సర్వేల వెనుక చీకటి కోణాలు! ఆరా సర్వే అసలు కథేంటి?

Publish Date:Jul 15, 2022

Advertisement

తెలంగాణలో ఇప్పుడు సర్వేల సీజన్ నడుస్తోందా? ఎన్నికల వ్యూహ కర్తల హవా  నడుస్తోందా? రాష్ట్రంలో సర్వే జనులు, ఎన్నికల వ్యూహకర్తలకు డిమాండ్ పెరుగుతోందా అంటే, అవుననే సమాధానమే వస్తోంది. అయితే, అదే సమయంలో, ప్రతి సర్వే వెనక ఒక చీకటి కోణం దాగుందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

గత మూడు నాలుగు రోజులగా ఆరా మస్తాన్ సర్వే చుట్టూ సాగుతున్న చర్చ రచ్చ వివాదం వెనక కూడా కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల చీకటి కోణం దాగుందని, కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నట్లు తెసుస్తోంది.   కొద్దిరోజుల క్రితం టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ హైర్ చేసుకున్నఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ మొదలు బీజేపీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న, ఆరా మస్తాన్ వరకు అందరు చేసిన సర్వేలలో కాంగ్రెస్ నెంబర్ వన్ ప్లేస్’లో ఉందని, చెప్పు కొచ్చారు. అయితే, సర్వేల ఆధారంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖామని చెప్పిన రేవంత్ రెడ్డి, ఆ అందరి సర్వే నివేదికలు, తనకు ఎక్కడి  నుంచి వచ్చాయో, ఎవరు ఇచ్చారో మాత్రం చెప్పలేదు.

అయితే,రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటున్న రేవంత్ రెడ్డి వంటి నాయకులు తమ అభద్రతా భావాన్ని, భయాన్ని  కప్పిపుచ్చుకునేందుకు  సర్వేలను అడ్డుపెట్టుకుని గంభీర ప్రకటనలు చేయడం కొత్త విషయం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అప్పుడప్పుదు ఇలాంటి విన్యాసాలు చేస్తూనే ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఏదో గాలి కబురుగా కాకుండా, సర్వే సంస్థలు, సర్వే సంస్థల యజమానుల పేర్లు కూడా  తీసుకున్నారు.  ఆ నివేదికలు అన్నీ, తన కళ్ళతో తాను చూసినట్లే చెప్పుకొచ్చారు. ఒక విధంగా,  విత్ అల్ డ్యూ రేస్పెక్ట్స్ టూ కేఏ పాల్ , అయన స్టైల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసిందని, తాను ముఖ్యమంత్రి అయిపోయాననే భ్రమలు సృష్టించే ప్రయత్నం చేశారు. బహుశా, ఆ సంస్థలేవీ తమను పట్టించుకోవని అనుకున్నారో  ఏమో కానీ, సర్వే సంస్థల పేర్లు చెప్పి మరీ జబ్బలు చరుచు కున్నారు.  అయితే, కాంగ్రెస్ ‘బలుపు’కు రేవంత్ ఆధారంగా చూపిన ఆరా మస్తాన్’ రేవంత్ రెడ్డి తమ  సంస్థ పేరు తీసుకునందున, వివరణ ఇచ్చేదుకు స్వయంగా  తెరమీదకు వచ్చారు.

ఆయన, తమ సంస్థ జరిపిన సర్వేకి సంబంధించి రేవంత్ చెప్పింది తప్పని చెప్పారు. ఆయన వెర్షన్ అయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్లేస్ లో కాదు థర్డ్ పొజిషన్  లో ఉందని తమ సర్వే నివేదికను బయట పెట్టారు. అక్కడితో అగ్గి రాసుకుంది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ, సుప్రీం కోర్టు చేయని చౌకీదార్ చోర్  వ్యాఖ్యలను చేసినట్లు ప్రచారం చేసి, చివరకు సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పినట్లు, ఆరా మస్తాన్ కోర్టుకు వెళితే రేవంత్  రెడ్డి కూడా క్షమాపణలు చెప్పవలసి వస్తుందని అనుకున్నారో ఏమో కానీ, రేవంత్ రెడ్డి అనుచరులు ఎదురు దాడి ప్రారంభించారు.   అప్పుడు గానీ, రేవంత్ రెడ్డి ఎక్కడ తప్పులో కాలేశారో ఆయనకు, కాంగ్రెస్ పార్టీలో ని ఆయన వర్గానికి తెలిసినట్లు లేదు. అయితే, రేవంత్ వ్యతిరేక వర్గం మాత్రం వెంటనే సన్నాయి నొక్కులు ప్రారంభించింది.

రేవంత్ రెడ్డి తమ ఇమేజ్ ని పెంచుకునేందుకు పార్టీ ఇమేజ్ ని దెబ్బతీశారని లోపాయికారిగా దెప్పిపొడవడం  ప్రారంభించారు. అసత్యాలు, అర్థ సత్యాలు  చెప్పి కాంగ్రెస్ పార్టీ పరువు తీశారని కాంగ్రెస్  సీనియర్లు  ఢిల్లీకి  వర్తమానం చేర వేశారు. అదే సమయంలో, రేవంత్ వర్గం డ్యామేజి కంట్రోల్ చర్యల్లో భాగంగా, ఆరా మస్తాన్ పుట్టు పూర్వోత్తరాలు, బయటకు తీసి ఆయనకు బీజేపీతో ఉన్న సంబంధాలను బయట పెట్టారు. ఆయన భావజలాం లోతులు తవ్వి ఆయన సంఘీయుడు అని తేల్చారు. కావచ్చును, అయనకు బీజేపీతో సంబంధాలు ఉన్న మాట నిజం కావచ్చును. ఆర్ ఎస్ ఎస్ భావజాలంతో సంబంధాలు ఉంటే ఉండ వచ్చును, ఆమాటకొస్తే, రేవంత్ రెడ్డి రాజకీయ మూలాలను తవ్వి తీసినా ఆయన కూడా  సంఘీయుడే.

ఏబీవీపీలోనే ఆయన రాజకీయ జీవితం మొదలైందని అంటారు.  అయితే, పార్టీ వర్గాల సమాచారం మేరకు, ఎందుకోసమో, ఎందు కోసమో ఏముంది లెండి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సొంతగా జరిపించిన సీక్రెట్ సర్వే లో కాంగ్రెస్ పరిస్థ్తితి ఏమంత బాగలేదని తేలిందని, ఢిల్లీకి సమాచారం చేరినట్లు తెలుస్తోంది. అలాగే, రేవంత్ రెడ్డి పీసీసి చీఫ్ గా కొనసాగితే, పెద్ద సంఖ్యలో రెబెల్ అభ్యర్ధులు బరిలో దిగే ప్రమాదముందని, ఆయన తమ వర్గం వారికే టికెట్లు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారని, అదే జరిగితే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని సీనియర్లు నేరుగా అధిష్టానానికి నివేదికలు సంర్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే రేవంత్ రెడ్డి  సర్వే నివేదికలను అడ్డు పెట్టునికి తనను తానూ రక్షించుకునే ప్రయత్నం చేశారని,  విశ్వనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే, అది ఎవరి వ్యుహమో, ఎవరితో ఎవరి చీకటి ఒప్పందమో ఏమో కానీ, ఆరా మస్తాన్ తెర మీదకు రావడంతో రేవంత్ కథ అడ్డం తిరిగిందని, అంటున్నారు.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.