ఆంధ్రుల ప్రజా రాజధాని ‘అమరావతి’ స్థితిగతులను వివరించే శ్వేతపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు సమర్పించారు. మీడియా ప్రతినిధుల సమక్షంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన అమరావతి ప్రతి ఒక్క అంశాన్ని వివరిస్తూ మాట్లాడారు. హైదరాబాద్, సికింద్రాబాద్ల చెంతనే సైబరాబాద్ నిర్మాణాన్ని చేపట్టినప్పుడు, హైదరాబాద్ అభివృద్ధికి తాను ముందుకు వెళ్ళినప్పుడు ఏర్పడిన సవాళ్ళను వివరిస్తూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ రోజున ముందు చూపుతో తాను తీసుకున్న నిర్ణయం హైదరాబాద్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిందని చంద్రబాబు చెప్పారు.
ఊహించని విధంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ అర్థిక బలం లేకుండా, రాజధాని లేకుండా మిగిలిపోయినప్పుడు గొప్ప రాజధానిని నిర్మించడం ద్వారా ఒక మంచి ముందడుగు వేయాలని తాను భావించానని, చారిత్రక ప్రాధాన్యం వున్న, అన్ని ప్రాంతాలకూ సమదూరంలో వున్న అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దడానికి ముందడుగు వేసినప్పుడు అమరావతి ప్రాంత రైతుల నుంచి సానుకూల స్పందన లభించిందని చంద్రబాబు చెప్పారు. రాజధాని నిర్మాణం పుంజుకుంటున్న దశలో జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు అధికారంలోకి రావడం, మూడు రాజధానుల డ్రామా ప్రారంభించడంతో అమరావతి నిర్మాణం ఆగిపోయిందని చెప్పారు. దైవానుగ్రహం వల్ల మళ్ళీ అమరావతి తన పూర్వవైభవాన్ని సంపాదించుకునే దిశగా ముందుకు వెళ్తుందని అన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు అమరావతికి సంబంధించిన గణాంకాలను, తన గత ప్రభుత్వం వున్న సమయంలో జరిగిన అభివృద్ధిని, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసాన్నిపవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. జగన్ అనుసరించిన దుర్మార్గపు విధానాల వల్ల ప్రపంచం దృష్టిలో రాష్ట్రం నమ్మకాన్ని కోల్పోయిందని, ఎంతోమంది పెట్టుబడి పెట్టినవారు వెనక్కి వెళ్ళిపోయారని చంద్రబాబు వివరించారు. జగన్ వల్ల రాష్ట్రం కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పాదుకొల్పడానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. అమరావతి గురించి, ఇతర అన్ని అంశాల గురించి తమ మిత్రపక్షమైన ఎన్డీయే ప్రభుత్వానికి వివరించి సహకారం కోసం ప్రయత్నిస్తానని చంద్రబాబు చెప్పారు. అమరావతి నిర్మాణ పనులను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి.. మరోసారి అమరావతికి ఎవరైనా అన్యాయం తలపెట్టకుండా ఏమి చేయాలి.. భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు ఎలా న్యాయం చేయాలి.. ఇలాంటి ఎన్నో అంశాలు వున్నాయని, వాటన్నిటి గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/white-paper-on-amaravati-39-179936.html
కడప పార్లమెంట్ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక వస్తుందని అంటున్నారు. అలా ఉప ఎన్నిక వస్తే ఊరూ వాడా తిరిగి ప్రచారం చేసే బాధ్యతను నేను తీసుకుంటా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీకి కూడా రాకుండా పారిపోయిన వైఎస్ జగన్కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలతో వాతలు పెట్టారు. సోమవారం నాడు విజయవాడలో వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్రెడ్డి, పరోక్షంగా అనిపించినప్పటికీ ప్రత్యక్షంగానే జగన్ మీదకి మాటల బాణాలు వదిలారు.
మనం మనం ఒకటే అని చెప్పి, తన సామాజికవర్గానికే చెందిన వారిని మాయచేసి 514 కోట్ల రూపాయల భారీ మోసం చేసిన మోసగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
జగన్ అక్రమ ఆస్తుల కేసులో నిందితుడు, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రంలోని పలువురు దివ్యాంగ విద్యార్థులు ప్రతిభను కనబరిచి ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా వాళ్ళు మంత్రి లోకేష్ని కలసి కృతజ్ఞతలు తెలిపారు.
బిఆర్ఎస్ నేతలు కెటీఆర్, హరీష్ రావులు తీహార్ జైల్లో కవితను పరామర్శించినట్టు వార్తలు పైకి వెలువడుతున్నప్పటికీ అసలు ఎజెండా మాత్రం ఢిల్లీ పెద్దలను కలవడం అని తెలుస్తోంది.
జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఎయిమ్స్.కి నీటి సరఫరా ఆపేశారు. ఎందుకంటే, ఇది చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించింది కదా.. అందుకని! నీళ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదువుతున్నాయి మహాప్రభో అని ఎయిమ్స్ డైరెక్టర్ మధువానందకర్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు.
ఫ్రాన్స్ ప్రభుత్వం నెపోలియన్ వాడిన తుపాకులను జాతీయ సంపదగా ఇటీవలే ప్రకటించింది. అయినప్పటికీ, వీటిని బహిరంగ వేలంలో ఫ్రాన్స్ పౌరుడు ఒకరు కొనుగోలు చేశారు. వీటిని దేశం దాటించడానికి అవకాశం లేదు.
వారం రోజుల ముందే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఇప్పటి వరకు భారీ వర్షాలు లేవు. నెల రోజులు దాటినప్పటికీ ఇంత వరకు భారీ వర్షాలు లేవు. కానీ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవంపై దృష్టి సారించారు. తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగుదేశం పార్టీ కచ్చితంగా తెలంగాణలో పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ సత్పలితాలను ఇస్తోంది. ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు,ఆరుగురు ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిపోయారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతున్నది. ఆ పార్టీ నుంచి వలసలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో కింగ్ పిన్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.