Publish Date:May 12, 2023
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు సీనియర్ బిజేపీ నేత విజయశాంతి. పూర్వాశ్రమంలో బీఆర్ఎస్ లో కేసీఆర్ వెంటే ఉన్న విజయశాంతి అదే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తో విభేధించి బయటకొచ్చారు. తల్లి తెలంగాణా పార్టీ స్థాపించి అప్పట్లో క్రియాశీల రాజకీయాల్లో చురుకు పాల్గొన్నారు. తర్వాత బిజేపీ సిద్దాంతాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో దూసుకొచ్చిన రాములమ్మ ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ను ఓడించాలని కంకణం కట్టుకున్నట్టు కనబడుతోంది.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ మార్చ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ది అంతా దోపిడీ రాబడి అంటూ ఆరోపించారు. కేసీఆర్ మనసు క్రూరమైనదంటూ విమర్శించారు.
కేసీఆర్ ఎగ్జామ్ పేపర్లన్నీ అమ్ముకుంటున్నారని.. కేసీఆర్ నీకు సిగ్గుందా.. నిరుద్యోగులు ఉసురు పోసుకున్నాడంటూ ఆరోపించారు. నీ కూతురు లిక్కర్ స్కామ్.. నీ కొడుకు పేపర్ లీక్ వీరుడు.. నువ్ దేశంలో ప్రతిపక్షాలకు డబ్బులు ఇస్తున్నావ్.. అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు విజయశాంతి. బండి సంజయ్ ని అక్రమంగా జైలులో పెట్టారన్నారు. మనుగోడులో డబ్బు, మద్యంతో గెలిచారని దుయ్యబట్టారు.
ఒక్కో ఓటుకు రూ.5 వేలు ఇచ్చారని ఆరోపించారు. సచివాలయం ఆయన కోసమే కట్టారంటూ ఎద్దేవా చేశారు విజయశాంతి. ప్రతిపక్షాలకు అందులో అనుమతి లేదట అంటూ సెటైర్లు వేశారు. రూ.400 కోట్ల నుంచి రూ.1600 కోట్లకి సచివాలయం వ్యయం పెరిగిందన్నారు. 1200 కోట్లు ఎవరి ఇంట్లో నుంచి తెచ్చి కట్టారన్నారు. 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. నిర్ణయం మీదే రాములక్క చెప్పిన నిజాలు గమనించాలన్నారు.
ఆరు నెల్లోల కేసీఆర్ ని గద్దె దింపాలని సూచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు తోడు దొంగలే అన్నారు. ఉమ్మడి మెదక్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాగా నొక్కుతున్నారని దుయ్యబట్టారు విజయశాంతి.
ప్రస్తుతం విజయశాంతి లోకసభ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. మాజీ మెదక్ లోకసభ సభ్యురాలిగా పని చేసిన విజయశాంతికి బిజెపి నుంచి టికెట్ కన్ఫమ్ అయినట్లేనని తెలుస్తోంది. ప్రస్తుతం బిఆర్ఎస్ ఎంపీ ఈ నియోజకవర్గం నుంచి కొత్త కోట ప్రకాశ్ రెడ్డి ఉన్నారు. ఆయన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నేపథ్యంలో విజయశాంతికి పోటీ మీద బిఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. విజయశాంతిని ఓడించడానికి బలమైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ కేసీఆర్ వెతుకుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijayashanti-fire-on-kcr-39-155184.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.