Publish Date:Feb 15, 2026
ఎవరు ఎవరికి శతృవులో మితృవులో రాజకీయాల్లో చెప్పడం చాలా కష్టం. ఇటు ఏపీ అటు తెలంగాణాలో సొంతింటి బిడ్డలే ఆయా తండ్రి, సోదరులపై విరుచుకుపడుతుంటే.. అసలు సిసలైన ప్రత్యర్ధులకు పెద్దగా పని లేకుండా పోతోంది. ఏపీలో షర్మిళ రూపంలో ఆమె సోదరుడు జగన్పై తీవ్రస్థాయిలో.. నిందలూ- నిష్టూరాలు- అపవాదులు- అభిశంసనలు.. చివరికి అధికారం అతడికి సూటు కాలేదనడాలు.. ఇలా లెక్కలేనన్ని మాటలు తూటాల్లా పేలాయి.
ఇప్పుడు తెలంగాణలో కవిత రూపంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ,మాజీ మంత్రి హరీష్రావు , మాజీ ఎంపీ సంతోష్ తదితరులకు కవిత సినిమా చూపిస్తున్నారు. తాజాగా వచ్చిన మున్సిపల్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలసి తాము పోటీ చేశారు.. వారి ద్వారా గుర్తింపు తెచ్చుకునే యత్నం చేశారు కవిత. ఎందుకంటే ఆమెకు ఇంత వరకూ ఒక పార్టీ లేదు కాబట్టి. విచిత్రమైన విషయమేంటంటే కవిత ద్వారా ఫార్వర్డ్ బ్లాక్ అన్నది ఒకటి ఉందని చాలా మందికి ఇప్పుడే తెలిసింది.
ఇదిలా ఉంటే తాను పార్టీ పెడతానని తెలిసిన వెంటనే ప్రత్యర్దులను పక్కన పెడితే.. బీఆర్ఎస్ నేతలు చాలా మంది తనను ట్రోల్ చేస్తున్నారనీ.. వారందరికీ చెప్పేదేంటంటే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ముందుంది అసలు సినిమా అంటూ వార్నింగ్ ఇచ్చారు కవిత. సందట్లో సడేమియాలాగా.. కొందరు జాగృతి పార్టీ లీడర్లు ఏమంటున్నారంటే.. కవితక్క వచ్చే రోజుల్లో సృష్టించబోయే ప్రభంజనం ద్వార కేసీఆర్ ఆయన పార్టీ తుడిచి పెట్టుకుపోతుందని. ఈ మాటలంటున్నపుడు కవిత కూడా ఏమీ అనలేని దుస్థితి.
తాను రాజకీయంగా ఏవో నాలుగు చిలకపలుకులు పలికి పబ్బం గడుపుకోవాలని చూస్తుంటే వీరేంట్రా బాబూ.. నేను ఉత్తుత్తినే అన్న మాటలు నిజం చేసేలా ఉన్నారు??? అని లోలోపల అనిపిస్తున్నదా దాన్ని బయటకు అనలేని సిట్యువేషన్లో పడిపోయారు కవిత. ఆవు ఒక గట్టున నడిస్తే దూడ మరో గట్టున ఎందుకు నడుస్తుంది? ఇదీ అంతే అన్నట్టుగా మారింది పరిస్థితి.
కవితే, తన తండ్రి, ఆయన పార్టీ, ఆయన ఇతర నాయకులపై విరుచుకుపడుతుంటే.. మరి ఆమె సంస్థ కార్యకర్తలు మాత్రం ఊరుకుంటరా? బరాబర్ ఇలాగే మాట్లాతారన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్. పాపం ఇవన్నీ విని కవితక్క లోలోన ఎంత రగిలిపోతున్నారో. ఆమె ఒక రాజకీయ అవసరం కోసం తన తండ్రీ సోదరులపై కత్తి కడితే.. దాన్ని సీరియస్ గా తీస్కున్న కార్యకర్తలనే మాటలు ఆమెకు గుండెకోతగా అంచనా వేస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-jagruti-39-214118.html
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.