నష్టమే తప్ప లాభం లేదు.. విద్యాశాఖ మూసివేత.. ట్రంప్ సంచలన నిర్ణయం

Publish Date:Mar 21, 2025

Advertisement

వ్యక్తిత్వ వికాసానికి, మానవాళి పురోగమనానికీ విద్య ఎంతో దోహదం చేస్తుంది. నూతన ఆవిష్కరణలు చేయాలన్నీ, వ్యక్తిత్వం ఉన్నతంగా ఉడేలా మలుచుకోవాలన్న విద్య ఎంతో అవసరం. ప్రభుత్వాలు విద్యపై ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంతగా దేశంలో విద్యాభివృద్ధి జరుగుతుంది. అందుకని దేశంలో విద్యావ్యవస్థను పర్యవేక్షించి, పరిపుష్టం చేయాలంటూ ప్రాథమిక స్థాయి నుంచీ విద్య విషయంలో గట్టి పునాదులు ఉండాలి. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రాన్ని చూసినా ఆయా  రాష్ట్రాల బడ్జెట్ లో విద్యకు కేటాయింపులు ఎక్కువగా ఉంటాయి. ఆ కేటాయింపుల పారదర్శక వ్యయం కోసం విద్యాశాఖ బలోపేతంగా ఉండాల్సిన అవసరం ఉంది. 

అలాంటి విద్యాశాఖ వల్ల మా దేశానికి ఎలాంటి లాభం లేదు. అందుకే ఆ శాఖ అనవసరం అంటూ అగ్రదేశం అశ్యక్షుడు డొనాల్డ్ ట్రప్  సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యా శాఖ వల్లే ఖర్చే తప్ప లాభం ఇసుమంతైనా లేదంటూ గత కొంత కాలంగా, అంటే అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆయన విద్యాశాఖలో భారీ కోతలు విధించారు. స్కాలర్ షిప్పులు, ఫీజురాయితీల వల్ల ఖజానాకు చిల్లు పడటం తప్ప  ఇసుమంతైనా లాభం ఉండటం లేదంటూ ట్రంప్ తాజాగా దేశంలో విద్యాశాఖనే రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల విద్యార్థులతో అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోఏర్పాటు చేసిన సమావేశంలో ట్రంప్ ఈ సంచల నిర్ణయం తీసుకున్నారు. 

నాలుగు దశాబ్దాలుగా విద్యపై భారీ మొత్తంలో వ్యయం చేసినా విద్యాప్రమాణాలు ఇసుమంతైనా పెరగలేదన్న ట్రంప్ విద్యాశాఖను మూసి వేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడమే కాకుండా, విద్యా శాఖను మూసివేస్తూ ఎగ్జిక్యూటివ్ సంతకం చేసేశారు. ఏప్రిల్ నుంచి ఈ మూసివేత అమెరికాలో అమలులోకి వస్తుంది.  

