ఆంధ్రాలో పప్పులుడకట్లేదు.. జ‌గ‌న్ రాజ‌గురువు ప్యాక‌ప్..!

Publish Date:Nov 27, 2024

Advertisement

వైసీపీ  హయాంలోఐదేళ్లూ ఆడిందే ఆట‌.. పాడిందే పాట అన్న‌ట్లుగా ఆయ‌న‌ హ‌వా సాగింది.  కోరిందే త‌డువుగా సీఎం  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నీ చ‌క‌చ‌కా చ‌క్క‌బెట్టేసేవారు. ప్ర‌భుత్వ భూముల‌ను సైతం నామమాత్రపు ధరకు క‌ట్ట‌బెట్టేశారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలోనూ ఆయ‌న హ‌వాకు అడ్డులేకుండా పోయింది. కానీ, ఇప్పుడు అత‌గానికి ఆంధ్రప్ర‌దేశ్ న‌చ్చ‌టం లేద‌ు. ఎందుకో తెలుసా..? ఆంధ్రాలో ఇక తన పప్పులు ఉడకవు కాబట్టి.  ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రా అని ఆలోచిస్తున్నారా..?  అక్కడికే వస్తున్నా.. వైసీపీ అధినేత  జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి రాజ‌గురువుగా, ఇంకా క్లియర్ గా  చెప్పాలంటే గుగ్గురువుగా చెప్ప‌బ‌డే విశాఖ‌ శార‌దా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర.  తెలంగాణ   కేసీఆర్, ఏపీలో జగన్ మోహ‌న్ రెడ్డి  అధికారంలో ఉన్న సమయంలో  ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ స్వరూపానందేంద్రకు అధిక ప్రాధాన్యత ఉండేది. ఈ ఇద్దరు మాజీ సీఎంలూ స్వామి స్వరూపానందేంద్ర పట్ల అత్యంత భక్తి విశ్వాసాలు ప్రదర్శించే వారు  స్వామీజీ ఇద్దరితోనూ రాజ శ్యామల యాగం చేయించారు. ఇద్దరూ విశాఖలోని శారదా పీఠం సందర్శించారు. అయితే, జగన్ మోహ‌న్ రెడ్డి మాత్రం శార‌దా పీఠానికి  ద‌త్త‌పుత్రుడిగా   వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌భుత్వ భూములను త‌క్కువ ధ‌ర‌కు క‌ట్ట‌బెట్ట‌డం ద‌గ్గ‌ర నుంచి.. స్వామిజీ ఎక్కడికి వెళ్లినా ట్రాఫిక్‌ అవాంతరాలు లేకుండా గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసేవారు. దీంతో దేశంలో హిందువుల‌కు నేనే పెద్ద‌దిక్కు అన్న‌ట్లుగా స్వామి స్వరూపానందేంద్ర ప్ర‌వ‌ర్తించార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.  

సాధార‌ణంగా కంచి, శృంగేరి పీఠాధిపతులు ఎప్పుడైనా రాష్ట్రానికి వస్తే అతిథిగా భావించి భద్రత కల్పిస్తారు. కానీ, జగన్ రాజ‌గురువుగా పేరున్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఎక్కడికి వెళ్లినా ఎస్కార్ట్‌ వాహనాలు, వై-కేటగిరీలో   భద్రతా సిబ్బంది ఉండేలా జగన్ ఆయనకు ఎక్కడ లేని ప్రాధాన్యతా ఇచ్చారు.  దానికి కారణం 2019లో జగన్‌ సీఎం కావాలని ఆయన రాజశ్యామల యాగం చేయడమే. దానికి గురుదక్షిణగా ప్రజాధనంతో శారదా పీఠానికి భద్రత కల్పించారు జగన్‌ మోహన్ రెడ్డి. స్వరూపానందేంద్రకు వై-కేటగిరీలో  భద్రత కేటాయించారు. ఆశ్రమానికి ఉన్న రెండుగేట్ల వద్ద ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లను విధుల్లో ఉండేవారు. ఎస్కార్ట్‌ వాహనంలో ఏఎస్సై, ఒక కానిస్టేబుల్ ఉండేవారు. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర  సరస్వతికి సైతం 2+2 భద్రతా సిబ్బంది, మరో ఎస్కార్ట్‌ వాహనం కేటాయించింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఎస్కార్ట్‌ వాహనాలకు ఇంధన ఖర్చునూ పోలీసు శాఖ‌ే భ‌రించేది. మొత్తంగా 20 నుంచి 25మంది వరకూ భద్రతా సిబ్బంది శారదాపీఠం, స్వరూపానందేంద్ర సువల్లో మునిగి తేలేవారు.   కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల‌కే వై-క్యాటగిరీ భద్రతను నిలిపివేసింది. వారికి వ‌న్ ప్ల‌స్ వ‌న్ పోలీసు బందోబస్తు మాత్రం కొనసాగుతోంది.

