Publish Date:Aug 25, 2022
మొన్నటి దాకా చిన్నా..పెద్దా తేడా లేకుండా అందరిపైనా నోరు పారేసుకున్నారు. అందుకు బహుమతిగా మంత్రి పదవి ఊడింది. తాజా మంత్రి కాకాణిపైనా రెచ్చిపోయారు. సీన్ కట్ చేస్తే.. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలంతా కలిసి తోక కట్ చేసి ఓ మూలన పడేశారు. ఆయనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వరుస పరాభవాలతో ఇప్పటికే తలపట్టుకుంటున్న అనిల్ కు ఇప్పుడు సొంత బాబాయ్ రూపంలో మరో గండం తరుముకొస్తోంది. 2024 ఎన్నికల్లో అనిల్ కు చుక్కలు చూపిస్తానంటున్నారు ఆయన బాబాయ్, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.
నిన్నటి దాకా అనీల్ కుమార్ ను అన్నీ తానై నడిపిన రూప్ కుమార్ ఒక్కసారిగా అబ్బాయ్ అనిల్ పై ఇంతలా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారనే చర్చ ఇటు పార్టీలోనూ, అటు నెల్లూరు జనంలోనూ కూడా ఓ రేంజ్ లో జరుగుతోందిజరుగుతోంది. అనిల్ ను చేరదీసి కార్పొరేటర్ ని చేసి, నెల్లూరు నగర ఎమ్మెల్యే టిక్కెట్టు ఇప్పించిన ఆనం కుటుంబాన్నే వెన్నుపొటు పొడిచారు అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కు రూప్ కుమార్ అండ అంతా..ఇంతా కాదు. నెల్లూరులో అనిల్ రాజకీయాలు చేయడానికి ఒక రకంగా రూప్ కుమారే కారణం. నోటి దురుసుతో అందరినీ దూరం చేసుకున్న అనిల్ కు ఇప్పుడు బాబాయ్ రూప్ కుమార్ తలనొప్పిగా మారారు.
అనిల్ ఆఫీసుకు కొద్ది దూరంలో జగనన్న భవన్ అని కొత్త కార్యాలయాన్ని రూప్ కుమార్ ప్రారంభించారు. కార్యకర్తలను భారీగా సమీకరించి అనిల్, తాను విడిపోయామనే సంకేతం పంపారు రూప్ కుమార్. అది జరిగిన రెండు రోజులకే రూప్ కుమార్ వర్గంపై కేసులు బనాయించే ప్రయత్నం చేసేలా పోలీసులను అనిల్ పురమాయించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రూప్ కుమార్ పోలీస్ స్టేషనులోనే తిష్టవేసి, తన అనుచరులను విడిపించుకున్నారు. అంతటితో ఆగకుండా అనిల్ ఇది జెస్ట్ ట్రయల్ మాత్రమే.. త్వరలో త్రిబులార్ సినిమా చూపిస్తానని హెచ్చరించారు. పెద్ద..పెద్ద కుటుంబాలనే ఓ ఆటాడుకున్నా.. అనిల్ ఆఫ్ట్రాల్ నువ్వెంత అంటూ రూప్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. దీంతో నెల్లూరు సిటీలో అనిల్ పరువు కాస్తా గంగలో కలిసిందంటున్నారు.
ఎంత అబ్బాయ్ అయితే మాత్రం.. సిట్టింగ్ ఎమ్మెల్యే.. మాజీమంత్రి అందులోనూ జగన్ వదిలిన ‘బూతు బాణం’.. అనిల్ కుమార్ నే హెచ్చరించడంతో రూప్ కుమార్ వార్తల్లోకెక్కారు. ఇప్పుడు రూప్ కుమార్ వేరుకుంపటి పెట్టడంతో బాబాయ్- అబ్బాయ్ మధ్య గ్యాప్ ఎందుకొచ్చింది? అసలేం జరిగింది? అనే చర్చ తీవ్రంగా జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/uncle-rupkumar-revolt-on-anil-kumar-yadev-39-142608.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.