ఏడాది క్రితమే సెక్షన్ 8 పై చంద్రబాబు లేఖ

Publish Date:Jun 25, 2015

Advertisement

నోటుకు ఓటు కేసు ఎన్నో మలుపులు తిరిగి ఆఖరికి సెక్షన్ 8 అమలు వరకూ వచ్చింది. ఇదే విషయం పై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వాదోపవాదాలు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం సెక్షన్ 8 అమలుకు ససేమిరా వద్దంటే, ఏపీ ప్రభుత్వం సెక్షన్ 8 అమలు అవ్వాల్సిందే అని పట్టుబడుతోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సెక్షన్ 8 అమలు గురించి గవర్నర్ ఎప్పుడో కేంద్రాన్ని సంప్రదించి తన బాధ్యతలు గురించి అడుగగా కేంద్రం కూడా కొన్ని ప్రత్యేక భాద్యతలను గవర్నర్ కు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ సెక్షన్ 8 అమలుపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా రాష్ట్ర విభజన తరువాత.. సరిగ్గా ఏడాది క్రితం హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రుల భద్రత నిమిత్తం సెక్షన్ 8 అమలు చేయాలని ప్రధాని మోదీకి లేఖ కూడా రాసినట్టు రాజకీయ విశ్లేషకుల వెల్లడి.

 

అయితే ఈ లేఖపై అప్పట్లో కేంద్రం కూడా స్పందించి హైదరాబాద్ లో ఉన్న భద్రతా వ్యవస్థపై కొన్ని ప్రత్యేకమైన భాద్యతలను గవర్నర్ కు అప్పగించింది. శాంతి భద్రతలకు సంబంధించిన ఏ నివేదిక అయిన పోలీసు అధికారులు గవర్నర్ కు అప్పగించాలని.. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దానిపై నివేదిక కోరే, విచారణకు ఆదేశించే హక్కు, చర్య తీసుకొనే అధికారం గవర్నర్‌కు ఉంటాయని.. బాధితుల హక్కుల రక్షణ కోసం ఆయన అవసరమైన ఆదేశాలు కూడా జారీ చేయవచ్చు’’ అని కేంద్రం ఆ లేఖలో స్పష్టం చేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కేంద్రం తీసుకున్న నిర్ణయానికి స్పందించి గవర్నర్ కు విస్తృత అధికారాలు ఇవ్వాలనడం సరికాదని... ఒకవేళ గవర్నర్‌ తన అధికారాలను వినియోగించుకోవాల్సి వచ్చినా, తెలంగాణ కేబినెట్‌ సలహా మేరకే నడచుకోవాలి కేంద్రానికి లేఖ రాశారు. దీంతో అదే సమయంలో ‘‘గవర్నర్‌ విధులు, భాధ్యతలు, అధికారాలు (ఫంక్షనాలిటీస్‌)’’ మీద సవివరమైన నోట్‌ ఒకటి తయారు చేసి, గవర్నర్‌ వ్యక్తిగత అవగాహన కోసం రాజ్‌భవన్‌కు పంపినట్టు తెలుస్తోంది.

 

కేంద్రం పంపిన నోట్ ఆధారంగానే నోటుకు ఓటు కేసు వ్యవహారంపై గవర్నర్ నరసింహన్ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ అభిప్రాయం కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రెండు రాష్ట్రాల మధ్య ఈ కేసు వల్ల వివాదాలు పెద్ద ఎత్తున తలెత్తుతున్నాయని.. ఈ గొడవల వల్ల నగరంలో శాంతి భద్రతలు చెడిపోయే అవకాశం ఉందని.. సెక్షన్‌ -8 ప్రకారం ఈ కేసు దర్యాప్తును నేను నేరుగా (తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేకుండా) పర్యవేక్షించవచ్చా? అందుకోసం నోటిఫికేషన్‌ ఇవ్వవచ్చా? అని ఏజీని కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఏజీ కూడా గవర్నర్‌ తన విచక్షణ మేరకు నోటిషికేషన్‌ జారీ చేయవచ్చని పేర్కొన్నట్టు తెలుస్తోంది.

 

కాకపోతే ఎప్పుడో సెక్షన్ 8 పై గవర్నర్ కు అధికారాలు ఇచ్చినా అప్పుడు అంత ఆందోళనకరమైన సమస్యలేవీ లేవు కాబట్టి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఈ నోటుకు ఓటు కేసు ఉదంతం బయటకు వచ్చిన తరువాత ఇప్పుడు సెక్షన్ 8 అవసరం ఏర్పడింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సెక్షన్ 8 అమలు అనేది కొత్తగా ఇప్పుడే తెరపైకి వచ్చినట్టు రాద్ధాంతం చేస్తుంది. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేస్తే తమకు ఎక్కడ నష్టం కలుగుతుందో అని తెలంగాణ ప్రభుత్వం సెక్షన్ 8 అమలు కాకుండా చూడటానికి తెగ ప్రయత్నిస్తుంది.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.