జగన్ కు ఇచ్చి పడేసిన విజయసాయి!?

Publish Date:Mar 12, 2025

Advertisement

వైసీపీ భయమే నిజమైంది. ఆవిర్భావ దినోత్సవం రోజునే ఆ పార్టీ ఆబోరు గంగలో కలిసింది. కాకినాడ పోర్టు షేర్ల బదిలీ కేసులో విజయవాడలో సీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి బుధవారం (మార్చి 120 హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తనను ఉద్దేశించి భయం, ప్రలోభాలు, విశ్వసనీయత అంటూ చేసిన వ్యాఖ్యలను గట్టిగా ఖండించారు. తాన రక్తంలోనే భయంలేదన్నారు. తాను ప్రలోభాలకు లొంగలేదన్నారు, విశ్వసనీయత లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. జగన్ చుట్టూ చేరిన కోటరీ వల్లే తనకూ ఆయనకు మధ్య అగాధం ఏర్పడిందని   వైరాగ్యం ప్రదర్శిస్తూనే జగన్ పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మంచోడే  అంటూనే  ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించారు. 

 రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన విజయసాయిరెడ్డి నోటి వెంట వచ్చింది మాత్రం రాజకీయమే.  వైసీపీకి భవిష్యత్ లేదని చెబుతూనే.. జగన్ కోటరీని దాటి బయటకు వస్తే భవిష్యత్ ఉంటుందన్నారు. కాకినాడ పోర్టు విషయంలో కానీ, మద్యం కుంభకోణంలో కానీ జగన్ పాత్ర లేదని అంటూనే...కాకినాడ పోర్టు షేర్ల వ్యవహారంలో కర్తకర్మక్రియ అంతా జగన్ సమీప బంధువు, వైసీపీ సీనియర్ నాయకుడు వైవీసుబ్బారెడ్డి పుత్రరత్నమేనని కుండబద్దలు కొట్టేశారు. అలాగే మద్యం కుంభకోణం అంతా కసిరెడ్డి రాజశేఖరరెడ్డి పుణ్యమేనన్నారు. పరిశీలకులు మాత్రం ఇలా చెప్పడం ద్వారా ఆయన జగన్ ను నిండా ఇరికించేసినట్లేనని విశ్లేషిస్తున్నారు. తాను రాజకీయం వదిలేసి సేద్యం చేసుకుంటున్నానని చెప్పిన విజయసాయిరెడ్డి, భవిష్యత్ లో వైసీపీలో చేరే ప్రసక్తే లేదని చెప్పడం ద్వారా కమలం గూటికి చేరే అవకాశాలకు తలుపులు తెరిచే ఉంచానని చెప్పకుండానే చెప్పారు.   విజయవాడలో సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఆ విచారణ పూర్తయిన తరువాత మీడియాతో మాట్లాడారు.  ఆ సందర్భంగా ఆయన కేసు గురించి కంటే ఎక్కువగా రాజకీయాల గురించే మాట్లాడారు. 

వైసీపీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానన్న ఆయన అందుకు కారణం జగన్ చుట్టూ ఉన్న కోటరీయే అన్నారు. ఆ కోటరీ కారణంగానే జగన్ కూ తనకూ మధ్య అగాధం ఏర్పడిందన్నారు. వాస్తవానికి  ఒకప్పుడు జగన్ కోటరీలో విజయసాయే కీలకం. ఈ తరువాత కారణాలేమైతేనేం జగన్ కు విజయసాయి దూరమయ్యారు. తాను దిగిన ఒక్కో మెట్టూ వేరే వాళ్లకు పార్టీలో ఎదగడానికి సోపానంగా మారిందంటూ.. అన్యాపదేశంగా సజ్జలను దుయ్యబట్టారు.  ఈ సందర్భంగా విజయసాయి జగన్ కు కొన్ని సుద్దులు కూడా చెప్పారు. నాయకుడనే వారు చెప్పుడు మాటలు వినకూడదు, విన్నా నమ్మకూడదన్నారు. అలా వినడం, నమ్మడం వల్ల పార్టీ, నాయకుడు కూడా నష్టపోతాడని విజయసాయి జగన్ కు హితవు చెబుతున్నట్లు చెబుతూనే అన్యాపదేశంగా జగన్ నాయకుడే కాదని తేల్చేశారని పరిశీలకులు అంటున్నారు.  ఆయన మీడియా సమావేశంలోనే ఒక విధంగా వైసీపీని దాదాపు బట్టలూడదీసి నిలబెట్టేశారు. ఇక సీఐడీకి ఏం చెప్పి ఉంటారన్న కంగారు వైసీపీలో వ్యక్తం అవుతోంది.    

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.