తెలంగాణ టీడీపీ వెరీగుడ్!

Publish Date:Jul 16, 2014

Advertisement

 

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా వున్న సందర్భంలో తెలంగాణలో మిగతా రాజకీయ పార్టీలన్నీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశాయి. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని అస్సలు లేకుండా చేయాలని పథకాలు రచించాయి. తెలంగాణ టీడీపీ నాయకుల మీద ఆకర్ష మంత్రాన్ని ప్రయోగించాయి. అలాంటి సందర్భంలో తెలంగాణ టీడీపీలోని కీలక నాయకులు చంద్రబాబుకు అండగా నిలిచారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి, ఇటు తెలంగాణలో టీడీపీ గౌరవప్రదమైన స్థానాలు పొందడానికి సహకరించారు. ఇతర పార్టీలు... ముఖ్యంగా టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నాయకులను తన పార్టీలోకి లాక్కోవాలని తీవ్రంగా ప్రయత్నించినా ఎవరూ ఆ మాయలో పడకుండా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. ఎర్రబెల్లి దయాకరరెడ్డి లాంటి నాయకుడైతే రాజకీయాల్లోంచి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుని బతుకుతాను తప్ప తెలుగుదేశం పార్టీని విడిచి వెళ్ళే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి నిబద్ధత కలిగిన నాయకులు, కార్యకర్తలున్న పార్టీ కాబట్టే తెలుగుదేశం పార్టీ రాజకీయ రంగంలో గౌరవాన్ని పొందుతోంది. తాజాగా మరోసారి తెలంగాణ తెలుగుదేశం మీద ‘ఆకర్ష’ మంత్రాన్ని ప్రయోగించే ప్రయత్నాలు జరిగాయి. తలసాని, రేవంత్ రెడ్డి లాంటి పలువురు తెలుగుదేశం నాయకులు టీఆర్ఎస్‌‌లో చేరబోతున్నారని పుకార్లు క్రియేట్ అయ్యాయి. ఇలాంటి సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చాలా ఘాటైన కామెంట్ చేసి పుకార్లను తిప్పికొట్టారు. కేసీఆర్ తన కాళ్ళు పట్టుకుని బతిమాలినా టీఆర్ఎస్‌లో చేరబోనని స్పష్టం చేశారు. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని, తలసాని ఇంటికి కేసీఆర్ వెళ్ళబోతున్నారని ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఇప్పటి వరకు తలసాని ఇంటికి కేసీఆర్ వెళ్ళింది లేదు. తలసాని టీఆర్ఎస్ వైపు చూసిందీ లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వలసలు వుంటాయని వచ్చిన వార్తలన్నీ కేవలం పుకార్లేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పుకార్లను సమర్థంగా తిప్పికొట్టిన తెలంగాణ టీడీపీ వెరీగుడ్ అంటున్నారు.

By
en-us Political News

  
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.