బొత్స మెడపై విశాఖ మేయర్ పీఠం కత్తి

Publish Date:Apr 11, 2025

Advertisement

విశాఖ మేయర్ పదవి విషయంలో వైసిపి తప్పటడుగు?

ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చిందంటారు. ఇప్పుడు విశాఖ మేయర్ విషయంలో వైసీపీ నిర్ణయాలు బొత్స సత్యనారాయణ కు సవాలుగా మారాయి. ఏడాది కాలం కూడా లేని పదవి కోసం పెట్టిన శిబిరాలు ఫలిస్తాయా? ఫలితం రాకపోతే తనకు నష్టం కలుగుతుందా అన్న ఆలోచనలో ఇప్పుడు బొత్స ఉన్నట్టు కనిపిస్తోంది. 

వైసీపీ   అధికారంలో ఉన్నప్పుడు విశాఖ మేయర్ పీఠం ఆ పార్టీ దక్కించుకుంది. మేయర్ గా బీసీ మహిళ గొలగాని హరి వెంకట కుమారిని పార్టీ నియమించింది. వాస్తవానికి మేయర్ హరి వెంకట కుమారి అయినప్పటికీ పెద్దరికమంతా వైసీపీ పెద్దలదే. కొంతకాలం విజయసాయిరెడ్డి ఆ తర్వాత వై వి సుబ్బారెడ్డి కనుసనల్లోనే విశాఖ కార్పొరేషన్ పాలన జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తమకు ఆ పదవి దక్కడమే చాలు అంటూ మేయర్ హరి వెంకట కుమారి, ఆమె భర్త శ్రీనివాస్ వ్యవహరించారు. కార్పొరేషన్ లో కూడా వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ ల హవాయే కొనసాగింది. దీనిపై సొంత పార్టీలో కూడా చాలా వరకు అసంతృప్తి ఉండేది. అధికారంలో ఉన్నప్పుడు నిధులు కేటాయింపు విషయంలో కూడా తమకు నిర్లక్ష్యంగా చూశారని కొందరు కార్పొరేటర్లలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దశలో నాలుగేళ్ల పాలన ముగిసింది. కూటమి నాయకులు అవిశ్వాస తీర్మానం నోటీసు జిల్లా కలెక్టర్ కు ఇచ్చారు. దీంతో వైసీపీలో గుబులు మొదలైంది.

నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచిన కార్పొరేటర్లతో పాటు ఇండిపెండెంట్, తెలుగుదేశం కార్పొరేటర్ లను కూడా తమ వైపు లాక్కున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి తమకు వస్తుందని వైసీపీలో భయం మొదలైంది. అందుకు తగ్గట్టే కొందరు వైసీపీ  కార్పొరేటర్లు తెలుగుదేశంలోకి మరికొందరు జనసేన  వైపు వెళ్లారు. మరి కొందరు అదే బాటలో అడుగులు వేస్తున్న దశలో పార్టీ పెద్దగా బొత్స సత్యనారాయణ కార్పొరేటర్ల వలసలు అడ్డుకట్ట వేసే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ క్రమంలో కార్పొరేటర్ లను గోవాకు తరలించారు. అక్కడి నుంచి శ్రీలంక కు కూడా శిబిరాన్ని మార్చేస్తున్నారు. నిజానికి 98 వార్డులు ఉన్న విశాఖ కార్పొరేషన్ లో ఎక్స్ ఎఫిషియో సభ్యులతో కలిసి 111 మంది సభ్యులు ఉంటారు.

మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 74 మ్యాజిక్ ఫిగరు చేరాలి. ఇప్పటికకే కూటమికి 70 మంది కార్పొరేటర్ల బలం ఉంది.  వైసీపీకి ఎక్స్ అఫీషియో సభ్యులు ముగ్గురు, మరో 33 మంది కార్పొరేటర్లు ఉన్నారు ఈ దశలో కూటమికి నలుగురు సభ్యుల బలం అవసరం. సిపిఐ పార్టీ కార్పొరేటర్ స్టాలిన్, గతంలో వైసీపీలో  ఉండి పార్టీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాసరావు కుమార్తె ముత్తంశెట్టి ప్రియాంక లు కూటమికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది. అయితే వారిద్దరూ ఓటు వేసినా మరో ఇద్దరి ఓట్లు అవిశ్వాసానికి అనుకూలంగా పడటం అవసరం. అయితే కూటమి నాయకులు మాత్రం వైసీపీ శిబిరంలో ఉన్న ఐదుగురు కార్పొరేటర్లు తమకు అనుకూలంగా ఉన్నారని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ వ్యవహారాన్ని అంతా తన భుజాన వేసుకొని మేయర్ పీఠాన్ని వైసీపీకి ఉండేలా చేస్తానంటూ బొత్స సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 రోజులుగా శిబిరం కొనసాగుతోంది. ఈనెల 19వ తేదీన ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.  ఆ రోజు జరిగే కౌన్సిల్లో కచ్చితంగా కూటమి కార్పొరేటర్లు అవిశ్వాసంపై చర్చ చేసే అవకాశం ఉంది.

