Publish Date:Apr 11, 2025
తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలలో ఒక పార్టీ నేతలపై పొగడ్తల వర్షం కురిపిస్తూ, మరో పార్టీ అధినేతపై విమర్శలు గుప్పించారు. మామూలుగా అయితే రాష్ట్ర విభజన తరువాత నుంచీ బీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలూ, చర్యలూ పెద్దగా ఏమీ లేకపోయినా.. బీఆర్ఎస్ అధినేత నుంచి ఆ పార్టీ నేతలంతా తెలుగుదేశం అంటే ఉలిక్కి పడుతుంటారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే.. చంద్రబాబుకు 2019 ఎన్నికలలో బిగ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానని చెప్పుకున్నారు కూడా. అలాగే ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జగన్ హయాంలో చంద్రబాబును స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేసినప్పుడు చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అసలు కేసీఆర్ అయితే తెలంగాణలో తన రాజకీయప్రయాణం సాఫీగా జరగాలంటే చంద్రబాబును టార్గెట్ చేసి రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ ను సజీవంగా ఉంచడం ఒక్కటే మార్గమని భావిస్తుంటారని పరిశీలకులు చెబుతారు.
అటువంటిది బీఆర్ఎస్ అధినేత కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా చంద్రబాబు, లోకేష్ లపై ప్రశంసల వర్షం కురిపించి, అదే సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించడం రెండు రాష్ట్రాలలోనూ చర్చనీయాంశంగా మారింది.
అదే విధంగా కవిత చంద్రబాబు, లోకేష్ లను పొగడడం బీఆర్ఎస్ లో కూడా ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడిన కవిత తన తండ్రి కేసీఆర్ తన ఫేవరెట్ లీడరని చెబుతూనే.. చంద్రబాబు మనోధైర్యం, లోకేష్ మేకోవర్ అద్భుతమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు చాలా సిన్సియర్ లీడర్, ఏ సమస్యనైనా, సవాల్ నైనా ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పిన కవిత, ఆయన కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ మేకోవర్ అద్బుతమన్నారు. ప్రజలతో ఆయన మమే కమయ్యే విధానాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. అదే సమయంలో బీఆర్ఎస్ తో, కేసీఆర్ తో సత్సం బంధాలు కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ సీరియస్ గా తీసుకోవలసిన నాయకుడు కాదంటూ చులకన చేశారు. పవన్ పై తనకు ఏ మా త్రం గౌరవం లేదని కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఉభయ రాష్ట్రాలలోనూ ఇప్పుడు కవిత వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. కూటమి పార్టీలలో ఒక పార్టీ నేతలపై పొగడ్తలు, మరో పార్టీ అధినేతపై విరమ్శల వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-mlc-kalvakuntla-kavith-praises-cbn-and-lokes-39-196060.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు