తెలంగాణ బిజెపి సారథి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా హైద్రాబాద్ కు చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన విమర్శల నేపథ్యంలో పార్టీలో అంతర్యుద్దం మొదలైంది. రాజాసింగ్ వ్యాఖ్యలను పార్టీ ఇంతవరకు ఖండించలేదు. నేతలంతా మౌనంగానే ఉంటున్నారు. రాజాసింగ్ కు సంఘీభావంగా ఎవరూ నిలబడలేదు. అయినా కేంద్రమంత్రి బండి సంజయ్ రాజాసింగ్ వ్యాఖ్యలను తప్పు పట్టలేదు సరి కదా ఆయనకు సపోర్ట్ గా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. రాజాసింగ్ గొప్ప దేశభక్తుడని హిందూ మతాన్ని పరిరక్షిస్తున్న నేత అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడైన కిషన్ రెడ్డిని విమర్శించిన రాజాసింగ్ ను పొగడ్తలతో ముంచెత్తడం వెనక మతలబేంటి అనే చర్చ ప్రారంభమైంది. మహమ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యలు చేయడంతో రాజాసింగ్ ను కేంద్ర నాయకత్వం గత ఎన్నికల ముందే సస్పెండ్ చేసింది. వరుసగా గోషామహల్ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చిన రాజాసింగ్ హైద్రాబాద్ కు చెందిన ఏకైక ఎమ్మెల్యే. అయినప్పటికీ పార్టీ కేంద్ర నాయకత్వం ఆయనను సస్పెండ్ చేయడంతో పార్టీలో ఏ ఒక్కరూ ఆయన వెన్నంటి నడవలేదు. కనీసం ఆయనకు కలవడానికి కూడా ఇష్టపడలేదు. గత ఎన్నికల ముందు రాజాసింగ్ బర్తేడే వేడుకలు జరుపుకున్నప్పుడు ఏ ఒక్క నేత రాజాసింగ్ కు బర్త్ డే విషెస్ చెప్పలేదు. కానీ తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ రాజాసింగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బండి సంజయ్ ను తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పుడు కూడా రాజాసింగ్ బండి సంజయ్ వెంటే నిలిచారు. తాజాగా హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బిజెపి అభ్యర్థిగా గౌతం రాజును పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించగానే రాజాసింగ్ మండిపడ్డారు. మేకప్ మెన్ లు, టేబుళ్లు తుడిచే వారికి టికెట్లు ఇస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలను బండి సంజయ్ తప్పు పట్టకుండా పైగా పొగడ్తలతో ముంచెత్తడం చర్చనీయాంశమైంది. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి రేసులో బండి సంజయ్ ఉన్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజాసింగ్ ను వెనక నుంచి ఎవరో ప్రోత్సహించడం వల్లే నేరుగా కిషన్ రెడ్డిపై రాజాసింగ్ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. రాజాసింగ్ కు గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ కూడా బండి సంజయ్ ఇప్పించినట్లు ప్రచారంలో ఉంది. తాజా ఘటనలో కూడా పార్టీ అధిష్టానం రాజాసింగ్ పై చర్య తీసుకోకుండా బండి సంజయ్ అడ్డు గోడగా నిలుస్తున్నట్లు ప్రచారంలో ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-is-the-religion-of-bandi-sanjay-39-195709.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు