ఏపీలో చంద్రోదయం.. దేశానికి వెలుగుల ప్రసారం

Publish Date:Nov 15, 2024

Advertisement

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఓ ప్రముఖ పత్రిక  చేసిన సర్వేలో జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచి సంచలనం రేపారు.  ప్రస్తుతం ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా ఐదో స్థానంలో నిలవడం విశేషం. కేవలం 16 ఎంపీ స్థానాలు గల తెలుగుదేశం అధినేత  జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో  ఉన్నారంటే అది మామూలు విషయం కాదు.  ఆయన విధానాలు నిత్యనూతనంగా అటు అధికారుల,ఇటు ప్రజల మన్నలు పొదే విధంగా ఉంటాయి. ఎన్డీఏ ప్రభుత్వభాగస్వామిగా ఉన్నా రాజకీయాల్లో ఆయనే ఇప్పటి నాయకులకన్నా సీనియర్. ప్రధానిమోదీ కంటే ముందుగానే రాజకీయాలలోకి వచ్చిన చంద్రబాబు అప్పటి నుంచీ కూడా  క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.

ఆయన ముఖ్యమంత్రి గా ఎంత క్రియాశీలకంగా ఉంటారో ప్రతిపక్ష నేతగా కూడా అలాగే వ్యవహరించేవారు. ఏడుపదులు దాటిన వయస్సులో కూడా చంద్రబాబు  ఎండనక వాననక 2024 ఏపీ ఎన్నికల్లో  ప్రచారం చేశారు. ఓ పత్రిక ఇటీవల నిర్వహించిన జాతీయ సర్వేలో మొదటి నాలుగు స్థానాల్లో మోదీ, ఆరెస్సెస్ నేత భగవత్, అమిత్ షా, రాహుల్ గాంధీ ఉన్నారు. వీరు నలుగురు జాతీయ రాజకీయాలలో కీలకంగా ఉన్నారు.  ప్రపంచంలో భారత్ ను ప్రముఖంగా గుర్తించడంలో మోదీ విదేశాంగ విధానం ఆయనను మొదటి స్థానంలో నిలిపింది. సొంత బలంతో మూడోసారి  విజయ తీరాలకు బీజేపీని చేర్చ లేకపోయినా ప్రపంచ కీలక నేతలతో  మోడీ నెరిసిన సంబంధాలు భారత్ ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. అలాగే అమిత్ షా స్ట్రాటజీ బీజేపీని ఇప్పటికీ జాతీయంగా, రాష్ట్రాలలోనూ అధికారానికి దగ్గరగా తీసుకు వెళుతున్నది. హర్యానా ఉదంతమే తాజా ఉదాహరణ. ఇక రాహుల్ గాంధీ  విధానం కాంగ్రెస్ ను రెండు రాష్ట్రాల లో అధికారంలో తేవడంతో పాటు పార్టీకి జవసత్వాలు కల్పించడంతో  నాలుగో స్థానంలో నిలిచారు. చంద్రబాబు గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లోనే తలమునకలుగా ఉన్నారు.

రాష్ట్రంలో గత ఐదేళ్లుగా వైసీపీ రాక్షస పాలనపై అలుపెరుగని పోరాటం చేస్తూ తన దృష్టిని పూర్తిగా రాష్ట్రంపైనే కేంద్రీకరించారు.   అంతకు ముందు ఐదేళ్లు రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నా రాష్ట్ర విభజన  సమస్యల కారణంగా  ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి సారించలేదు.  రాజధాని అమరావతిని  రూపుదిద్దేపనిలో రికార్డు స్థాయిలో భూమి సేకరించి అభివృద్ధి బాటలు వేసారు. 2019లో ఊహించని పరాజయంతో  విపక్షానికే పరిమితమైన తెలుగుదేశం పార్టీని 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించేలా నడిపించడంలో పెట్టినా అవిశ్రాంతంగా శ్రమించారు.  పడిలేచిన కెరటంలా 2024లో తిరిగి అధికారం సాధించి,మళ్లీ అమరావతి అభివృద్ధి పై దృష్టి పెట్టారు.  వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్టు  చేసి 52 రోజులు జైలులో పెట్టినా ఏ మాత్రం ధైర్యం కోల్పోలేదు.  
చంద్రబాబు వ్యూహరచనలలో మేటి.  ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఆనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు.ముఖ్యంగా జాతీయంగా మోదీని, స్థానికంగా జగన్ ను దీటుగా ఎదుర్కొని నిలిచారు.

2019 ఎన్నికల ముందు ప్రధాని మోదీతో ప్రత్యేక హోదా విషయంలో విభేధించడం ద్వారా ఆయన వ్వూహాలు బెడిసి కొట్టినా, 2024 నాటికి తిరిగి పడి లేచిన కెరటం లాగా మోదీతో సఖ్యత నెరపి అఖండ విజయం సాధించడంతో పాటు ఎన్డీయేలో కీలకంగా మారారు.  అయినా జాతీయ రాజకీయాల జోలికి వెళ్ల కుండా కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలపడం, అమరావతి,పోలవరం పూర్తి  లక్ష్యంగా ముందుకు పోతున్నారు. జాతీయ వ్యవహారాల్లో తలదూర్చిక రాష్ట్రమే ప్రయారిటీగా పనులు చేసుకుంటూ పోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించినట్లు బాబు అనుకుంటే దేశానికి కొత్త ప్రధాని వస్తారన్న మాటలలో నిజం ఉంది.కాని తాను నమ్మిన స్నేహితులను మోసం చేయలేని తత్వం ఆయనను ఎక్కడో నిలబెట్టింది.  తన కున్న 16 స్థానాలతో ఎన్డీఏ ను మూడోసారి అధికారంలో నిలబెట్టారు.  1996లో అటు బీజేపీ,ఇటు కాంగ్రెస్ ను కాదని యూనైటేడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ఆయన రాజకీయ చాణక్యానికి ఒక మచ్చుతునక. అబ్దుల్ కలాం లాంటి గొప్ప దార్శనికుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత ఆయనదే. వాజపేయి ప్రధానిగా ఎన్డీఏ లో బాబు కీలకంగా వ్వవహరించిన అనుభవం మరచిపోలేం.  ఏదిఏమైనా ఈ శతాబ్దపు ప్రముఖరాజకీయ నాయకులలో చంద్రబాబు స్థానం ముందు వరుసలోనే ఉంటుందనడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. 

By
en-us Political News

  
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.