అవినాష్ రెడ్డిని జగన్ వదిలించేసుకుంటారా?

Publish Date:Nov 15, 2024

Advertisement

తన కోసం, తన బాగు కోసం పని చేసిన వారిని కూరలో కరివేపాకులా తీసి పారేయడం జగన్ కు అలవాటే. తన రాజకీయ ప్రస్థానంలో అలా జగన్ కోసం పని చేసి ఆ తరువాత ఆయన చేత అవమానాలు ఎదుర్కొని దూరమైపోయిన వారు ఎందరో ఉన్నారు. ప్రధానంగా తన కోసం, తాను ముఖ్యమంత్రి కావడం కోసం కాలికి బలపం కట్టుకని మరీ రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన సొంత చెల్లి షర్మిల, తాను అరెస్టైనప్పుడు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసిన తల్లి విజయమ్మనూ అధికార పగ్గాలు అందుకున్న తరువాత ఎలా పక్కన పెట్టేశారో రాష్ట్రం మొత్తం తెలుసు. చివరాఖరికి ఆస్తుల విషయంలో కూడా వారిపై కేసులు పెట్టి మరీ సాధిస్తున్నారు

జగన్. తన రాజకీయ లబ్ధి కోసం వ్యక్తులను వాడుకుని వదిలివేయడం జగన్ కు కొత్తేమీ కాదు.  తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల సహా పార్టీలో  జగన్ తన రాజకీయ ఎదుగుదల కోసం నిచ్చెనలా వాడుకుని వదిలివేసిన వారెందరో కనిపిస్తారు. ఆయన ఎన్నికల ప్రచార సందర్భంగా ఎక్కడకు వెళ్లినా ఆ నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మంత్రిని చేస్తా అంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎన్నడూ భావించలేదు. మంగళగిరిలో 2019 ఎన్నికలలో లోకేష్ పై గెలిచిన ఆర్కే  ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా కొండవీటి చాంతాడు కూడా చిన్నబోయేంత పెద్దదిగా ఉంటుంది.  ఇక ఇప్పుడు తాజాగా జగన్ వదిలేసే, కాదు కాదు వదిలించుకునే  వ్యక్తి ఎవరంటే వైసీపీ శ్రేణుల నుంచే గట్టిగా వినిపిస్తున్న పేరు కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. 

ఔను వైఎస్ అవినాష్ రెడ్డిని వదిలించుకోవడం తప్ప జగన్ కు ఇప్పుడు మరో దారి కనిపించడం లేదని అంటున్నారు. సోషల్ మీడియాలో బూతు పోస్టులు పెట్టిన వారిపై కూటమి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. వారు ఏ కలుగులో దాగున్నా వెతికి పట్టుకుని చట్టం ముందు నిలుపుతోంది. కోర్టులు సైతం బూతు పోస్టులు పెట్టిన వారికి మద్దతుగా దాఖలైన పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తప్పు చేసి బెయిలు అడిగితే ఎలా అని నిలదీస్తోంది. దీంతో ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో అసభ్య, అసహ్య, అశ్లీల పోస్టులతో ప్రత్యర్థి పార్టీ నాయకులు, వారి కుటుంబీకులను వేధించి, మనో వేదనకు గురి చేసిన వారి గుండెళ్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. క్షమాపణలు చెప్పుకునో, కాళ్లా వేళ్లా పడి బతిమలాడుకునే తప్పించుకునే వీలు లేదని అర్ధమైపోయింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో తాను అసభ్య పోస్టులు పెట్టడం వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారంటూ ఇటీవల అరెస్టైన వర్రా రవీంద్రారెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించేశారు. ముఖ్యంగా వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో  తాను అసభ్య పోస్టుల వెనుక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడరి వర్రారాఘవరెడ్డి కుండబద్దలు కొట్టడంతో ఇప్పుడిక జగన్ కు ఆయనను వదిలించుకోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.

అలా కాకుండా ఇంకా అవినాష్ ను చిన్న పిల్లోడు, సాత్వికుడు అంటూ వెనకేసుకుని వస్తే.. స్వయంగా జగన్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అసలు వైఎస్ అవినాష్ రెడ్డిని వెనకేసుకుని రావడం వల్లే కంచుకోట లాంటి కడపలో వైసీపీ దెబ్బతింది.  వర్రా వాంగ్మూలంతో జగన్ తల్లిని, చెల్లిని అసభ్యంగా దూషిస్తూ, వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టులు పెట్టడం వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి పిఎ, అతని వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారని సందేహాలకు అతీతంగా తేలిపోయింది. అప్పటి వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఇన్ చార్జ్ సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ ఉన్నారని వర్రా  వాంగ్మూలంతో తేలిపోవడంతో ఇక జగన్ వారిని పట్టించుకునే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

రానున్న రోజులలో జగన్ స్వయంగా తన తల్లి, చెల్లిపై అసభ్య పోస్టులు పెట్టిన వారిని శిక్షించాలని డిమాండ్ చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఇప్పటికే  సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిని వైసీపీ వెనకేసుకు రాదని, వారిని సమర్ధించదనీ మండలిలో ప్రతిపక్ష నేత హోదాలో బొత్స సత్యనారాయణ విస్పష్టంగా చెప్పేశారు. జగన్ కూడా ముందు ముందు అదే చేయాల్సి వస్తుంది. లేకపోతే ఇప్పటికే తన ఐదేళ్ల అరాచక పాలనను ఛీ కొడుతూ చరిత్రలో కనీవినీ ఎరుగని ఓటమిని ఇచ్చిన జనం ఇక ముఖం మీదే ఛీ కొట్టే పరిస్థితి వస్తుందని అంటున్నారు.  

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.