తెరాస మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఏ ముహూర్తంలో ఏపీలో జగన్ ఏటుబడిలో విద్యుత్, రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది అన్నారో కానీ.. రోజు రోజుకూ ఆయన మాటలు అక్షర సత్యాలనడానికి నిదర్శనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా డిస్కమ్ లు దివాళా అంటూ జగన్ సర్కార్ చేతులెత్తేసింది. వైసీపీ నేతలు కేటీఆర్ కు విసిరిస సవాల్ ను తెలుగుదేశం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కనులారా చూద్దురు గాని రండి అంటూ ఆహ్వానం పలికిన వైసీపీ మంత్రులు ఆ తరువాత మళ్లీ ఆ ఊసెత్తడం లేదు. మాట వరసకు వందల బస్సుల్లో రండి రాష్ట్రంలో అభివృద్ధి ‘వెలుగులు’ చూపుతాం అని ఓ సవాల్ విసిరి వదిలేశారు. మళ్లీ మళ్లీ సవాల్ చేస్తే తెలంగాణ నుంచి మంత్రులు బస్సులేసుకు వచ్చేస్తారేమోనని భయపడినట్లు ఉన్నారు. ఒక వైపు డబ్బులు లేవు మహప్రభో అంటూ కోర్టులకు విన్నపాలు చేసుకుంటూ చెల్లింపులను చెల్లు చేసేయాల్సిందిగా కోరుతూ.. మరో వైపు అభివృద్ధి పరుగులు అంటూ పొరుగు రాష్ట్రం మంత్రులకు సవాల్ చేయడం వైసీపీకే చెల్లింది. జగనన్న మాటల్లాగే ఈ సవాల్ కూడా నాలుక చివర నుంచి వచ్చిందే తప్ప.. పొరుగు రాష్ట్రం మంత్రులకు నిజంగా ఆహ్వానం పలికే దమ్మూ ధైర్యం వైసీపీ మంత్రులకు లేదన్న నిశ్చితాభిప్రాయంతో ఉన్న తెలుగుదేశం.. ముందుకు వచ్చి ఆహ్వానం వైసీపీది అయితేనేం.. మే స్వాగతిస్తున్నాం రండి అంటూ పొరుగు రాష్ట్రానికి స్వాగతం పలికింది.
మీరు రావడం కాదు మేం తీసుకువస్తామంటూ ముందుకు వచ్చింది. ఒక్క తెలంగాణ నుంచే కాదు.. ఆ రాష్ట్రానికి పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచీ, ఇంకా కావాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచీ నేతలు, ప్రముఖులను తీసుకువచ్చి రాష్ట్రంలో ‘వెలిగిపోతున్న’ అభివృద్ధిని చూపిస్తామంటోంది.ఈ మేరకు తెలుగుదేశం నాయకుడు బుద్ధా వెంకన్న బహిరంగ ప్రకటన చేశారు. రాష్ట్రంలో పరిస్థితులను దగ్గరుండి మరీ చూపిస్తామని చెబుతున్నారు. సీపీఐ నాయకుడు నారాయణ అయితే ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్ర పరిస్థితులను వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసేశారు.
ఏపీలో రోడ్ల పరిస్థితి, పాలనా వైఫల్యాలు .. విధాన లోపాలను బయటపెట్టే ఉద్దేశంతో వైసీపీ నేతల ఆహ్వానాన్నే ఉపయోగించుకోవాలని తెలుగుదేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నేతలను ఏపీకి తీసుకొచ్చి వారికి రాష్ట్ర పరిస్థితులను చూపి సమస్యల తీవ్రత ను లోకానికి తెలియజేయాలని యోచిస్తోంది. ఈ యోచనను తెలుగుదేశం కార్యరూపంలోనికి తీసుకువస్తే వైసీపీకి రాజకీయంగా భారీ నష్టం జరుగుతుంది. టీడీపీ దూకుడు చూసి వైసీపీ మంత్రులు ఎందుకు సవాల్ చేశామురా భగవంతుడా అని తలలు పట్టుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tdp-responds-tp-ycp-invitation-25-135484.html
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.