పర్యాటక ప్రియుల కోసం మూడు ప్రదేశాలు!!

Publish Date:Feb 14, 2022

Advertisement

 

భగవాన్ రమణ మహర్షి. ఈయన జ్యోతి స్వరూపుడు. ఆధ్యాత్మిక లోకానికి ఉన్న గొప్ప ఉనికిని కొనసాగించిన రమణ మహర్షుల వారు తన జీవితంలో ముఖ్యమైన సంఘటనలను కొన్ని ప్రదేశాల్లో గొప్ప అనుభవాలుగా అనుభూతి చెందారు. అవన్నీ కూడా శివకళలు నిండిన ప్రదేశాలు మరియు గొప్ప శైవ క్షేత్రాలు. విహారాయత్రల మీద ఆసక్తి ఉన్నవారు ఇటువెళ్తే ఎంతో గొప్ప అనుభవం మూటగట్టుకుంటారు.

ఒక్కసారి ఆ శైవక్షేత్రాల గూర్చి చూస్తే… 

1.తిరుచ్చుళి: ఇది భగవాన్ శ్రీరమణ మహర్షి జన్మస్థలం. దీనికి సంస్కృతంలో "త్రిశూలపురం" అని పేరు. దీని మాహాత్మ్యమును స్కంద పురాణంలో వర్ణించారు. మధుర-తిరువనంతపురం రైలు మార్గంలో విరుదనగర్ అనే జంక్షన్ ఉంది.  దానికి తూర్పుదిశలో 18 మైళ్ళ దూరంలో తిరుచ్చుళి వుంది. మధురనుంచి అరుప్పుకోటకు వచ్చి, అక్కడ నుండి తిరుచ్చుళికి  వెళ్ళవచ్చు. మధుర నుండి తిరుచ్చుళికి బస్సు మార్గం ఉంది. ఇక్కడే భగవాన్ రమణ మహర్షి జన్మించారు. ఆయన అలా జన్మించినప్పుడు ఆయన ప్రసవించిన గదిలో ఒక జ్యోతి కనబడిందట. అది ఆ గదిలో ఉన్న ఒక అవ్వకు కనబడిందట. ఆ అవ్వకు చూపు సరిగా కనిపించకపోయినా ఆమె ఆ జ్యోతిని చూసింది అంటే ఆ వెలుగు ఎంత ప్రకాశంగా ఉందొ, రమణుల వారి జననం ఎంత గొప్పదో అర్థమవుతుంది. 

తిరుచ్చుళిలో వెలసిన శివునికి “తిరుమేననాథర్” అని, దేవికి “తుణైమాలె” (సహాయాంబ) అని పేర్లు. వీరిపై సుందరమూర్తి, మాణిక్య వాచకులు ఎన్నో కీర్తనలను కీర్తించారు. ఈ త్రిశూలపురం ఉన్న శివుడిని భూమినాథేశ్వరుడు అని కూడా అంటారు. 


కౌండిన్య ఋషి ఇక్కడ తపస్సు చేయడం వలన ఈ క్షేత్రమునకు “కౌండిన్య క్షేత్రం” అని పేరు వచ్చింది. ఈ ఊరిలో ప్రవహిస్తున్న నదికి కూడా "కౌండిన్య నది" అని పేరు. ఇట్లా రమణులు పుట్టిన ప్రదేశంలో ఎంతో శక్తివంతమైన ఛాయలు ఉన్నాయి. 

2. మధుర: ఇది మీనాక్షీ- సుందరేశ్వరులు వెలసిన క్షేత్రం మరియు పాండ్యుల రాజధాని. రమణ మహర్షి మీనాక్షి అమ్మవారి ఆలయంలోకి వెళ్లిన ప్రతిసారి ఆయనలో ఉన్న ఆత్మ చైతన్యం అయ్యేదని చెబుతారు. ఆధ్యాత్మికంగా అంతవరకు ఎక్కువ ఆసక్తిగా లేని రమణ మహర్షి మీనాక్షి అమ్మవారి ఆలయం వెళ్లిన కొన్ని నెలల తరువాత ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించడం జరిగింది.  ఇక్కడ ఈశ్వర విభూతి కార్యమును, సహస్రారంలో కుండలినీ విలాసంగా పోల్చి చెపుతారు. కావున దీనిని “ద్వాదశాంత స్థలి” అని పిలుస్తారు. 

