Publish Date:Oct 20, 2021
తెలంగాణలో గురుకులాలు తెరుచుకోనున్నాయి. కొవిడ్ కారణంగా మూతపడిన గురుకులాలు తెరిచేందుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురుకులాలు తెరవద్దన్న గత ఆదేశాలను హైకోర్టు సవరించింది. ఇంటర్ పరీక్షల దృష్ట్యా గురుకులాల ప్రారంభానికి అనుమతివ్వాలని ప్రభుత్వం కోరింది. విద్యాసంస్థల్లో కొవిడ్ నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఏజీ వెల్లడించారు. దీంతో గత తీర్పును సవరించిన హైకోర్టు.. గురుకులాల్లో ఆఫ్లైన్, ఆన్లైన్ బోధన చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది.
కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతితో మేలో లాక్ డౌన్ విధించారు. దీంతో జూన్ లో మొదలు కావాల్సిన విద్యా సంస్థలు తెరుచుకోలేదు. అయితే కోవిడ్ తీవ్రత తగ్గడంతో అక్టోబర్ నుంచి స్కూళ్లకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అన్ని రకాల విద్యా సంస్థలను తెరవాలని ఆదేశించింది. అయితే గురుకులలో కొవిడ్ మార్గదర్శకాలు పాటించడం సాధ్యం కాని, వాటిని తెరవొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై విచారించి ధర్మాసనం.. గురుకులాలు మినహా మిగితా విద్యాసంస్థలు తెరవొచ్చని ఆదేశించింది. తాజాగా గురుకులాలు కూడా తెరవడానికి గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-high-court-green-signal-to-gurukulalu-39-124881.html
కడప పార్లమెంట్ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక వస్తుందని అంటున్నారు. అలా ఉప ఎన్నిక వస్తే ఊరూ వాడా తిరిగి ప్రచారం చేసే బాధ్యతను నేను తీసుకుంటా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీకి కూడా రాకుండా పారిపోయిన వైఎస్ జగన్కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలతో వాతలు పెట్టారు. సోమవారం నాడు విజయవాడలో వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్రెడ్డి, పరోక్షంగా అనిపించినప్పటికీ ప్రత్యక్షంగానే జగన్ మీదకి మాటల బాణాలు వదిలారు.
మనం మనం ఒకటే అని చెప్పి, తన సామాజికవర్గానికే చెందిన వారిని మాయచేసి 514 కోట్ల రూపాయల భారీ మోసం చేసిన మోసగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
జగన్ అక్రమ ఆస్తుల కేసులో నిందితుడు, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రంలోని పలువురు దివ్యాంగ విద్యార్థులు ప్రతిభను కనబరిచి ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా వాళ్ళు మంత్రి లోకేష్ని కలసి కృతజ్ఞతలు తెలిపారు.
బిఆర్ఎస్ నేతలు కెటీఆర్, హరీష్ రావులు తీహార్ జైల్లో కవితను పరామర్శించినట్టు వార్తలు పైకి వెలువడుతున్నప్పటికీ అసలు ఎజెండా మాత్రం ఢిల్లీ పెద్దలను కలవడం అని తెలుస్తోంది.
జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఎయిమ్స్.కి నీటి సరఫరా ఆపేశారు. ఎందుకంటే, ఇది చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించింది కదా.. అందుకని! నీళ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదువుతున్నాయి మహాప్రభో అని ఎయిమ్స్ డైరెక్టర్ మధువానందకర్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు.
ఫ్రాన్స్ ప్రభుత్వం నెపోలియన్ వాడిన తుపాకులను జాతీయ సంపదగా ఇటీవలే ప్రకటించింది. అయినప్పటికీ, వీటిని బహిరంగ వేలంలో ఫ్రాన్స్ పౌరుడు ఒకరు కొనుగోలు చేశారు. వీటిని దేశం దాటించడానికి అవకాశం లేదు.
వారం రోజుల ముందే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఇప్పటి వరకు భారీ వర్షాలు లేవు. నెల రోజులు దాటినప్పటికీ ఇంత వరకు భారీ వర్షాలు లేవు. కానీ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవంపై దృష్టి సారించారు. తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగుదేశం పార్టీ కచ్చితంగా తెలంగాణలో పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ సత్పలితాలను ఇస్తోంది. ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు,ఆరుగురు ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిపోయారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతున్నది. ఆ పార్టీ నుంచి వలసలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో కింగ్ పిన్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.