తాజాగా స్వ‌రూపానందేంద్ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తున్న ఎక్స్ క్యాట‌రిగీ భ‌ద్ర‌త‌ను కూడా ఉప‌సంహ‌రించుకోవాల‌ని విశాఖ శార‌దా పీఠం మేనేజ‌ర్ ఏపీ డీజీపీని ఓ లేఖ ద్వారా కోరారు. ఇక‌పై ఆయ‌న రుషికేశ్ లో త‌ప‌స్సులో ఎక్కువ స‌మ‌యం గ‌డ‌పాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలిపారు. దీంతో వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో రాజ‌గురువులా ఓ వెలుగు వెలిగిన స్వ‌రూపానందేంద్ర త్వ‌ర‌లో రాష్ట్రాన్ని వీడి రుషికేశ్ లోనే ఉంటార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే  ఆయ‌న ఆంధ్రాను వ‌దిలి వెళ్ల‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంలా ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం ఆయ‌న్ను నెత్తిన పెట్టుకోలేదు. అంద‌రి స్వామిజీల‌కు ఇచ్చిన మ‌ర్యాదను ఆయ‌న‌కు ప్ర‌భుత్వం ఇస్తున్నది. జ‌గ‌న్ హ‌యాంలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా త‌క్కువ ధ‌ర‌కే శార‌ద పీఠానికి భూముల‌ను కేటాయించారు.  వైసీపీ హయాంలో శారదా పీఠానికి రూ. 300 కోట్ల విలువ చేసే భూమిని కేవలం రూ. 15 లక్షలకే (ఎక‌రా ల‌క్ష చొప్పున) అప్పగించారనే అభియోగాలు ఉన్నాయి.  

దీంతో  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా క‌ట్ట‌బెట్టిన‌ ఆ కేటాయింపులను రద్దు చేసింది. మ‌రోవైపు తిరుమ‌ల‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా శార‌దా పీఠం కార్యాల‌యం కోసం నిర్మించిన   క‌ట్ట‌డాల‌ను ఇంజ‌నీరింగ్ విభాగం కూల్చేసింది. దీంతో జ‌గ‌న్ హ‌యాంలో ఐదేళ్లు ఆడిందే ఆట పాడిందేపాట‌గా కొన‌సాగిన స్వ‌రూపానందేంద్ర స్వామిజీకి కూట‌మి ప్ర‌భుత్వంలో షాక్‌ల మీద షాక్‌లు త‌గిలిన‌ట్ల‌యింది. దీంతో ఆయన రాష్ట్రం వదిలిపోవడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. లేకపోతే అప్పనంగా ప్రభుత్వం నుంచి నామమాత్రపు ధరలకు భూములు కొట్టేసినందుకో, తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినందుకో కేసులను ఎదుర్కొనవలసి వస్తుందన్న భయం కూడా ఆయనలో ఉండి ఉంటుంది. అందుకే రాష్ట్రం దాటేస్తే రుషీకేశ్ లో తపస్సు పేరుతో న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవచ్చని స్వరూపానందేంద్ర భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.