అప్పటికప్పుడు టెన్షన్ తగ్గాలంటే!

Publish Date:Feb 18, 2021

Advertisement

ఒకప్పుడు రైళ్లు గంటకి పది మైళ్ల వేగంతో పరుగులు పెట్టేవి. ఇప్పుడో! గంటకి వంద మైళ్ల వేగం కూడా తక్కువగానే అనిపిస్తోంది. జీవితమూ అంతే... ఒకప్పుడు నిదానంగా సాగిన మన జీవితాలు ఇప్పుడు కుబుసాలు కదిలిపోయేంత వేగంగా పరుగులు పెడుతున్నాయి. ఇంత వేగంలో ఒత్తిడి కూడా సహజమే. మరి ఆ ఒత్తిడిని చిటికెలో తప్పించేందుకు కొన్ని చిట్కాలు ఇవిగో...

 

- ఒత్తిడితో కూడిన మనసు మీద శబ్దం చూపే ప్రభావం అపారం. మీకు ఇష్టమైన పాటని హమ్ చేయడమో, ప్రకృతిని తలపించే శబ్దాలను వినడమో (ఉదా॥ కెరటాలు) చేస్తే ఒత్తిడి తేలిపోతుంది. గది మధ్యలో చైనీస్ చిరుగంటలని తగిలించి, వాటి మీద మనసుని లగ్నం చేయడం కూడా కొందరికి ఉపశమనంగా ఉంటుంది.

 

- కాసేపు అలా వాహ్యాళికి వెళ్లడం వల్ల కూడా మనసులోని ఒత్తిడి నిదానంగా కరిగిపోతుంది. ఒత్తిడిని కలిగించే ఆలోచనలను పక్కన పెట్టి, శ్వాస మీద దృష్టిపెడుతూ నడకని సాగిస్తుంటే ఒత్తిడి ఇట్టే మాయమవుతుంది. సమస్య గురించి కాకుండా దానికి పరిష్కారాల గురించీ, జీవితంలో అంతకంటే విలువైన విషయాల గురించీ ఆలోచించే అవకాశం దక్కుతుంది.

 

- ఒత్తిడిగా అనిపించినప్పుడు లేచి నిల్చోవాలి. తల, వెన్ను, భుజాలని నిటారుగా ఉంచుకొని నిదానంగా, దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవాలి. బయటకి వదిలే ప్రతి ఊపిరితోనూ మీలోని ఉద్వేగం తగ్గిపోతున్నట్లుగానూ, లోపలకి తీసుకునే ప్రతి శ్వాసతోనూ మనసు తేలికపడుతున్నట్లు భావించాలి.

 

- ఓ అందమైన దృశ్యం లేదా సాంత్వన కలిగించే చిత్రాన్ని కాసేపు గమనించండి. కిటికీలోంచి బయట ప్రకృతిలోకి చూడటమో, మీకు ఇష్టమైన రంగులో ఉన్న వస్తువుని పరిశీలించడమో చేయవచ్చు. ఏదీ కుదరకపోతే కళ్లు మూసుకుని ఓ అందమైన ప్రకృతి దృశ్యాన్ని (ఉదా॥ జలపాతం) ఊహించుకోండి.

 

- ఉద్వేగం ఓ విషవలయం. ఉద్వేగంతో మన కండరాలన్నీ బిగుసుకుంటాయి. బిగుసుకుపోయిన కండరాలు మరింత ఉద్వేగానికి దారితీస్తాయి. కాబట్టి మనసు ఉద్వేగంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం మన మొహంలో కనిపించకుండా జాగ్రత్త పడాలి. అందుకోసం ఒక్కసారి మన శరీరం మీద ధ్యాస ఉంచాలి. నుదురు, పిడికిళ్లు బిగదీసి లేకుండా చూసుకోవాలి.

 

- ఉద్వేగాన్ని ఎదుర్కొనేందుకు నవ్వుని మించిన దివ్యౌషధం లేదు. నవ్వడం వల్ల మన శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ అనే రసాయనాల ఉత్పత్తి తగ్గి, వాటి బదులుగా ఆనందాన్ని రేకెత్తించే ఎండోమార్ఫిన్స్ అనే రసాయనాలు వెలువడతాయి. కాబట్టి మనస్ఫూర్తిగా నవ్వడమో, అలా నవ్వేందుకు ఇష్టమైన కామెడీ సన్నివేశాన్ని చూడటమో చేయవచ్చు.

 

- శబ్దమే కాదు, స్పర్శ కూడా ఉద్వేగాన్ని దూరం చేస్తుంది. మనకి ఇష్టమైన వస్తువుని పట్టుకుని ఉండటమో (ఉదా॥ టెడ్డీ బేర్), రబ్బర్ బాల్ని చేతితో నొక్కడమో, వేడి నీటితో స్నానం చేయడమో, వెచ్చటి దుప్పటిని కప్పుకోవడమో... ఉద్వేగం నుంచి తప్పకుండా దూరం చేస్తాయి.                    

- నిర్జర.

By
en-us Political News

  
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.