ఇక మునుగోడు యుద్ధక్షేత్రంగా మారినట్టే. తెరాస అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కేసీఆర్ బీఫామ్ ఇవ్వడంతో ఉప ఎన్నిక రంగంలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులెవరన్నది తేలిపోయింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికలకు మునుగోడులో విజయమే లిట్మస్ టెస్ట్ గా భావిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ లు మునుగోడులో విజయాన్ని అత్యంత ప్రతిష్ఘాత్మకంగా తీసుకున్నాయి.
ఇప్పటికే మూడు పార్టీలూ కూడా మునుగోడులో తమ చతురంగ బలాలను దించేశాయి. ఎన్నికల యుద్ధానికి సర్వం సహా సిద్ధమైపోయాయి. ఇప్పటి వరకూ తెరాస అభ్యర్థి ఎవరన్న దానిపై ఉన్న సందిగ్ధం కేసీఆర్ కూసుకుంట్లను అభ్యర్థిగా ప్రకటించడంతో ఆ సస్పెన్స్ కూ తెరపడింది. మునుగోడు పై ప్రత్యేక దృష్టిసారిస్తూ టీఆర్ఎస్ వీరాభిమానులు, కార్యకర్త లు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా పార్టీ విజయానికి కంకణం కట్టుకుని రంగంలోకి దిగారు. మొన్నటి వరకూ పార్టీ అభ్యర్ధి ప్రకటించకపోవడంతో కాస్తంత మెల్లగా కదిలిన కారు పార్టీ కార్యకర్తలు ఇపుడు ఇక జనాల్లోకి ప్రచారసామగ్రితో రంగంలోకి దిగిపోయారు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ను వదలి బీజేపీ లోకి చేరడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి విదితమే.
మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు తాజా మాజీ హోదాలో బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న సంగతి విదితమే. కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి చేరికతో అనూహ్యంగా మునుగోడులో కమలం బలం గణనీయంగా పెరుగుతుందని ఆశించినా, ఆశించిన స్థాయిలో చేరికలు లేకపోవడంతో కమలం హై కమాండ్ అప్రమత్తమైంది. సర్వ శక్తులూ ఒడ్డైనా మునుగోడులో విజయంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ కేడర్ లో ఆత్మ విశ్వాసాన్ని పెంచాలని పట్లుదలతో ఉంది. అందేకే పార్టీ రాష్ట్ర నాయకులనే నమ్ముకుని కూర్చోకుండా కేంద్రం నుంచి పరిశీలకులు, పర్యవేక్షలను రంగంలోనికి దింపింది. ముఖ్యంగా జెపి నడ్డా, కేంద్రహోం మంత్రి అమిత్ షా కూడా మునుగోడుపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, మునుగోడు ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి ఉన్నా రు. బీజేపీ, టీఆర్ ఎస్లకంటే ముందే ఆమె ప్రచారం ప్రారంభించారు. సీనియర్ నేతగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పేరును కూడా ఉపయోగించుకుని లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. బీజేపీ, టీఆర్ ఎస్లది అధికార దాహమే తప్ప ప్రజలకు మేలు చేయా లన్న ఆలోచన తక్కువేనంటూ ప్రచారం ఆరంభించింది కాంగ్రెస్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/triangle-fight-ready-in-munugodu-39-145081.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.