తమిళనాట మరో రాజకీయ పార్టీ తెరమీదకు రానుంది. కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించి, తన మొదటి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించి, ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం ఒక పొలిటికల్ సునామీలా మారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏ ఇతర రాజకీయ నాయకుడికైనా ఇది ఒక తీరని కల అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇప్పటికే రజినీకాంత్ ఒక సారి రాజకీయ పార్టీ అంటూ హడావుడి చేసి.. వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా రజినీకాంత్ తాజా రాజకీయ అడుగులపై చర్చ నడుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్ ప్రారంభించిన ప్రజా ఉద్యమం. ఆమె తమిళనాడులో మక్కల్ మేడై అంటే తెలుగులో ప్రజల వేదిక అనే ఒక పౌర వేదికను అధికారికంగా ప్రారంభించారు. స్థానిక స్థాయిలో సరికొత్త నాయకులను తయారు చేయడం, వారి ద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడటం తన మక్కల్ మేడై ముఖ్య ఉద్దేశంగా ఆమె ప్రకటించారు. ఒక రకంగా ఇది సమాజ సేవకు, రాజకీయ అవగాహనకు సంబంధించిన మంచి కార్యక్రమమే అయినప్పటికీ.. నెటిజన్లు మాత్రం దీని వెనుక ఉన్న టైమింగ్ను నిశితంగా గమనిస్తున్నారు. సరిగ్గా దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన తరుణంలోనే ఈ సంస్థను తీసుకురావడం వెనుక పొలిటికల్ స్ట్రాటజీ ఉందని నెటిజనులు అనుమానిస్తున్నారు.
దళపతి విజయ్కు వస్తున్న విపరీతమైన క్రేజ్, స్టార్డమ్ ను రజినీకాంత్ జీర్ణించుకోలేకపోతున్నారా అంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. విజయ్ ఇమేజ్ను, ప్రజాదరణను ఏదో మేరకు తగ్గించేందుకే రజినీకాంత్ కుటుంబం ఈ సరికొత్త ప్లాట్ఫామ్ను తెరపైకి తెచ్చిందంటున్నారు. మక్కల్ మేడై సంస్థను స్థాపించింది రజినీకాంత్ కాదు, ఆయన భార్య లతా రజినీకాంత్ అయినప్పటికీ.. ఆమో తన సంస్థకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించినప్పటికీ.. దీని వెనుక ఖచ్చితంగా రజనీకాంత్ ఉంటారనీ, ఉన్నారనీ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. రజినీకాంత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దళపతి విజయ్ రాజకీయ ఎదుగుదలను చూసి తాను ఎంతో సంతోషిస్తున్నానని చెప్పారు.
అంతేకాకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన పదవీ కాలం విజయవంతం కావాలని కోరుకున్నారు. ఒకవైపు రజినీకాంత్ ఇలా సానుకూలంగా స్పందించినా.. తాజాగా రజనీకాంత్ భార్య ప్రారంభించిన మక్కల్ మేడై సంస్థ పెద్ద రాజకీయ దుమారాన్నే రేపుతోంది. ఇది కేవలం సేవా సంస్థగానే మిగిలిపోతుందా.. ముందు ముందు విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ అస్త్రంగా మారుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే ప్రస్తుతం తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పై విజయ్ వర్సెస్ రజనీ అన్న చర్చకు కేంద్రంగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijay-vs-rajinikanth-on-tamil-nadu-political-stage-39-222037.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.