Publish Date:Jun 27, 2022
కారు ఓవర్ లోడైందా? కొందరిని దింపేయక, లేకపోతే వారే దిగిపోక తప్పని పరిస్థితి ఏర్పడిందా? అంటే తెలంగాణలో టీఆర్ఎస్ వలసలు చూస్తుంటే ఔననక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు టీఆర్ఎస్ లో అసంతృప్తుల సంఖ్య వరదలా పోటెత్తుతోంది. రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి నెలకొని ఉంది. కొందరు కారు దిగి హస్తం పంచన చేరుతుంటే.. మరి కొందరు టీఆర్ఎస్ లోనే ఉండి.. రానున్న ఎన్నికలలో తమకు ప్రత్యర్థులు అనుకున్న వారితో గొడవలు పడుతున్నారు.
గ్రూపు తగాదాలను ప్రోత్సహిస్తున్నారు. పరస్పరం గొడవలు పడుతూ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కుతున్న వారు మరి కొందరు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు పరిశీలకులు. పార్టీ అగ్రనేతల కనుసన్నలలో మెలిగిన, మెలిగే, మెలుగుతారనుకున్న వారికే తెరాసలో పార్టీ పదవులు దక్కాయి. అయినా అంతా బానే ఉందని అనుకోవడానికి లేకుండా విభేదాలు పెచ్చరిల్లుతున్నాయి. ఈ విభేదాలే తెరాస నుంచి కాంగ్రెస్ లోకి వరద గేట్లు తెరుచుకున్నట్లుగా వలసలు ప్రారంభమయ్యాయి. అధికార పార్టీ నుంచి ఈ స్థాయిలో వలసలు జరుగుతున్నాయంటే.. కచ్చితంగా తెరాసలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనుకోవలసిన పరిస్థితేనని పరిశీలకులు అంటున్నారు.
ఇక ఇంత కాలం కేసీఆర్ పై ఆరోపణలు విపక్షాలకే పరిమితమయ్యాయి. కానీ కుటుంబ పాలన, విధానాలపై పార్టీ వీడుతున్న నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అనంతరం పోడు భూములకు పట్టాల విషయంలో ఆయన కేసీఆర్ సర్కార్ పై చేసిన విమర్శలు కలకలం సృష్టించాయి. పోడు భూములకు పట్టాలు నిరాకరించడం వల్లలే తాను పార్టీ వీడుతున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి రెండో సారి అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికలలో అంటే 2018 ఎన్నికలలో పోడు భూములకు పట్టాలు అన్న హామీ ఇచ్చింది. స్వయంగా కేసీఆర్ నోటి వెంటే ఈ హామీ వచ్చింది. అయితే మూడేళ్ల తరువాత గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తరువాత ఆ విషయమే పట్టించుకోకుండా గాలికి వదిలేయడంతో గిరిజనుల్లో ఆగ్రహం పెల్లుబుకుతొంది. ప్రజా ప్రతినిథులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందనీ, పబ్బుల సంస్కృతికి, డ్రగ్స్ స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ విజయారెడ్డి తెరాసను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. విజయారెడ్డి దివంగత కాంగ్రెస్ నేత పీజేఆర్ తనయ కావడంతో ఆమె పార్టీ మారడం రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గం అయిన ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ పై ప్రభావం చూపడం ఖాయమని అంటున్నారు. ఇక ఏ జిల్లాకు ఆ జిల్లా గ్రూపు తగాదాల పంచాయతీలు నడుస్తూనే ఉన్నాయి. అయితే వాటిని పరిష్కరించి పార్టీని ఏకతాటిపై నడిపించేందుకు అధిష్టానం ఏ మాత్రం సమయం కేటాయించడం లేదన్న ఆరోపణలు, విమర్శలు కేడర్ నుంచే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజులలో మరిన్ని వలసలు పెరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలు కారులో ఈ పరిస్థితి రావడానికి కేసీఆర్ వైఖరీ, ఆపరేషన్ ఆకర్ష్ పేరిట విపక్షాల నుంచి నేతలను పెద్ద ఎత్తున పార్టీలోని ఆహ్వానించడమే కారణమని వారు పేర్కొంటున్నారు. ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు వచ్చి చేరడంతో మొదటి నుంచీ పార్టీలో కొనసాగుతున్న వారికి అవకాశాలు దక్కని పరిస్థితి ఏర్పడిందని వివరిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trs-party-froup-fights-to-peak-39-138522.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.