సంక్షేమ పథకాల రీ ఇంజనీరింగ్ జరగాలి!

Publish Date:Feb 13, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం (ఫిబ్రవరి 14) అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, కేటాయింపులు,  అభివృద్ధి, సంక్షేమం తదితర అంశాలపై తెలుగువన్ ఎండీ కంఠం నేని రవిశంకర్, సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ తో  వాస్తవ వేదిక వేదికగా చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ సారాంశం ఇంది. 

పీవీ రమేష్ 1985 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా,  ఆరోగ్య శాఖ  కార్యదర్శిగా  పనిచేశారు. అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితి,ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్  వంటి సంస్థల్లో అత్యున్నత స్థాయి పదవులలో పని చేసిన అనుభవం ఆయన సొంతం.  ఆయన కెరీర్ మొత్తంలో నిబంధనల గీత దాటకుండా నిజాయితీగా, నిష్కర్షగా వ్యవహరించారు. తన పరిధిలోనిది కాని పని చేయాల్సి వస్తే సీఎం అయినా సరే ఎలాంటి శషబిషలూ, మొహమాటాలూ లేకుండా ఇది సాధ్యం కాదు సార్ అని చెప్పగలిగిన స్థైర్యం, ధైర్యం ఆయన సొంతం. అటువంటి డాక్టర్ పీవీ రమేష్ బడ్జెట్ అంటే ఏమిటి?  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల పరిమితి, పాపులిజం వల్ల ఎదురయ్యే విపరిణామాలను విపులంగా వివరించారు.  
పోటీలు పడి మరీ ఓట్ల కోసం డబ్బులు పంచుకుంటూ పోతే ఏపీ దివాళా తీస్తుందని హెచ్చరించారు. ఎన్నికల హామీల అమలు అంటూ  కేటాయింపులు చేయడం వల్ల బడ్జెట్ మొత్తం సంక్షేమ పథకాలకే సరిపోతోందన్న పీవీ రమేష్ దీని వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని హెచ్చరించారు.   రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 ప్రకారం, రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా అప్పులు చేయకూడదు.  15వ ఆర్థిక సంఘం వరకు రాష్ట్రాలు తమ జిఎస్‌డిపి  లో 3.5% వరకు అప్పు తీసుకోవచ్చు. అయితే 16వ ఆర్థిక సంఘం దీనిని మూడు శాతానికి తగ్గించింది.   రాష్ట్ర విభజనకు ముందు వరకూ  అప్పులు 2.5% కంటే తక్కువగా ఉండేవన్న ఆయన అప్పట్లో రెవెన్యూ సర్ ప్లస్ ఉండేదని వివరించారు. అయితే  ప్రస్తుతం రాష్ట్రం తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రభుత్వం నేరుగా చేసే అప్పులే కాకుండా కార్పొరేషన్ల ద్వారా చేసే బడ్జెటేతర అప్పులు  ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయన్నారు. 

ఇక సాధారణంగా ఖర్చు పెట్టే డబ్బు వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఆదాయం వస్తుంది? ప్రజల జీవన ప్రమాణాలు ఏమేరకు పెరుగుతాయి అన్నది హేతువుగా ఉండాలన్న పీవీ రమేష్.. ప్రస్తుత ప్రభుత్వాలు మాత్రం అటువంటి విషయాలపై దృష్టి పెట్టకుండా, రాజకీయ లబ్ధే లక్ష్యంగా సొమ్ముల పందేరానికే ప్రాధాన్యత ఇస్తున్నారని పీవీ రమేష్ అన్నారు.   పోలవరం వంటి కీలక ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ఖర్చు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో  30 శాతానికి పైగా పిల్లలు పోషకాహార లోపం, 50 శాతం మంది  మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. వీటన్నిటికీ బడ్జెట్ లో పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచాలంటే..  ఉన్న అప్పులు ఎంత, ఆర్థిక పరిస్థితి ఏమిటి అనే  వాటి విషయంలో పారదర్శకత పాటించి సవరించుకోవాలన్నారు.   ఎక్కువ వడ్డీకి తీసుకున్న అప్పులను తక్కువ వడ్డీకి మార్చుకునే మార్గాలను అన్వేషించాలి. సంక్షేమ పథకాలను అర్హులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలి. తల్లికి వందనం వంటి పథకాలను ధనికులకు కూడా వర్తింప చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.  విద్య, వైద్యం,   పోషకాహారం వంటి వాటిపై పై పెట్టుబడి పెట్టాలన్నారు.  ప్రతి పథకాన్ని మళ్ళీ సమీక్షించి, దాని వల్ల ఎవరికి ఉపయోగం ఉందో చూసి రీ-ఇంజనీరింగ్ చేయాలని డాక్టర్ పీవీ రమేష్ అన్నారు. 

డాక్టర్ పీవీ రమేష్ తో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో  వీక్షించండి.

 

By
en-us Political News

  
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్‌ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజ‌కీయ స‌న్యాసం చేసిన‌ట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్ప‌టికీ ఆయ‌న‌ త‌న టీం ద్వారా అకౌంట్ స‌ర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జ‌గ‌న్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజ‌య‌సాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవ‌ల జ‌గ‌న్ అర్ధంప‌ర్దం లేకుండా చేసిన మావిగ‌న్ అనే ప్ర‌తిపాద‌న‌ మీదే. కానీ రేణుక చౌద‌రి స‌భ‌లో లేవ‌నెత్తిన క‌మ్మ‌రావ‌తిని ప‌ట్టుకుని.. పోస్టులు పెట్ట‌డం స‌రికాద‌ంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.
సీఎం హోదాలో నాడు అమరావతి శాసన రాజధాని , విశాఖ పరిపాలన రాజధాని , కర్నూలు న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు.
దేశంలో ఉన్న అన్ని పార్టీల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమ‌రావ‌తి బిల్లుకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని పార్ల‌మెంటు హాలులో గురువారం ఉదయం క‌లిసిన లోకేష్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల త‌ర‌ఫున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.
వైసీపీ నేతలు అవగాహన లేకుండా ప్లాట్లు, ఖర్చులంటూ అవగాహనా రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తూ తమ అజ్ణానాన్ని చాటుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.