Publish Date:Apr 18, 2020
* క్రీస్తురాజపురం లో పశ్చిమ బెంగాల్ యువకుల ఆవేదన
లాక్ డౌన్ కారణంగా పనులు లేక పస్తులు ఉంటున్న వలస కార్మికుల అవస్థలు విజయవాడ లో ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. స్థానికులు పెట్టే ఆహారంతో కడుపు నింపుకుంటున్న కార్మికులు తమను ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన. వారి ఆందోళన కు మద్దతు పలికిన బిజెపి నేతలు మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజి, రాష్ట్ర మీడియా కన్వీనర్ వుల్లూరిగంగాధర్.
షేక్ బాజీ మాట్లాడుతూ- మగ్గం పనుల కోసం పశ్చిమబెంగాల్ నుంచి విజయవాడ కు వలస వచ్చిన 536మంది ఈ ప్రాంతంలో నివాసాలు ఉంటున్నారు, అప్పుడప్పుడు దాతలు ఇచ్చిన సాయంతో కడుపు నింపుకుంటున్నారు, లేని రోజు పచ్చి బంగాళ దుంపలు తింటున్నారు.. లేదా పస్తులు ఉంటున్నారని చెప్పారు. ఇక్కడ రేషన్ కార్డు లేకపోవడం తో వీరిని ఎవరూ పట్టించుకోవడం లేదని, వాలంటీర్ లు కూడా వీరి వివరాలను నమోదు చేసుకోవడం లేదని, ప్రభుత్వం వాళ్ల బాధను అర్ధం చేసుకుని ఆహారం అందించాలని, ఇక్కడ సాధ్యం కాదంటే...వారి సొంత రాష్ట్రానికి పంపే ఏర్పాటు చేయాలని బాజీ కోరారు.
గంగాధర్ మాట్లాడుతూ-ఊరు కాని ఊరు వచ్చి వీరంతా అవస్థలు పడుతున్నారని, ఇటీవలే ఈ ప్రాంతానికి సమీపంలో రెడ్ జోన్ ప్రకటించారని, ఇరుకు గదుల్లో నివాసం ఉండే వీరిలో ఎవరికైనా ఇబ్బంది వస్తే నష్టం భారీగా ఉంటుందని, వీరి ఆకలి తీర్చాల్సిన బాధ్యత అధికారుల పై ఉందని అన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్లామనే, స్పందించి బెంగాల్ యువకుల ఆకలి తీర్చేలా ఏర్పాటు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వాలంటర్ వ్యవస్థను తక్షణమే ఇక్కడకు పంపి వీరికి తగు సాయం చేయాలని గంగాధర్ డిమాండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/west-bengal-youth-stuck-in-vijayawada-39-97873.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.