దేశ జ్ఞానాన్ని వెలిగించే జాతీయ విద్యాదినోత్సవం!

Publish Date:Nov 11, 2022

Advertisement

విధ్యా వినయేన శోభతేః... అన్నారు పెద్దలు. అంటే వినయాన్ని చేకూర్చే విద్యనే ఉత్తమమైనది అని అర్థం. విధ్య లేని వాడు వింత పశువు అని కూడా అన్నారు.. విద్య వల్ల మనిషిలో మేధాపరంగా గొప్ప మార్పు చోటు చేసుకుంటుంది. ఎంత ఎక్కువ చదువుకుంటే అంత గొప్ప జ్ఞానం వ్యక్తి సొంతం అవుతుందని చెప్పేవారు. అయితే కేవలం డిగ్రీ పట్టాలకు మాత్రమే పరిమితమయ్యే జ్ఞానం మనిషి మాససిక వికాసానికి దోహదం చెయ్యదు. అక్షరము అంటే నాశనం లేనిది అని అర్థం.అందుకే కాలం ఎంత మారినా చదువుకున్న చదువు మనిషికి ఏదో ఒక మార్గాన్ని చూపిస్తూనే ఉంటుంది. చరిత్రలోకి చూస్తే ఎంతో మంది గొప్పగా ఎదిగిన వారు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగినవారే... వారందరికీ చదువు విలువ ఎంతో స్పష్టంగా తెలుసు కాబట్టే వారు ఎంత గొప్పవారు అయినా చివరికంటూ నిత్యవిద్యార్థులుగా కొనసాగారు. 

భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11 న జాతీయ విద్యాదినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. భారతదేశ మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖమంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకుని మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ విద్యాదినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. 

ఎప్పుడు ఏర్పడింది..

ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ గా పిలువబడుతున్న విద్యాశాఖ  2008 సంవత్సరం నవంబర్ 11 న భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యాదినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించి, ప్రకటించింది. అప్పటి నుండి జాతీయ విద్యా దినోత్సవ వేడుక సాగుతోంది. 

థీమ్ ఏంటో తెలుసా...

ఈ విషయం మీద అవగాహన పెంపొందించే దిశగా ప్రతి సంపత్సరం ఒక కొత్త థీమ్ ను ప్రకటించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తుంది భారత ప్రభుత్వం. అదే విధంగా 2022 సంవత్సరానికి సంబంధించిన థీమ్ "Changing the course and transforming education".

పై థీమ్ తో భారత ప్రభుత్వం ప్రజల్లో విద్యమీద అవగాహన పెంచే కార్యక్రమాలను ఈ ఏడాది చేపట్టబోతోంది.

జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్న మౌలానా అబుల్ కలామ్ గురించి తెలుసుకుంటే…..

నవంబర్ 18, 1888న జన్మించిన మౌలానా అబుల్ కలాం  పూర్తి పేరు "అబుల్ కలాం గులాం ముహియుద్దీన్ అహ్మద్ బిన్ ఖైరుద్దీన్ అల్-హుస్సేనీ ఆజాద్". ఈయన  భారత స్వాతంత్ర్య కార్యకర్త,  రచయిత మరియు భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ఈయన భారత ప్రభుత్వంలో మొదటి విద్యా మంత్రి అయ్యాడు.   ఆగస్టు 15, 1947 నుండి ఫిబ్రవరి 2, 1958 వరకు ఈయన భారత విద్యా మంత్రిగా పనిచేశాడు.  ఫిబ్రవరి 22, 1958న ఢిల్లీలో మరణించాడు. అంటే ఈయన తన పదవి నుండి  తాను మరణించడానికి 20 రోజుల ముందు తప్పుకున్నాడు. 

జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఏమి చేయవచ్చు??

జాతీయ విద్యాదినోత్సవ సందర్భంగానే కాకుండా సాధారణ రోజుల్లో కూడా  కృషి చేయవచ్చు కదా అని కొందరు ఎద్దేవా చేస్తూ ఉంటారు. అయితే జాతీయ విద్యాదినోత్సవం నాడు ఈ అవగాహనా కార్యక్రమాలు మరింత పుంజుకుంటాయి.

అవగాహన!!

జాతీయ విద్యాదినోత్సవం రోజు అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. నిరక్షరాస్యత కలిగిన ప్రాంతాలలో ఈ కార్యక్రమాల ఏర్పాటు ఉండేలా చూసుకోవాలి. పిల్లలను పనికి పంపే పెద్దవారి విద్య విలువ అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లలను పని నుండి బడికి పంపే దిశగా వారి ఆలోచనలు మళ్లించాలి. విద్య వల్ల ఉద్యోగావకాశాలు ఎలా చేజిక్కించుకోవచ్చో, ఉద్యోగం చేసే వారికి ఈ సమాజంలో ఎంతటి సముచిత స్థానం లభిస్తోందో వివరించి చెప్పాలి. 

సహాయం!!

చదువు కోవడానికి ఇబ్బంది పడే పిల్లలు ఈ కాలంలో చాలామందే ఉన్నారు. చదువు ఖరీదు అయిపోయిన ఈ కాలంలో ఆర్థిక సమస్యలు కారణంగా విద్యకు ఉద్వాసన పలికే పేద మాణిక్యాలు చాలానే ఉన్నాయి. అలాంటి వారిని చదువులో ప్రోత్సహించాలి. నేరుగా సహాయం కావచ్చు, లేదా స్వచ్చంధ సంస్థల తరపున కావచ్చు లేదా విరాళాలు సేకరించి కావచ్చు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను చదువులో రాణించేలా చేస్తే దేశానికి విద్యా వంతులను అందించినట్టు అవుతుంది.  

ఇలా ప్రతి ఒక్కరూ ఈ జాతీయ విద్యాదినోత్సవం రోజున తమకు చేతనైన విధంగా చేయూతను అందించవచ్చు. 

                                     ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.