పిఠాపురంలో ఏం జరుగుతోంది?.. టీడీపీ శ్రేణులపై కేసుల సంకేతం ఏమిటి?

Publish Date:Apr 7, 2025

Advertisement

పిఠాపురంలో అసలేం జరుగుతోంది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకర్గం పిఠాపురం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఆ నియోజకవర్గంలో రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు రాజుకుంటున్నాయి. పిఠాపురం నియోజకవర్గాన్ని గత ఏడాది జరిగిన ఎన్నికలలో  పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. ఆ నియోజకవర్గం నుంచే జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసి ఘన విజయం సాధించారు.  అయితే అప్పటి వరకూ ఆ నియోజకర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగుతారని అంతా భావించిన ఎస్పీఎస్ఎన్ వర్మ  చంద్రబాబు చెప్పిన ఒక్క మాటకు తలొగ్గి హుందాగా తప్పుకున్నారు. అంతే కాకుండా పిఠాపురం నుంచి జనసేనాని విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడారు. జనసేనాని విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫలితాలు వెలువడిన అనంతరం పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. అప్పట్లో చంద్రబాబు వర్మకు ఎమ్మెల్సీ వాగ్దానం చేశారు. అయితే తెలుగుదేశం కూటమి కొలువుదీరిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన మధ్య సమన్వయం చెక్కు చెదరకుండా ఉన్నప్పటికీ పిఠాపురంలో మాత్రం ఇరు పార్టీల క్యాడర్ మధ్యా గ్యాప్ పెరుగుతూ వచ్చింది.  నియోజకవర్గంలో వర్మకు ఉన్నపట్టు పలకుబడి జనసేన శ్రేణులలో భయాన్ని పెంచుతున్నది. వర్మ పట్టు పలుకుబడి వారిని భయపెడుతున్నది.  నియోజకవర్గంలో ఆయన అధికార కేంద్రంగా మారుతారన్న భయంతో జనసేన ఆయనను పక్కన పెట్టడం ప్రారంభించింది. 

ఇక ఇప్పుడు తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా పిఠాపురం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్య టించారు. ఆ సందర్భంగా జనసేన, తెలుగుదేశం శ్రేణుల మధ్య విభేదాలు ప్రస్ఫుటంగా బయట పడ్డాయి. జనసేన తీరు ఏరు దాటాకా అన్న సమెతను తలపింప చేస్తున్నదని తెలుగుదేశం శ్రేణులు మాత్రమే కాదు, రాజకీయ పరిశీలకులు కూడా అంటున్నారు. ఎందుకంటే నాగబాబు పర్యటన సంద ర్భంగా వర్మకు ఆహ్వానం అందలేదు. నాగబాబు ఈ పర్యటనలో కొన్ని ప్రారంభోత్వాలలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ తరఫున జరిగిన ఈ అధికారిక కార్యక్రమాలకు వర్మకు ఆహ్వానం అందలేదు. దీనికి నిరసనగానా అన్నట్లుగా నాగబుబు పర్యటన ఆసాంతం తెలుగుదేశం కార్యకర్తలు వర్మ అనుకూల నినాదాలు చేశారు. ప్రతిగా జనసేన కార్యకర్తలు జనసేన, పవన్ కల్యాణ్, నాగబాబు అనుకూల నినాదాలు చేశారు. ఇరువర్గాల పోటా పోటీ నినాదాలతో నాగబాబు పర్యటించిన రెండు రోజులూ పిఠాపురం దద్దరిల్లిపోయింది. అయితే అది అక్కడితో ఆగిపోలేదు. నాగబాబు పర్యటన ముగిసిన తరువాత.. తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు నమోదౌతున్నాయి. జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు ఒక కేసు, ఒక ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు ఇంకో కేసు నమోదైంది. 
స్థానిక జనసేన నాయకుడుమొయిళ్ల నాగబాబు ఫిర్యాదుపై  తెలుగుదేశం కార్యకర్తలపై కేసు నమోదైంది.  తెలుగుదేశం కార్యకర్తలు తనను అడ్డుకుని తన మోటార్ సైకిల్ ను ధ్వంసం చేశారని మెయిల్ల నాగబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదింది. ఇక ఇంకో కేసు  ఏఎస్ఐ జానీ బాష ఫిర్యాదు మేరకు నమోదైంది. తెలుగుదేశం కార్యకర్తలు తన విధులకు ఆటంకం క లిగించారని ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై క్షణం ఆలస్యం చేయకుండా పోలీసులు కేసులు నమోదు చేశారు.  
ఇక్కడ రెండు విషయాలను చెప్పుకోవలసి ఉంటుంది. తెలుగుదేశం కూటమి అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఏకంగా పోలీసులే వారికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇదే పరిస్థితి జగన్ హయాంలో కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఎదుర్కొన్నారు.  దీనిని బట్టి చూస్తుంటే స్థానిక పోలీసులు జనసేన ఆదేశాలను అమలు చేస్తున్నారని భావించాల్సి వస్తోంది.  ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే పిఠాపురంపై దృష్టి పెట్టాలి. లేదంటే పిఠాపురం తెలుగుదేశం శ్రేణుల్లో అసంతృప్తి తారస్థాయికి చేరుకుని పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది.  అాదే జరిగితే పిఠాపురంలో నష్టపోయేది తెలుగుదేశం మాత్రమే కాదు జనసేనే కాదు. రెండు పార్టీలతో పాటు కూటమి ఐక్యతకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.  పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత ఇరు పార్టీలపైనా సమానంగా ఉంటుంది. ఒంటి చేతి చప్పట్ల వళ్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.