By
en-us Political News

  
అఘోరినంటూ గత కొంత కాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో హల్చల్ చేస్తున్న వ్యక్తి ఓ అమ్మాయితో పరారవ్వడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మాయమాటలు చెప్పి తమ కుమార్తెను అఘోరి వశపరుచుకుందని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి .ఈయన వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది, మార్కాపురం నియోజకవర్గంలోని సమస్యలపై ఈ నెల 22న ప్రజా దర్బార్ నిర్వహించారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీలో అంతో ఇంతో యాక్టివ్‌గా ఉన్న కాకాణి చుట్టూ ఉచ్చు బిగుస్తుండటం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.
అత్యంత హేయంగా, నీచంగా, ద్వేష భావంతో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇప్పాల రవీంద్రరెడ్డి నేడు నారా లోకేష్ ముందు ప్రత్యక్షమై ఒక బిజినెస్ మీటింగ్ చేశారు.
ఏ దేశ మేగినా, ఎందు కాలిడినా .. మమతా బెనర్జీ.. మమతా బెనర్జీనే. ఆమె మారరు.ఆమె వేషం అసలే మారదు. అదే ముతక చీర, అవే స్లిప్పర్స్. అదే నడక, అదే పరుగు. సహజంగా రాజకీయ నాయకులనే కాదు, మాములు మనమే అయినా విదేశాలకు వెళ్ళినప్పుడు, వేషం మార్చేస్తాం. సూటూబూటులోకి మారిపోతాం.నిజానికి విదేశాలకే వెళ్ళ నక్కర లేదు, పెళ్ళికో పేరంటానికో వెళ్ళినా అంతే. సందర్భాన్ని బట్టి డ్రెస్ కోడ్ మారి పోతుంది.
బోరుగడ్డ అనీల్ కుమార్ సమాజానికి ప్రమాదకరం అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆయన సామాజిక మాధ్యమం వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలు, బూతులు తెలిసిందే. వారిరువురినే కాకుండా వారి ఇళ్లలోని మహిళలను కూడా కించపరిచేలా బోరుగడ్డ అనీల్ కుమార్ వ్యఖ్యలు చేశారు.
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. నలుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి, కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నలుగురు కొత్త మంత్రులతో నాలుగు బెర్తుల భర్తీకి నిర్ణయం జరిగింది. అయితే ఈ నలుగురిలో రాములమ్మ పేరు లేదు. అనూహ్యంగా ఢిల్లీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్న రాములమ్మకు మంత్రి బెర్త్ కూడా కన్ఫర్మ్ అయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ తాజా ప్రోబబుల్స్ లో ఆమె పేరు లేదు. బహుశా ఆర్ఏసీలో ఆమెకు బెర్త్ ఇస్తారో, లేక మిగిలిన రెండు ఖాళీల భర్తీ సమయంలో అవకాశం కల్పిస్తారో తెలియదు కానీ ఇప్పటికైతే రాములమ్మకు క్యాబినెట్ బెర్త్ లేనట్లే అంటున్నారు.
భద్రాద్రి రాముడి కల్యాణంలో అతి పవిత్రంగా భావించేవి వాటిలో తలంబ్రాలు ముందు వరుసలో ఉంటాయి. పసుపు, ముత్యాలు, ధాన్యం మేళవింపుతో వివాహ వేడుకలకు తలంబ్రాలను వినియెగిస్తారు. మరి ఇలాంటి విశిష్ట కలిగిన తలంబ్రాలు, అందులో జగత్ కల్యాణంగా భావించే భద్రాచలం సీతారాముల వారి కల్యాణ మహోత్సవంలో దేవతమూర్తుల శిరస్సు నుంచి జాలువారే తలంబ్రాలకు ఎంతో పవిత్రత ఉంటుంది.
లోకసభ, రాజ్యసభ సభ్యుల జీతాల భృత్యాలు పెరిగాయి. వాస్తవానికి వీరి జీతాలు రెండేళ్ల కిందటే పెరగాల్సి ఉంది. అయితే జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఇప్పుడు పెంరిగింది. పెరగడమే కాదు.. ఈ పెంపు 2023 నుంచి అమలులోకి వస్తుంది. రెండేళ్ల అరియర్స్ కూడా ఎంపీలు అందుకుంటారు. గతంలో ఎంపీలకు లక్ష రూపాయల వేతనం అందుకునే వారు.
చట్టం ముందు అంతా సమానమే, కానీ కొందరు కొంచెం ఎక్కువ సమానం.  ఇది ఎప్పటినుంచో  జనం అంటున్న మాట. అనుకుంటున్న మాట. అవును  రాజ్యాంగం, రాజ్యాంగ నిర్మాతల  దృష్టిలో చట్టం ముందు అంతా సమానం,.కానీ, రాజ్యాంగ పరిరక్షణ సంస్థలు, వ్యవస్థల దృష్టిలో కాదు.
రోళ్లు పగిలే ఎండలు మార్చిలోనే జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. సాధారణంగా మే 2, 3 వారాలలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదౌతాయి. అటువంటిది ఈ ఏడాది మార్చి నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాలలో అప్పుడే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.
పార్లమెంట్ సభ్యుల జీత భత్యాలు భారీగా పెరిగాయి. ఈ మేరకు కేంద్రం అధికారిక ప్రకటన వెలువరించింది. తాజా పెంపుదల మేరకు ఏంపీలకు వేతనం 1.24 లక్షలు , రోజువారీ భత్యం రూ.2500 వరకూ పెరుగుతాయి.
వేలాది మంది జీవితాలలో చీకటి నింపుతున్న బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ఆ బెట్టింగ్ యాప్ నిర్వాహకులపైనే కాకుండా వాటిని ప్రమోట్ చేస్తున్న సెలిబ్రిటీలపై కూడా వరుసగా కేసులు నమోదు చేస్తున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.