Publish Date:Oct 10, 2022
స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి అన్నారు అప్పట్లో శ్రీశ్రీ.. కొంచం అటూ ఇటూగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా ఇది వర్తిస్తుంది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేసి కొత్త జాతీయ పార్టీ స్థాపించేశానని ఆయన సంబరపడిపోతున్నారు. సభలు చేసేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందే కానీ అది ఇంకా ప్రాంతీయ పార్టీయే. రంగూ, రుచీ, వాసనా అంతా ప్రాంతీయమే.
అసలు ముందుగా బీఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభిస్తుందా అన్న అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే దేశంలో బీఆర్ఎస్ పేరుతో రెండు రాజకీయ పార్టీలు రిజస్టర్ అయి ఉన్నాయి. వాటిలో ఒకటి బహుజన రాష్ట్ర సమితి(బీఆర్ఎస్). ఈ పార్టీ కేంద్ర కార్యాలయం వెస్ట్ మారేడ్ పల్లిలోని లలితా నగర్ లో ఉంది. బహుజన సమాజ్ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఉంది. అలాగే దేశంలో బీఆర్ఎస్ పేరు మీద మరో పార్టీ కూడా రిజిస్టర్ అయి ఉందని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పేర కేసీఆర్ స్థాపించిన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభిస్తుందా అన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేస్తూ ఒక తీర్మానం ఆమోదించేసి.. గుర్తింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపేయగానే పార్టీకి గుర్తింపు వచ్చేసినట్లు కాదని పరిశీలకులు అంటున్నారు.
తెరాస సర్వ సభ్య సమావేశంలో ఆమోదించిన తీర్మానం తో పాటు తెరాసను బీఆర్ఎస్ గా మారుస్తూ కేసీఆర్ రాసిన లేఖను తీసుకుని మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి హస్తిన వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి అందించి వచ్చారు. బీఆర్ఎస్ విషయంలో ఇప్పటి వరకూ పడిన అడుగు ఇదొక్కటే. అంత మాత్రానే జాతీయ పార్టీ ఆవిర్బవించేసిందనీ, ఇక జాతీయ స్థాయిలో చక్రం తప్పిడమే తరువాయి అన్నట్లుగా టీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న హడావుడి.. ఆలూ లేదు.. చూలూ లేదు అన్న సామెతను గుర్తుకు తెస్తోంది. ఒక పార్టీ పేరు మార్చుకోవడానికి పెద్ద అభ్యంతరాలేమీ ఉండవని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఆ పేరు మార్పుతోనే జాతీయ గుర్తింపు వచ్చేసినట్లు కాదని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయ గుర్తింపు రావాలంటే అందుకు అవసరమైన ఓట్ల శాతం, సీట్ల సంఖ్య ఉండాలని అప్పుడే జాతీయ గుర్తింపు వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పేరుతో మరో రెండు పార్టీలు ఉండటంతో కేసీఆర్ బీఆర్ఎస్ కు గుర్తింపు లభిస్తుందా అన్న విషయంలో తెరాస వర్గాలలో సైతం అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
అయితే పార్టీ పేరు వేరు, అబ్రివేషన్ వేరు అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ కు జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు అయితే లభించే అవకాశాలు లేవనీ, నిబంధనల ప్రకారం అన్ని పారామీటర్స్ కు అనుగుణంగా ఉంటేనే బీఆర్ఎస్ కు ఎన్నికల సంఘం గుర్తింపు లభించే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/will-kcrs-brs-party-get-ec-recognisation-39-145189.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.