Publish Date:May 23, 2023
వైబ్రెంట్ గుజరాత్ అంటూ భారీ ప్రచారంతో ఒక్క సారిగా ముఖ్యమంత్రి నుంచి ప్రధాన మంత్రి పదవికి ప్రమోషన్ పొందిన నరేంద్ర మోడీ.. ఇప్పటికీ భారత దేశానికి తాని తాను నిర్దేశిస్తున్న మోడల్ గుజరాత్ అనే చెబుతుంటారు. ముఖ్యమంత్రి నుంచి ప్రధాని దాకా తన ప్రస్తానంలో సహకరించిన స్వరాష్ట్ర అధికారులు, నేతలనెవరినీ ఆయన మరచిపోలేదు.
దేశంలోని ఏ కీలక ప్రభుత్వ శాఖ, ఏ ప్రభుత్వ సంస్థ అధిపతులను తీసుకున్నా వారంతా గుజరాత్ కు చెందిన వారే అనడంలో సందేహాలకు తావివ్వని విధంగా మోడీ జాగ్రత్త పడ్డారు. ఇంతకీ అసలు ఆ వైబ్రెంట్ గుజరాత్ లో ఏం జరుగుతోంది. మోడీ ఎక్కడకు వెళ్లినా.. ఎందు కాలిడినా పొగిడేది గుజరాత్ ను గుజరాత్ సంస్కృతినే. ఇప్పటికీ ఆయన వ్యతిరేకులు మోడీ భారత ప్రధాని అయినా ఆయన తీరు మాత్రం గుజరాత్ ముఖ్యమంత్రి అన్నట్లుగానే ఉంటుందని ఎద్దేవా చేస్తుంటారు. అందుకు ఉదాహరణగా కేటాయింపుల్లోనూ, నియామకాల్లోనూ, బడ్జెట్ లోనూ గుజరాత్ కు ఆయన అగ్రతాంబూలం ఇవ్వడాన్ని ఎత్తి చూపుతుంటారు. మోడీ భారత్ కే మోడల్ గా చెబుతున్న గుజరాత్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయనడానికి మచ్చుతునకగా ఇటీవల ఆ రాష్ట్రంలో వెలుగు చూసిన ఓ ఘోర ఉదంతాన్ని చెప్పుకోక తప్పదు.
మన దేశంలో సతీ సహగమనం దురాచారాన్ని 1829లో రద్దు చేశారు. బెంగాల్ పునరుజ్జీవనోద్యమ పితామహుడిగా గుర్తింపు పొందని రాజా రామ్ మోహన్ రాయ్ సతీ సహగమనానినికి వ్యతిరేకంగా చేసిన ఆందోళన ఫలించి అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ రద్దు చేశారు.
అయితే ఆ దురాచారం మళ్లీ గుజరాత్ లో వెలుగులోకి వచ్చింది. శతాబ్దాల కిందట అంతరించిపోయిన సతీ సహగమనం ( భర్త చనిపోతే ఆ చితిపైనే ఆత్మాహుతి చేసుకోవడం) గుజరాత్ లో బలవంతంగా అమలు చేయబోతే ప్రతిఘటించీ ఫలితం లేని ఓ అబల శబర్మతి నదిలో దూకి తనువు చాలించింది. 28 ఏళ్ల ఓ హిందూ యువతి భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. అత్తింటి వారు ఆమెను సతీసహగమనం చేయాలని ఒత్తిడి తీసుకురావడంతో శబర్మతి నదిలో దూకి తనువు చాలించింది. ఇంతకీ మోడీ చెబుతున్న న్యూ ఇండియా ఎటువైపు సాగుతున్నట్లు? మోడీ గుజరాత్ మోడల్ .. భారత దేశాన్ని ఏ నాగరికత వైపు తీసుకు వెడుతున్నట్లు?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/where-is-modi--new-india-going-39-155792.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.