3. అరుణాచలం: అరుణాచలమునే “తిరువణ్ణామలై" అంటారు. ఇక్కడ భగవాన్ 54 సంవత్సరాలు లోకానికి ఆచార్యులుగా వుండి బోధలను అందించారు. తిరుపతి నుంచి వెల్లూరు, వెల్లూరు నుంచి తిరువణ్ణామలైకు బస్సులో వెళ్ళవచ్చు. తిరుపతి నుంచి మధురై వెళ్ళే రైలులో ప్రయాణించి తిరువణ్ణామలైలో దిగవచ్చును. 'కాట్పాడి', తిరువణ్ణామలైకు దగ్గరలోని రైల్వే జంక్షన్. తిరిచ్చుళిలో పుట్టిన వెంకటరామన్ అరుణాచలంకు చేరిన తరువాత కొన్ని సంవత్సరాల తరువాత భగవాన్ రమణ మహర్షిగా రూపుదిద్దుకున్నారు. చివరికి ఆయన మరణించేవరకు అక్కడే ఉన్నారు. జన్మించినప్పుడు ఎలాగైతే జ్యోతి వెలిగిందో,  ఆయన మరణించినప్పుడు  కూడా తోకచుక్క ఆకాశానికేసి వెళ్లిపోయిందని అది ఆయన భక్తులకు కనిపించిందని చెబుతారు. 

నిజానికి ఆదిశంకరుల తరువాత అద్వైతాన్ని గురించి గట్టిగా ప్రపంచానికి వినిపించిన వారు రమణ మహర్షే!! ఈయన ఎవరికీ ఏవిధమైన బోధనలు చేయలేదు. తన జీవితం ద్వారానే ఆదర్శుడిగా నిలిచారు.

ఇట్లా రమణ మహర్షి జీవితంతో అనుబంధమైన ఈ శైవ క్షేత్రాలను చూసొస్తే విహారాయత్ర ముచ్చట, ఇటు ఆధ్యాత్మిక అనుభవం రెండూ కలుగుతాయి.

◆ వెంకటేష్ పువ్వాడ

By
en-us Political News

  
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి.
ఎండలు భగభగ మండుతూ ప్రజలను బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత రుతుపవనాలు వస్తాయి.  ఈ రుతుపవనాలు ప్రజలకు ఎంతో ఊరట ఇస్తాయి. చాలా ఎండల తర్వాత వర్షం కురవడం,  వాతావరణం చల్లబడటం..
తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కగా పెంచడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులకు ఉండే  కొన్ని అలవాట్లు తెలియకుండానే పిల్లల మీద ప్రబావం చూపిస్తాయి.ఇంకొక విచిత్రమైన విషయం...
పిల్లలను పెంచడం అంటే కేవలం వారికి మంచి విద్య,  ఆహారం,  కనీస అవసరాలు  అందించడం కాదు. వారికి అవసరమైన జీవిత నైపుణ్యాలు, విలువలను కూడా నేర్పించాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. తరచుగా చాలామంది తల్లిదండ్రులు...
సినిమాలు, సోషల్ మీడియా , సొసైటీ  తరచుగా వివాహాన్ని ఒక అందమైన చిత్రంగా చూపిస్తాయి. కానీ వాస్తవం అంతకంటే చాలా సంక్లిష్టమైనది. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా అపురూపమైనది.  భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా ఉంటూ,  ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ బంధం బాగుటుంది.  అయితే ఈ బంధంలో చాలామంది..
Why Indian Tulsi Is in Huge Demand Across Muslim Countries, Indian Tulsi Becomes a Hot Commodity in Muslim Countries, Indian Tulsi Demand Explodes in Muslim Nations, Why Muslim Countries Are Crazy About Indian Holy Basi
ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తప్పులు చేస్తాడు. కానీ అంతమాత్రాన వారు తప్పు చేస్తున్నారని, వారు తప్పు వ్యక్తులని కాదు. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకున్నప్పుడు,  తరచుగా పొరపాట్లు చేస్తారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.