టిడిపికి పూర్తిగా మద్దతు ఇవ్వాలని జనసేనకు చెందిన 11 మంది కార్పొరేటర్లు గురువారం తీర్మానం చేశారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు సమావేశమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అందరూ కట్టుబడి ఉంటారని ప్రకటన కూడా చేశారు. నిజానికి వైసీపీలో అంతర్గత  విభేదాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ వ్యవహారాలు కొందరిచుట్టూ తిరిగాయని బహిరంగ విమర్శలు ఉన్నాయి. చివరికి కౌన్సిల్లో మాట్లాడడానికి తమకు అవకాశం కూడా ఇవ్వడం లేదని వైసీపీకి చెందిన కార్పొరేటర్   తిప్పల వంశీ లాంటి నాయకులు ఎన్నో సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. అలాగే వార్డులకు నిధులు కేటాయించే సమయంలో కూడా తమను పట్టించుకోలేదన్న అసంతృప్తి కార్పొరేటర్లలో ఉంది.  దీన్ని ఆసరాగా తీసుకొని కూటమి నాయకులు పూర్తి స్థాయిలో వార్డు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని కార్పొరేటర్లకు హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది. మరో ఏడాది కాలంలో పదవులు ముగియనున్న దశలో ప్రజలకు అభివృద్ధి పనులు చేస్తే మేలు జరుగుతుందన్న భావనలో కార్పొరేటర్లు ఉన్నారు.

ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కేకే రాజు పై కొందరు కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారు. వారు కచ్చితంగా కూటమికి అనుకూలంగా ఉంటారన్న సమాచారం వైసీపీ పెద్దలకు చేరింది. దీంతో అప్పటికప్పుడు ఈ అనుమానిత కార్పొరేటర్లకు పార్టీ పదవులను ఆఫర్ చేశారని విశాఖలో చర్చ జరుగుతోంది. పదవులు ఇచ్చినంత మాత్రాన గతంలో జరిగిన అన్యాయాన్ని ఈ కార్పొరేటర్లు మర్చిపోతారా అన్నది అనుమానంగా ఉంది. ఇప్పటికే శిబిరం నిర్వహణ ఖర్చులు భారంగా మారడమే కాక , సమయం దగ్గర పడుతున్న కొలది తమ కార్పొరేటర్లు ఎటువైపు వెళ్తారో అని బొత్స వర్గంలో కలవరం కనిపిస్తోంది. చేతులెత్తి ఓటు వేసే పరిస్థితి వస్తే కొందరు కార్పొరేటర్లు గైర్హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయన్న భయం కూడా వైసిపి పెద్దల్లో  కనిపిస్తున్నది. కూటమి మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి నలుగురు సభ్యుల సహకారం అవసరం. సిపిఎం కార్పొరేటర్ స్టాలిన్, వైసీపీకి రాజీనామా చేసిన ముత్తంశెట్టి ప్రియాంక లు కూటమికి అనుకూలంగా ఓటు వేసినా లేక గైర్హాజరైనా అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు పడినట్టే.

ఇక వైసీపీఅసంతృప్తి కార్పొరేటర్ల కుటుంబ పెద్దలతో కూటమి నాయకులు టచ్ లో ఉన్నారు. పార్టీ అధికారంలో అన్యాయం జరిగినట్టు భావిస్తున్న ఆ కార్పొరేటర్లు దాదాపు ఐదుగురు కూటమికి అనుకూలంగా ఉన్నారని వినికిడి. ఇదే జరిగితే మేయర్ పదవి కోల్పోవడమే కాక.. ఈ తతంగం నిర్వహణలో వైఫల్యం చెందినట్లు బొత్స సత్యనారాయణకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వైసీపీలో మరో వర్గం సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 19 డెడ్ లైన్ గా వైసీపీ కార్పొరేటర్ల శిబిరం కొనసాగనుంది. అయితే తాజాగా కూటమి కూడా తమ పార్టీ కార్పొరేటర్ లను ఓ శిబిరంలోకి తరలించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కూటమి తరపున మేయర్ పీఠం ఆశిస్తున్న పీలా శ్రీనివాసరావు ఆర్థికంగా పూర్తి సహాయాన్ని అందిస్తున్నారు. ఎన్నికల ముందే వైసీపీ మేయర్ పీఠాన్ని కోల్పోయినట్లయితే పెద్దగా లాభం లేకపోయినప్పటికీ  అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు చేసిన వ్యవహారానికి ప్రతీకారం  తీర్చుకున్నట్లౌతుందని కూటమి నాయకులు చెప్పుకుం టున్నారు. ఇటు అధిష్టానం గానీ అటు మేయర్  హరి వెంకట కుమారి గాని ఈ విషయంలో పెద్దగా సీరియస్ గా వ్యవహరించక పోవడం తో మొత్తం వ్యవహారం బొత్స మెడ కు చుట్టుకున్నట్టు అయింది.

By
en-us Political News

  
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు. క‌ట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.