పద్యాల పడవ కట్టిన వేమన!!

Publish Date:Feb 19, 2022

Advertisement

 

ప్రతి మనిషి చిన్నతనం నుండి పెద్దయ్యేలోపు పది వేమన పద్యాలైనా పలికి ఉంటాడు. ఒక్క వేమన పద్యాన్ని అయినా కంఠతా చెప్పేయగలిగేలా నేర్చుకుని ఉంటాడు. ఆ పద్యాలు అన్నీ ప్రపంచంలో ప్రతి మనిషికి, మనిషి జీవితంలో వ్యక్తిత్వాలకు దగ్గరగా…. ఎన్నో విలువలు, నీతి, ఛలోక్తులు నింపుకున్నవి వేమన పద్యాలు. 

17 వ శతాబ్దానికి చెందిన పద్య కవి వేమన. ఈయన శతక కవులలో ప్రసిద్ధి చెందినవాడు. అంతేకాదు ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా పద్యాలను మలచి ప్రజాకవిగా పేరు పొందాడు. ఎలాంటి ఆడంబరాలు ఈయన పద్యాల్లో కనిపించవు. నీతిని, సామాజిక చైతన్యాన్ని ఎంతో సహజమైన పదాలతో నింపి పద్యాల రూపంలో ప్రజలకు అందించాడు. ఈయన పద్యాలు సాహిత్యపరమైన సంపదగా కాక ప్రజల జీవితంలో భాగంగా మారిపోయినవే ఎక్కువ. "విశ్వదాభిరామ వినురవేమ" అనే మకుటంతో సాగే ఈయన పద్యాల పడవ సమాజపు సముద్రాన్ని ఎంతో చక్కగా చుట్టేస్తుంది.

ఎవరీ వేమన!!

"బెదమ కోమటి పెదవేమారెడ్డి, బెదమ కోమటి చినవేమారెడ్డి" అనే ఇద్దరు అన్నదమ్ములలో చినవేమారెడ్డినే వేమనగా  రూపాంతరం చెందాడు. ఈయన గొప్ప ధీరుడు. ఈయన అన్న పెదవేమారెడ్డి రాయలసీమను పాలించిన నాటి రాజుగా ఉన్నా రాజ్య కార్యకలాపాలు అన్నీ చినవేమారెడ్డి ఆధ్వర్యంలోనే జరిగేవి. ఇలా ఈయన ఒక మంచి సంపన్న కుటుంబంలోని వాడే అని స్పష్టమవుతుంది.

రూపాంతర రహస్యం!!

పాఠ్యపుస్తకాలలో వేమన పద్యాలు చదువుకున్న పిల్లలకు  దిగంబరంగా ఒక కాలు మడిచి మరొక కాలు చాపుకుని కూర్చున్న వేమన భంగిమ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా వేమన చిత్రాలు ఇలాగే ఉంటాయి కూడా. అయితే సంపన్న కుటుంబంలో ఉన్న వేమన ఇలా బైరాగిగా మారి సర్వమూ త్యజించిన వాడిగా ఎందుకు మారిపోయాడు అనేది తెలియదు.

చరిత్రలో తొంగి చూస్తే భోగవిలాసాలలో మునిగి ఒకానొక నిర్లక్ష్య జీవితాలకు అలవడినవాళ్ళు ఎందరో క్రమానుగతంలో గొప్ప యోగులుగానూ, తాత్వికులుగానూ రూపాంతరం చెందారని సాక్ష్యాలున్నాయి. అలాంటి కోవలోకి చెందినవారే వేమన కూడా. 

వేశ్యలోలుడి నుండి యోగిగా!!

ఈయనను, ఈయన అన్నను చంపితే రాజ్యానికి తనే రాజు అవ్వచ్చనే నమ్మకద్రోహానికి కంకణం కట్టుకున్న మంత్రి చినవేమారెడ్డికి ఉన్న వేశ్యల సంపర్కమనే బలహీనతతో ఆవిపు దారి మళ్లించి విషప్రయోగం చేసి చివరకు అడవుల్లో పడేసివస్తే, శరీరంలోం ఏ మూలో, ఏ నాడీ కణంలోనో కొనఊపిరి ఉందని గమనించి అభిరామ అనే ఒక వైద్యుడు ఔషధాల సహాయంతో పడనాన్ని నిలబడితే తిరిగి పునర్జన్మ పొంది జరిగింది గుర్తుచేసుకుంటూ ఎంతటి తప్పు చేసానో అనే పశ్చాత్తాపంతో మౌనంగా మారిపోయిన చినవేమారెడ్డి కాలక్రమంలో అభిరామ గురువు అయిన విశ్వకర్మ భోదించే జ్ఞానానికి పాత్రుడయ్యి ఆ జ్ఞానాన్ని నింపుకుని వేమన యోగిగా రూపాంతరం చెందాడు.

పద్యాల పడవకు బ్రౌన్ వెలుగు!!

నిజానికి మొదట వేమన పద్యాలు అన్నీ ప్రజల నోటి మాటల్లో నానాయి. వాటిని  వేమన ఏవిధంగానో గ్రంథస్థం చేయడం కానీ, ఇతరులు ఎవరూ గ్రంథస్థం చేయించడం కానీ జరగలేదు. అయితే తెలుగు భాషకు ఎంతో సేవ చేసిన తెల్లదొర బ్రౌన్ వేమన పద్యాలను గ్రంథస్థం చేయించడమే కాకుండా వాటిని ఆంగ్లంలోకి అనువదించారు కూడా.

అనగనననగరాగ మతిశయిల్లుచునుండు

తినగ తినగ వేము తియ్యనుండు…… అని చెప్పిన మన వేమన,

తనువులోన నున్న తత్త్వంబు దెలియక

వేరే యాత్ర బోవు వెర్రివాడు

గంత మోసి మోసి గాడిద తిరుగదా….. అని కూడా అంటాడు.

ఇందులో ఎంతో తత్వం ఉంది. అలాగే 

ఆత్మ శుద్దిలేని ఆచార మది యేల?? అంటూ  ప్రశ్నిస్తాడు.

అన్నిధానముల కంటే అన్నదానము మేలు అని చెబుతాడు….

ఉర్విజనులకెల్ల ఒక్క కంచము బెట్టి అని సర్వసమానతను సమర్ధిస్తాడు…..

జీవిజీవిని జంప శివుని జంపుటే అగు అని ఆయనలో ఉన్న జీవకారుణ్యాన్ని బహిర్గతం చేస్తాడు.

ఇలా వేమన యోగిగా మారి ఎన్నో ఊళ్ళు తిరుగుతూ వెళ్లిన ప్రతిచోటా తన పద్యాల గుభాళింపును వెదజల్లాడు. ఆ పరిమళమే ఇప్పటికీ అందరికీ నీతి పద్యాల ప్రసాదమై నాల్కలకు తియ్యదనాన్ని పంచుతూ ఉంది అనుకోవచ్చు.

వేమనను ఇలా గుర్తుచేసుకోవడమే కాదు, ఆయన పద్యాలను ఆయన చెప్పిన నీతిని పిల్లలకు కూడా నేర్పించాలి.

◆ వెంకటేష్ పువ్వాడ

By
en-us Political News

  
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.