అమరావతి రీలాంచ్ సరే.. జగన్ నిర్వాకంపై మోడీ మౌనమేల?

Publish Date:May 3, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజథాని అమరావతి నిర్మాణానికి 2015లో శంకుస్థాపన జరిగింది. అప్పట్లో ఈ కార్యక్రమానికి ప్రధాని హోదాలో మోడీ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని నభూతో అన్నట్లుగా నిర్వహించారు. సరే మళ్లీ ఇప్పుడు అంటే మే 3న అదే అమరావతికి ప్రధాని మోడీ మరో సారి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని అమరావతి నిర్మాణ పనుల పున: ప్రరంభ కార్యక్రమం అని చెబుతున్నారు. అప్పుడూ.. ఇప్పుడూ కూడా కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వమే ఉంది. ప్రధానిగా నరేంద్రమోడీ, ఏపీ సీఎంగా చంద్రబాబు రెండు సార్లూ కూడా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామనే అన్నారు. అయితే ఈ మధ్యలో ఐదేళ్లలో ఏం జరిగింది? 2015లో అట్టహాసంగా ప్రారంభమైన అమరావతి నిర్మాణ కార్యక్రమం 2019 నుంచి 2024 వరకూ ఎందుకు నిలిచిపోయింది. నిర్వీర్యమైపోయింది అన్నది అందరికీ తెలిసిన చరిత్రే. 

అయితే అప్పటికీ ఇప్పటికీ ఒక తేడా ఉంది. నాడు మోడీ కేవలం అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసి మట్టీ, నీళ్లు ఇచ్చి వెళ్లిపోయారు. అమరావతి నిర్మాణం, పురుభివృద్ధి ఒక బాధ్యతగా భావించలేదు. అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక కార్యక్రమంగానే భావించారు. ఎందుకంటే అప్పుడు కేంద్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమే అయినా, భాగస్వామ్య పక్షాల మద్దతు ఇసుమంతైనా అవసరం లేనంత బలం ఒంటరికగా బీజేపీకే ఉంది. అందుకే అప్పట్లో మోడీ మిత్రపక్షాల ఆకాంక్షలను, డిమాండ్లను పట్టించుకోలేదు. 

అయితే ఇప్పుడు 2025లో మోడీకి ఆ పరిస్థితి లేదు. కేంద్రంలో తన ప్రభుత్వం మనుగడ సాగించాలంటే చంద్రబాబు మద్దతు అవసరం. అందుకే ఇప్పుడు  మోడీ మరో సారి అమరావతి నిర్మాణ పనులను రీ లాంచ్ చేశారు. అవును మళ్లీ అమరావతి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టారు. అయితే ఈ సారి గతంలోలా దీనిని ఒక లాంఛనంగా కాకుండా ఒక బాధ్యతగా  తీసుకున్నారు. అమరావతి అభివృద్ధిలో కేంద్రం బాధ్యతగానే కాకుండా భాగస్వామిగా కూడా ఉంటుందని చెప్పడానికే 57 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలూ చేశారు. అంతే కాదు అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి గ్రాంట్లు అందేలా చూడటమే కాకుండా హుడ్కో నుంచి కేటాయింపులు కూడా వచ్చేలా సంపూర్ణ సహకారం అందించింది. దీంతో గతానికి భిన్నంగా ఈ సారి మోడీ చిత్తశుద్ధి కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అందుకు ఆయన రాజకీయ అవసరం కూడా కారణం అనుకోండి అది వేరే సంగతి. 

ఇంత వరకూ బాగే ఉంది.. 2015లో తానే స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతి నిర్మాణం అర్ధంతరంగా ఐదేళ్ల పాటు నిలిచిపోవడానికీ, నిర్వీర్యమైపోవడానికీ కారణమైన జగన్ నిర్వాకం గురించి మోడీ శుక్రవారం (మే 2)న జరిగిన అమరావతి పనుల పున:ప్రారంభోత్సవ సభలో ఒక్కటంటే ఒక్క మాట అనలేదు. ఐదేళ్ల జగన్ అరాచక పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా వెనుకబడిపోవడం తెలిసిందే. అయితే ఇంతటి అరాచక పాలన సాగించి, కేవలం రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు.. ఒక శక్తి అని చెప్పిన ప్రధాని మోడీ.. ఆ శక్తిని నిర్వీర్యం చేయడానికి గత ఐదేళ్లలో విశ్వ ప్రయత్నం చేసిన జగన్ పాలనపై చిన్న పాటి విమర్శ కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తున్నది. 

మూడు రాజధానుల పేరుతో అమరావతి విధ్వంసానికి పూనుకున్న మాజీ ముఖ్యమంత్రి   జగన్  పాలనను కానీ, జగన్ సర్కార్ ప్రభుత్వ విధానాలపై కానీ చిన్నపాటి విమర్శ కూడా మోడీ చేయలేదు.  గత పదేళ్లుగా అమరావతి నిర్మాణాలకు అవసరమైన అన్ని సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది అని చెప్పుకున్న మోడీ.. మరి గత ఐదేళ్లుగా అమరావతిలో కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చని జగన్ పాలన గురించి అసలు ప్రస్తావించనేలేదు.   ఇక్కడే ఇప్పటికీ మోడీ జగన్ ను షీల్డ్ చేస్తున్నారా? అన్న అనుమాలు వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.