తెలంగాణ బిజెపి సారథి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా హైద్రాబాద్ కు చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన విమర్శల నేపథ్యంలో పార్టీలో అంతర్యుద్దం మొదలైంది. రాజాసింగ్ వ్యాఖ్యలను పార్టీ ఇంతవరకు ఖండించలేదు. నేతలంతా మౌనంగానే ఉంటున్నారు. రాజాసింగ్ కు సంఘీభావంగా ఎవరూ నిలబడలేదు. అయినా కేంద్రమంత్రి బండి సంజయ్ రాజాసింగ్ వ్యాఖ్యలను తప్పు పట్టలేదు సరి కదా ఆయనకు సపోర్ట్ గా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. రాజాసింగ్ గొప్ప దేశభక్తుడని హిందూ మతాన్ని పరిరక్షిస్తున్న నేత అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడైన కిషన్ రెడ్డిని విమర్శించిన రాజాసింగ్ ను పొగడ్తలతో ముంచెత్తడం వెనక మతలబేంటి అనే చర్చ ప్రారంభమైంది. మహమ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యలు చేయడంతో రాజాసింగ్ ను కేంద్ర నాయకత్వం గత ఎన్నికల ముందే సస్పెండ్ చేసింది. వరుసగా గోషామహల్ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చిన రాజాసింగ్ హైద్రాబాద్ కు చెందిన ఏకైక ఎమ్మెల్యే. అయినప్పటికీ పార్టీ కేంద్ర నాయకత్వం ఆయనను సస్పెండ్ చేయడంతో పార్టీలో ఏ ఒక్కరూ ఆయన వెన్నంటి నడవలేదు. కనీసం ఆయనకు కలవడానికి కూడా ఇష్టపడలేదు. గత ఎన్నికల ముందు రాజాసింగ్ బర్తేడే వేడుకలు జరుపుకున్నప్పుడు ఏ ఒక్క నేత రాజాసింగ్ కు బర్త్ డే విషెస్ చెప్పలేదు. కానీ తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో బండి సంజయ్ రాజాసింగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బండి సంజయ్ ను తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పుడు కూడా రాజాసింగ్ బండి సంజయ్ వెంటే నిలిచారు. తాజాగా హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బిజెపి అభ్యర్థిగా గౌతం రాజును పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించగానే రాజాసింగ్ మండిపడ్డారు. మేకప్ మెన్ లు, టేబుళ్లు తుడిచే వారికి టికెట్లు ఇస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలను బండి సంజయ్ తప్పు పట్టకుండా పైగా పొగడ్తలతో ముంచెత్తడం చర్చనీయాంశమైంది. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి రేసులో బండి సంజయ్ ఉన్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజాసింగ్ ను వెనక నుంచి ఎవరో ప్రోత్సహించడం వల్లే నేరుగా కిషన్ రెడ్డిపై రాజాసింగ్ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. రాజాసింగ్ కు గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ కూడా బండి సంజయ్ ఇప్పించినట్లు ప్రచారంలో ఉంది. తాజా ఘటనలో కూడా పార్టీ అధిష్టానం రాజాసింగ్ పై చర్య తీసుకోకుండా బండి సంజయ్ అడ్డు గోడగా నిలుస్తున్నట్లు ప్రచారంలో ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-is-the-religion-of-bandi-sanjay-25-195710.html
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.