సింహాచలం విషాదం..ఈ పాపం ఎవరిది ?

Publish Date:Apr 30, 2025

Advertisement

సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేళ జరిగిన అపశ్రుతి అత్యంత విషాదకరం. గోడ కూలడమే ప్రమాదానికి కారణం అయినప్పటికీ.. ఈ దుర్ఘటన అనేక ప్రశ్నలను తెరమీదకు తీసుకువస్తున్నది.  భారీ వర్షం కారణంగా ఈ ఘటన జరిగినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే వర్షం ఒక కారణమైతే కావచ్చు కానీ, సింహాచలం అప్పన చందనోత్సవ సమయంలో ప్రతి ఏటా ఏదో ఒక గలాటా జరుగుతూనే ఉంది. అలాంటి పరిస్థితి ఏర్పడటానికి బాధ్యులెవరన్నది తేల్చాల్సి ఉంది. ఏడాది మొత్తంలో ఒక రోజు మాత్రమే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఉంటుంది. ఆ కారణంగా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.  సరిగ్గా అక్షయ తృతీయ రోజు జరిగే ఈ చందన యాత్రలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు రావడం రివాజు. అయితే గతంలో కేవలం పరిమిత భక్తులతో  మాత్రమే ఈ యాత్ర సాగేది. అయితే తరువాత తరువాత పరిస్థితి మారింది.

ఇదో వీఐపీ యాత్రగా మారిపోయింది. సాధారణ భక్తుల తాకిడికి తోడు వీఐపీల హడావుడీ అధికమైంది.  ముఖ్యంగా  పోలీస్, పొలిటికల్, జ్యుడిషరీ, దేవాదాయ, రెవెన్యూ  విభాగాల నుంచి వీఐపీల ఎక్కువైపోయింది. దీంతో సాధారణ భక్తులకు ఇబ్బందులు పెరిగిపోయాయి. దీంతో చ ందనోత్సవ సమయంలో ప్రతిఏటా సమస్యలు ఉత్పన్నమౌతూనే ఉన్నాయి. తాజా సంఘటనే తీసుకుంటే.. మంగళవారం (ఏప్రిల్ 29)అర్ధరాత్రి దాటిన తరువాత, బుధవారం (ఏప్రిల్ 30) తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.  దీంతో సాధారణ దర్శనం కోసం క్యూ లైన్ లో ముందు రోజు రాత్రి నుంచీ  వేచి ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  సరిగ్గా అదే సమయంలో 300 రూపాయల టికెట్ తీసుకున్న భక్తుల క్యూ లైన్ కు  ఆనుకుని ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ గోడను ఇటీవలే తాత్కాలికంగా నిర్మించారు దీనికి బాధ్యులు ఎవరు అన్న విషయంపై చర్చ జరుగుతోంది. నిర్మాణంలో నాణ్యతా లోపం ఉందా అన్న విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. 

ఏటా చందనోత్సవం సమయంలో దేవాదాయ శాఖలో ఏదో ఒక సమస్య, ఇబ్బంది సాధారణం అయిపోయింది. ఒకసారి ఈవో కు వ్యతిరేకంగా, మరోసారి ఉద్యోగులకు వ్యతిరేకంగా సంఘటనలు జరుగుతుంటాయి. ప్రధానంగా టికెట్ల  కేటాయింపు విషయంలో  గందరగోళం నెలకొంటుంది.  సాధారణ భక్తులు డబ్బులు ఇచ్చి కొనే టికెట్ల కంటే..  ప్రోటోకాల్ టికెట్లకి ఎక్కువగా డిమాండ్ ఏర్పడుతున్నది. 
ఇక విషయానికి వస్తే..  గోడ కూలిన ఘటనలో ఏడుగురు  మృతి చెందారు ఘటనా స్థలాన్ని హోం మంత్రి అనిత పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి. బాధ్యులెవరైనా, ఎంతటి వారైనా వదిలేది లేదని హోంమంత్రి ఇప్పటికే హెచ్చరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించినట్లైతే.. ఈ దుర్ఘటనకు ఇంజినీరింగ్ అధికారుల వైపల్యం కారణంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింహాచలం ఆలయంలో ఇంజనీరింగ్ విభాగం నిర్లక్ష్యం చాలా వరకు ఉంటుంది మెట్ల మార్గం నిర్మాణం రోడ్ల విషయంపై కూడా చాలా వరకు విమర్శలు వినిపిస్తున్నాయి తాజా ఘటనలతో పూర్తి విచారణ జరిపించి అసలైన బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

ఇక సింహాచలంలో కూడా తిరుమల తరహాలో దర్శనాలు కల్పించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఈ ప్రతిపాదన గత ఏడాదే అప్పటి జిల్లా కలెక్టర్ చేశారు.  టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే లోపలికి వెళ్లే రీతిన ఆటోమేటిక్ యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే చాలావరకు తొక్కిసలాటలు నిరోధించే అవకాశం ఉంటుంది.  ప్రధానంగా వీఐపీల పేరిట సింహాచలంలో దర్శనాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నది దీనివలన ఆదాయం కోల్పోవడం మాత్రమే గాక ఇతర భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు.

By
en-us Political News

  
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.