులో ఉన్న విషయాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉండటం వల్ల మన జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మనం ఏదన్నా రాయాలన్నా బుక్ రీడింగ్ వల్ల మనం అలవర్చుకున్న పరిజ్ఞానం రాయటంలో  ప్రదర్శించచ్చు.


ఈ పుస్తక పఠనం వల్ల అన్ని రకాల పుస్తకాలు చదవటం అలవాటయ్యి, ఏదైనా సమస్య ఎదురైనపుడు ఎలా దాన్ని హేండిల్ చెయ్యాలో కూడా మనకి చాలా సులువుగా తెలిసిపోతుంది. ముఖ్యంగా మన ఏకాగ్రత పెరుగుతుంది. కుదురుగా ఒక దగ్గర కూర్చునే అలవాటు లేని వాళ్ళు సైతం బుక్ రీడింగ్ హేబిట్ వల్ల దాన్ని అలవాటు చేసుకుంటారు.


నలుగురిలో కలిసే అలవాటు లేనివాళ్ళు చాలా మటుకు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు పుస్తకం చదివే అలవాటు చేసుకుంటే ఇక ఎప్పటికి ఒంటరితనం ఫీల్ అవ్వరు. మొత్తానికి ఒక మంచి పుస్తకం అన్ని వయసుల వారిని అలరిస్తుంది. అందుకే మన లైఫ్ లో మనం ఎంత బిజీ అయిపోయినా మనకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకుని పుస్తకం చదవటంలో ఉండే ఆనందాన్ని అనుభవిద్దాం.

...కళ్యాణి

By
en-us Political News

  
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత...
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.