ఎసిడిటీ సమస్య ఎందుకు వస్తుంది?? దీనికి జాగ్రత్తలు, నివారణలు ఏంటంటే..

Publish Date:Sep 12, 2024

Advertisement

ఎసిడిటీ.. దీన్ని అసిడిటీ.. ఎసిడిటీ అని సంబోస్తూ ఉంటారు. ఇది సాధారణ కడుపు సమస్యలలో ఒకటి. పేరుకు తగ్గట్టుగానే ఇది కడుపులో అధిక యాసిడ్ ఉత్పత్తి కావడం వల్ల కలిగే సమస్య. ఈ ఆమ్లం కడుపులోని గ్రంధుల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఎసిడిటీ వల్ల కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ ఇన్ఫ్లమేషన్, అజీర్ణం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే అసిడిటీ ఎందుకు వస్తుంది?

సాధారణంగా వేళతప్పిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, మద్యపానం, ధూమపానం, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల అసిడిటీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా మాంసాహారం, మసాలా, నూనె ఎక్కువగా ఉండే ఆహారం కూడా ఎసిడిటీని కలిగిస్తుంది.

కడుపులోని గ్యాస్ట్రిక్ గ్రంధులు అదనపు యాసిడ్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించినప్పుడు ఆమ్లత్వం ఏర్పడుతుంది. ఆహారం జీర్ణం కావడానికి యాసిడ్ అవసరం అవుతుంది. అందుకోసమే ఇది కడుపులో ఈ వ్యవస్థ కూడా ఉంది. కడుపులో ఆమ్లాకు ఎక్కువైనప్పుడు అది  సాధారణంగా మూత్రపిండాల ద్వారా శరీరం నుండి తొలగించబడుతుంది. అయితే మరీ అధికంగా ఆమ్లాలు ఉత్పత్తి అయినప్పుడు అనేక ఉదర సంబంధ సమస్యలు ఏర్పడతాయి.

అసిడిటీ మందులతో నయమవుతుంది, మరీ ముఖ్యంగా దీన్ని తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి. 

అసిడిటీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

కొన్ని సాధారణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే అసిడిటీని అరికట్టవచ్చు. ఈ టిప్స్ పాటించడం ఎంతో ముఖ్యం.

యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమయ్యే ఆహారాలను మానేయాలి..

మసాలా, కాఫీ, కార్బోనేటేడ్ పానీయాలు, ఆమ్లాలు, కొవ్వు పదార్ధాలను నివారించాలి.

ఒత్తిడి, ఆమ్లాల ఉత్పత్తిని బ్యాలెన్స్ చేసుకోవడానికి భోజనాన్ని 4-5 చిన్న భాగాలుగా విభజించి 2-3 గంటల వ్యవధిలో తినాలి. 

తిన్న వెంటనే పడుకోకూడదు..

తిన్న తర్వాత పడుకోవడం చాలామంది అలవాటు. అయితే ఈ అలవాటు వల్ల ఎసిడిటీ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పడుకోవడానికి కనీసం 2 గంటల ముందు తినేయాలి.

బరువు తగ్గడం..

అధిక కొవ్వు పొత్తికడుపు అవయవాలపై ఒత్తిడి తెస్తుంది, దీనివల్ల గ్యాస్ట్రిక్ రసాలు అన్నవాహికలోకి ప్రవహిస్తాయి. అధిక బరువు ఉన్నవారిలో ఎసిడిటీ ఎక్కువగా ఉంటుంది.

సొంతంగా మందులు వాడొద్దు..

కొన్ని OTC మందులు కూడా అసిడిటీని కలిగిస్తాయి, ప్రతి డాక్టర్ రోగి పరిస్థితిని బట్టి మందులు రాసాడు. కానీ సొంత అవగాహనతో మందులు వాడితే అవి అసిడిటీ పెరగడానికి కారణం అవుతాయి. కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకోకండి.

కొన్ని ఇంటి చిట్కాలు..

అసిడిటీ అనిపిస్తే కింది ఇంటి చిట్కాలు ఫాలో అవ్వచ్చు..

అరటి, యాపిల్..

అరటిపండ్లు సహజంగా యాంటాసిడ్‌లను కలిగి ఉంటాయి, ఇవి అసిడిటీతో పోరాడుతాయి. పడుకునే ముందు కొన్ని ఆపిల్ ముక్కలను తినడం వల్ల గుండెల్లో మంట లేదా రిఫ్లక్స్ నుండి ఉపశమనం లభిస్తుంది.

కొబ్బరి నీరు..

కొబ్బరి నీరు శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలోని pH స్థాయి ఆల్కలీన్‌గా మారుతుంది. కడుపులో శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. శ్లేష్మం అధిక యాసిడ్ ఉత్పత్తి తీవ్రమైన ప్రభావాల నుండి కడుపుని రక్షిస్తుంది. ఇది కాకుండా, కొబ్బరి నీళ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది కడుపుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 

ఇది కాకుండా, రోజూ తగినంత నిద్రపోవాలి.. కనీసం 7-8 గంటల నిద్ర అన్నివిధాల ఆరోగ్యం.


                                 ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.