సెంటిమెంట్ పండుతుందా?.. సభ సక్సెస్ అవుతుందా?

Publish Date:Apr 22, 2025

Advertisement

ఒకే ఒక్క మాటతో రాజకీయం తల్లకిందులు అయిపోయిన సందర్భాలు చరిత్రలో కాదు, నడుస్తున్న చరిత్రలోనూ చాలానే ఉన్నాయి. అయినా.. రాజకీయ నాయకులు  ఎప్పటికప్పుడు నోరు జారుతూనే ఉంటారు. ఇందుకో తాజా  ఉదాహరణ  తెలంగాణ పీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్.     ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ఆంధ్రా రైతులే తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ  చేసిన వ్యాఖ్య  రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్  సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరో వంక పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్య తెలంగాణ రైతుల మనోభావాలను దెబ్బతీసిందని  బీఆర్ఎస్  నాయకులు ఒకరి వెంట ఒకరు కత్తులు దూస్తున్నారు. 

అయితే..  నిజంగా అయన చేసిన వ్యాఖ్య తెలంగాణ రైతుల మనోభావాలను దెబ్బ తీసిందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నట్లు బీఆర్ఎస్ కు మాత్రం పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు  చక్కగా అంది వచ్చాయని అంటున్నారు.  ఒక విధంగా చూస్తే  పీసీసీ అధ్యక్షుడు  బీఆర్ఎస్ కు, స్నేహ హస్తం అందించారని అంటున్నారు.  

ఈ నెల  27 న వరంగల్ లో జరప తలపెట్టిన టీఆర్ఎస్/బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మొదటి నుంచి  టీఆర్ఎస్/బీఆర్ఎస్  సభల సక్సెస్ కు ఇంధనంలా పనిచేసిన  సెంటిమెంట్ ఏదీ లేని ప్రస్తుత పరిస్థితిలో సభ సక్సెస్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే..  పార్టీ మనుగడకు  అత్యంత కీలకంగా భావిస్తున్న  రజతోత్సవ సభను ఎలాగైనా సక్సెస్ చేయాలని  బీఆర్ఎస్ అధినేత  కేసీఆర్  జిల్లాల వారీగా పార్టీ నాయకులకు ప్రతి రోజు పాఠాలు నూరిపోస్తున్నారు.  కాసులు కుమ్మరించి అయినా.. పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని  నాయకులను కేసీఆర్ ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో వినవస్తోంది. 

ఇలాంటి సమయంలో పీసీపీ చీఫ్  ఒక సెంటిమెంటల్ ఇష్యూ ని బంగారు పళ్ళెంలో పెట్టి  బీఆర్ఎస్ కు అందించారని అంటున్నారు. నిజానికి  గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి  ఇతర కారణాలతో పాటుగా సెంటిమెంట్ ఇష్యూ లేక పోవడం  కూడా ఒక కారణంగా బీఆర్ఎస్ నేతలు గుర్తించారు. అలాగే  తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చడంతో  పార్టీకి ఉన్న తెలంగాణ పేగుబంధం తెగిపోయిందని దాంతో  కారు  పార్టీని  సెంటిమెంట్ రివర్స్ లో దెబ్బ తీసిందని గులాబీ పార్టీ గుర్తించిందని అంటారు. 
అదెలా ఉన్నా ప్రస్తుతానికి వస్తే.. తెలంగాణా ప్రభుత్వం సోమవారం ( ఏప్రిల్ 21)న  నిజామాబాద్‌లో నిర్వహించిన  ‘రైతు మహోత్సవ’ సభలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలంగాణ రైతుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా  ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన రైతులే తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ వ్యాఖ్యానించారని బీఆర్ఎస్ నాయకులూ మండి పడుతున్నారు.

నిజానికి  మహేష్ కుమార్ గౌడ్, చెప్పింది సంపూర్ణ సత్యం కాదు, అలాగని  సంపూర్ణ అసత్యమూ  కాదు.  అవును  1923లో నిజాంసాగర్‌ ప్రాజెక్టును నిర్మించినప్పుడు ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పలువురు రైతులు ఇక్కడికి వచ్చి వ్యవసాయంలో స్థిరపడ్డారు. వారంతా వ్యవసాయం చేయడమే కాకుండా మాక్కూడా వ్యవసాయం నేర్పించారు  అంటూ చేసిన వ్యాఖ్య పూర్తి సత్యం కాకపోయినా పూర్తి అసత్యం కూడా కాదు.అక్కడి నుంచి ఇక్కడకు రైతులు వచ్చింది నిజం. కలిసి మెలసి వ్యవసాయం చేసింది నిజం. పరస్పరం అనుభవాలను పంచుకున్నది నిజం. పరస్పరం లాభదాయక వ్యవసాయ పద్దతులను నేర్చుకున్నది నిజం. ఇది చరిత్ర. కాదనలేని చరిత్ర. నిజానికి  మహేష్ కుమార్ గౌడ్  తమ ఉపన్యాసంలో చెప్పింది కూడా అదే. అందులో పెద్దగా తప్పు పట్టవలసింది లేదు. 

అయినా అయన చేసిన  వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆంధ్రా నుంచి వలస వచ్చిన వారు తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ పీసీసీ అధ్యక్షుడు మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమని వ్యవసాయ శాఖ మాజీ  మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌ అపరిపక్వత, అజ్ఞానంతో మాట్లాడిన మాటలు తెలంగాణకు తీవ్ర అవమానకరమని పేర్కొన్నారు.ఆంధ్రా పాలకుల మెప్పుకోసమే ఆయన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తెలంగాణకు బీఆర్‌ఎస్  శ్రీరామరక్ష అని కేసీఆర్‌ పదే పదే చెప్పిన విషయం పీసీసీ చీఫ్‌ మాటలతో తేటతెల్లమైందని అన్నారు. 

అలాగే..  మరో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా మహేశ్‌కుమార్‌ గౌడ్ వైఖరి యావత్‌ తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టు ఉన్నదని అన్నారు. భావదారిద్య్రంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. నాడు తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడ్డ సమైక్య పాలకుల అడుగులకు మడుగులొత్తిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు తెలంగాణలో ఉన్నామనే సోయి మరిచి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలవి బానిస బతుకులని, వారికి బొత్తిగా తెలంగాణ సోయి లేదని బీఆర్‌ఎస్‌ పార్టీ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. అయితే.. పీసీసే చీఫ్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్/బీఆరేస్ రజతోత్సవ సభను సక్సెస్ చేసేందుకు ఎంతవరకు ఉపకరిస్తాయి. ఏ మేరకు సభ సక్సెస్ అవుతుంది అనేది అప్పుడే చెప్పలేమని అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత దినదినాభి వృద్ధి కాదు, క్షణక్షణాభి వృద్ది చెందుతోంది. అందులో అనుమానం లేదు. కానీ..  కుటుంబ చట్రం నుంచి బయట పడక పోవడం ఇప్పటికీ బీఆర్ఎస్  కు శాపంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు. సో. సభ సక్సెస్  అవుతుందా, చప్పగా ముగుస్తుందా? అంటే.. ప్రస్తుతానికి  ‘నో కామెంట్’ అనేదే సరైన సమాధానం అవుతుందని అంటున్నారు.

By
en-us Political News

  
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు. క‌ట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.