తెలంగాణ పోలీసుల ఆరోగ్య భద్రత పథకం రద్దు.. ఎందుకంటే?

Publish Date:Jul 1, 2026

Advertisement

తెలంగాణ పోలీసు సిబ్బందికి దశాబ్దాలుగా కొండంత అండగా నిలిచిన  ఆరోగ్య భద్రత నగదు రహిత   వైద్య చికిత్స పథకం రద్దైంది. బుధవారం (జులై1 )నుంచి ఈ పథకాన్ని  నిలిపివేస్తున్నట్లు డిజిపి, ఆరోగ్య భద్రత పథకం చైర్మన్ అయిన సీవీ ఆనంద్  సర్క్యులర్ జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కొత్తగా  ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించడమే దీనికి ప్రధాన కారణం. ఈ కొత్త విధానం ప్రకారం, జూన్ నెలకు సంబంధించిన జీతాల నుండి ఉద్యోగుల బేసిక్ పే,  పెన్షనర్ల బేసిక్ పెన్షన్ నుండి 1.5 శాతం చందాను రికవరీ చేయాలని ప్రభుత్వం జీవో 79 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా, జూలై 1న చెల్లించే జూన్ జీతాల నుండి పాత ఆరోగ్య భద్రత పథకానికి సంబంధించిన నెలవారీ చందా వసూళ్లను నిలిపివేశారు.

గత కొంతకాలంగా ఆరోగ్య భద్రత పథకం   నిధుల కొరతతో సతమతమౌతోంది. ఈ పథకం కింద ప్రతి నెలా దాదాపు 3వేల వైద్య బిల్లులు వస్తుండటంతో.. పాత నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుండి ఎలాంటి అదనపు రీఇంబర్స్‌మెంట్లు వచ్చే అవకాశం లేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే, నెట్‌వర్క్ ఆసుపత్రుల నుండి క్యాష్‌లెస్ సౌకర్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నారు. అయితే, జూన్ 30,  అంతకంటే ముందు ఆసుపత్రులలో చేరిన పాత రోగులకు మాత్రం వారు డిశ్చార్జ్ అయ్యే వరకు ఈ పథకం కింద చికిత్స కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు. జూలై 1 నుండి కొత్తగా ఎలాంటి అడ్మిషన్లను అనుమతించవద్దని అన్ని అనుబంధ ఆసుపత్రులకు, యూనిట్ అధికారులకు  ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ కొత్త ఇహెచ్‌సిటి   విధానంలో ఉద్యోగుల నుండి వసూలు చేసే 1.5 శాతం చందా మొత్తాన్ని వైద్య, ప్రజారోగ్య అవసరాల కోసం కేటాయించిన ప్రత్యేక ఖాతాలో జమ చేస్తారు. ఒకే కుటుంబంలో డూప్లికేషన్ లేదా ఒకే వ్యక్తి నుండి రెండుసార్లు చందాలు కట్ కాకుండా ప్రభుత్వం కొన్ని స్పష్టమైన నిబంధనలను విధించింది. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైనా, లేదా ఒకరు ఉద్యోగి అయి మరొకరు పెన్షనర్ అయినా, లేక ఒకే పెన్షనర్ సర్వీస్,  ఫ్యామిలీ పెన్షన్లు రెండూ పొందుతున్నా... కేవలం ఒక్కరి నుండి మాత్రమే ఈ చందా  సేకరిస్తారు. 1999లో ప్రారంభమై, పోలీస్ శాఖలో అత్యంత ఆదరణ పొందిన ఈ క్యాష్‌లెస్ హెల్త్‌కార్డ్ వ్యవస్థ  రద్దు కావడం పట్ల పోలీసు సిబ్బందిలో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
యాదగిరిగుట్ట ఆలయ కమిటీ ఏర్పాటుకు సంబంధించి తమకు కనీస సమాచారం కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులను, ముఖ్య నాయకులను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆయన బాహాటంగా తన నిరసన వ్యక్తం చేశారు.
లారీలు ఢీకొన్న వేగానికి వెంటనే మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లు సజీవదహనమయ్యారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నాని పాత కేసుల ఫైళ్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ హయాంలో చేసిన వ్యాఖ్యలు, చేష్టలపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. తాజాగా 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కొడాలి నానిపై అప్పట్లో నమోదైన కేసులో చర్యలు తీసుకునేందుకు పోలీసలు సిద్ధమయ్యారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మాధవీలత.. ఇప్పుడు క్రీడా రంగంలో ప్రతిభ చాటారు.
బస్సు అతి వేగంగా వెడుతుండటంతో.. ప్రమాద తీవ్రతకు ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి చూస్తుండగానే బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు సజీవ దహనమయ్యారు.
రెండు మూడు రోజుల కిందట ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులకు ప్రతీకార దాడులకు దిగింది పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుంటూ వెళ్లేలా అధునాతన డ్రోన్లతో తాలిబన్ దళాలు విరుచుకుపడ్డాయి.
ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ఇరు నేతలు గుర్తుచేసుకున్నారు. రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, రవాణా రంగాలతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురూ భావించారు. ఇటీవల భారతదేశం అత్యంత విజయవంతంగా నిర్వహించిన బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం పట్ల ముసూద్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ బోర్డులో మెగాస్టార్, ప్రముఖ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు ప్రభుత్వం చోటు కల్పించింది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే సురేఖ నియామకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరను భారీగా తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఏడాది వాణిజ్య సిలిండర్ ధర తగ్గడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే సాగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీరప్రాంతం అపారమైన సహజ వనరులకు, అరుదైన ఖనిజాలకు నిలయంగా మారింది.
అయోధ్య రామాలయం, విరాళాల వివాదం, రాముడి నిధుల దుర్వినియోగం, సిట్ విచారణ, యోగి ఆదిత్యనాథ్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.