మళ్లీ రాజ్యసభకు విజయసాయిరెడ్డి.. ఏ పార్టీ నుంచంటే?

Publish Date:Apr 11, 2025

Advertisement

రాజకీయాలకు అలవాటు పడిన నేతలు వాటి నుంచి అంత సులభంగా బయటకు రాలేదు. విజయసాయి రెడ్డి అందుకు మినహాయింపేమీ కాదు. ఇటీవల వైసీపీ పార్టీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. ఇక తాను రాజకీయాలకు పూర్తిగా దూరం, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అయితే ఆయన రాజకీయ సన్యాస ప్రకటనను అప్పట్లోనే ఎవరూ నమ్మ లేదు. రాజకీయ సన్యాసం కాదు, విరామం మాత్రమేనని అప్పట్లోనే రాజకీయవర్గాలలో పెద్ద చర్చ జరిగింది.

వాస్తవానికి జగన్ నేతృత్వంలోని వైసీపీలో ఒకప్పుడు నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన విజయసాయి.. పార్టీ ఆవిర్భావం నుంచీ జగన్ తో కలిసి నడిచారు. అంతకు ముందు కూడా జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ కు సహ నిందితుడిగా ఉన్నారు. ఆయనతో పాటు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అటువంటి విజయసాయి రెడ్డికి వైసీపీ వినా మరో ఆప్షన్ ఉండదనే అంతా భావించారు. అయితే అనూహ్యంగా విజయసాయి వైసీపీని వీడటమే కాకుండా.. ఆ తరువాతి పరిణామాలలో జగన్ కు షాక్ ఇచ్చేలా కొన్ని అంశాలను రివీల్ చేశారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో కర్త, కర్మ, క్రియా అంతా జగన్ సమీప బంధువు సుబ్బారెడ్డి కుమారుడేనని చెప్పడం, అలాగే ఏపీ మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియా అంతా కసిరెడ్డి రాజశేఖరరెడ్డే అని రివీల్ చేయడం జగన్ కు మింగుడుపడని అంశాలే. విజయసాయి రెడ్డి నేరుగా జగన్ పేరు చెప్పకపోయినా ఆయన మాటల వెనుక అర్ధం ఆ రెండు వ్యవహారాలలోనూ తెరవెనుక ఉన్నది జగనేనని చెప్పకనే చెప్పారని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు.

అంతే కాకుండా ఆయన రాజీనామా చేసిన రాజ్యసభ స్థానాన్ని ఉప ఎన్నికలో మళ్లీ ఆయనే బీజేపీ అభ్య ర్థిగా పోటీ చేస్తారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ విశ్లేషణలకు తగ్గట్టుగానే ఆయన తీరు కూడా ఉంది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ హైదరాబాద్ వచ్చిన వేళ విజయసాయి రెక్కలు కట్టుకుని వాలిపోయి ఆయనకు స్వాగతం పలికారు.  

ఇప్పుడు తాజాగా స్వల్ప విరామం తరువాత విజయసాయి మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతారనీ, ఈ సారి ఆయన తన సేవలూ, విధేయతా బీజేపీ వైపు ఉంటాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి.  ఆ కథనాల ప్రకారం ఆయన రాజ్యసభకు వెడతారు. అయితే ఈ సారి బీజేపీ తరఫున ఆయన రాజ్యసభలో అడుపెడతారు. ఆ కథనాలకు బలం చేకూర్చే విధంగా విజయసాయి రెడ్డి మోడీని ప్రశంసలతో ముంచెత్తతూ శుక్రవారం ఎక్స్ వేదికగా చేసిన పోస్టు ఉంది.

ఆ పోస్టులో విజయ సాయి ముంబైపేలుళ్ల సూత్రధారి తహవ్వుర్‌ రాణా ను భారత్ కు రప్పించడం మోడీ దౌత్య విజయంగా అభివర్ణించారు.  మోడీ నేతృత్వంలో   దేశ భద్రతకు ముప్పు తలపెట్టిన ఏ ఉగ్రవాదినీ భారత్ వదిలిపెట్టబోదన్న సందేశాన్ని ప్రధాని మోడీ ప్రపంచానికి చాటారని విజయసాయి ఆ పోస్టులో పేర్కొన్నారు.  దీంతో విజయసాయి బీజేపీ గూటికి చేరి, రాజ్యసభలో అడుగుపెట్టడానికి ఇంకెంతో సమయం పట్టదని పరిశీలకులు భావిస్తున్నారు. 

By
en-us Political News

  
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.