ఈ మహిళల విజయంతో కళ్లు చెదిరిపోవాల్సిందే!

Publish Date:Mar 8, 2017

Advertisement

 

కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ, షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ... అంటూ మంచి భార్యకి ఉండాల్సిన లక్షణాలు చెబుతాయి ధార్మిక గ్రంథాలు. కానీ స్త్రీ అంటే కేవలం భార్యేనా? కుటుంబాన్ని చక్కదిద్దడంలోనే ఆమె జీవితానికి సార్థకత దక్కుతుందా? అనే ప్రశ్నకు జవాబుగా ఆరుగురు విజయగాథలను గర్వంగా చెప్పుకుందాం...

 

సుచీ ముఖర్జీ - ఇప్పుడంతా ఆన్లైన్ షాపింగ్ హవా నడుస్తోంది. బయటకు వెళ్లే ఓపిక లేకనో, ధరలు తక్కువనో.. కారణం ఏదైతేనేం! అంతా ఆన్లైన్లో షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. అలా గుర్గావ్కి చెందిన ‘సుచీ ముఖర్జీ’ కూడా ఆన్లైన్ ద్వారా తనకి నచ్చిన బట్టలు కొనాలనుకున్నారు. ప్చ్!! ఎన్ని దుస్తులు చూసినా ఆమెకి నచ్చలేదు. అందరికీ నచ్చేలా కేవలం దుస్తుల కోసమే ఒక ఆన్లైన్ షాపింగ్ సైట్ ఉంటే బాగుండు అనుకున్నారు. ఎవరో దాకా ఎందుకు... తనే limeroad.com పేరుతో ఒక వెబ్సైట్ ప్రారంభించారు. ఈ ఆలోచన ఏమేమరకు ఫలితాన్ని ఇచ్చిందో అనుకుంటున్నారా! ఒక్కసారి limeroad.comలోకి వెళ్లి చూడండి. కళ్లు చెదిరిపోతాయి.

 

మిథాలీ టండన్ - నగర జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. పగలంతా సమస్యలతో నలిగేవారు సాయంవేళకి కాస్తోకూస్తో మందుపుచ్చుకోవడం అలవాటైపోయింది. ఇక శనాదివారాలు వస్తే చాలు.... వీకెండ్ పార్టీలలో పాల్గొని తీరాల్సిన పరిస్థితి. కానీ పొద్దున్నే లేచి ఆఫిసులకి పరుగులు తీసేదెలా! మద్యం మత్తులో నిస్సత్తువగా, తలనొప్పిగా ఉండే శరీరాన్ని ఉరుకెత్తించేదెలా! ఈ సమస్యకు పరిష్కారం కనుగొని దాన్ని ఓ వ్యాపారచిట్కాగా మార్చేశారు ‘మిథాలీ టండన్’. Morning Fresh పేరుతో హ్యాంగోవర్ తగ్గించే డ్రింక్ను ఉత్పత్తి చేస్తూ... మందుబాబులకు పరిష్కారాన్నీ, తనకి విజయాన్నీ సాధించారు. కావాలంటే drinkmorningfresh.com చూడండి.

 

రష్మీ దాగా - IIM అహ్మదాబాద్లో చదువుకున్న రష్మీ దాగా, బెంగళూరులో కళ్లు చెదిరే జీతంతో ఉద్యోగం చేసేవారు. ఉద్యోగపు ఒత్తిడిలో పడి అప్పుడప్పుడూ రష్మీ బయటనుంచి భోజనం ఆర్డరు చేసేవారు. ఆ భోజనంతో ఆమెకి ఆకలి తీరేదేమో కానీ తృప్తి మాత్రం కలిగేది కాదు. ఎప్పుడూ ఒకటేరకం కూరలు, ఏదో అమ్ముకోవడం కోసం వండినట్లుగా యాంత్రికంగా తోచే రుచి... దీంతో ఇంటి భోజనంలా ఎప్పడికప్పుడు రుచికరంగా, వైవిధ్యంగా ఉండే ఆహారాన్ని అందచేస్తే ఎంత బాగుండో అనిపించింది. వెంటనే తన ఆలోచనను అమలుచేసేశారు. ఫలితం ఆమె స్థాపించిన హోం డెలివరీ ఆహారం ఇప్పుడు నాలుగు నగరాలలో దొరుకుతోంది. (freshmenu.com)

 

కోమల్ అగర్వాల్ - సెల్ఫోన్ లేని నరమానవుడు కనిపించడం అరుదు. మరి అలాంటి సెల్ఫోనుకి అవసరమయ్యే సదుపాయాలని కొనుక్కోవాలంటే ఒకోటీ ఒకో కంపెనీది కనిపిస్తుంది. దీనికి విరుగుడుగా పవర్బ్యాంక్ల దగ్గర నుంచీ చార్జర్ల వరకూ ఒకే చోట అందిస్తే ఎలా ఉంటుంది అనిపించింది కోమల్ అగర్వాల్ అనే అమ్మాయికి. ఫలితం ‘పెబుల్స్’ బ్రాండ్ ఆవిర్భావం. ఇప్పుడు పెబుల్స్ ఓ వంద కోట్ల సంస్థ.

 

రిచా కౌర్ - ఆడవారి లోదుస్తులు అనగానే అదేదో అసభ్యమైన పదంలా తోస్తుంది. ఆరోగ్యం కోసమో, సౌకర్యం కోసమో మంచి లోదుస్తులు తీసుకోవాలంటే దేశీయంగా ఉత్త పనికిమాలిన సరుకు లభిస్తుంది. ఈ పరిమితులను దాటాలనుకున్నారు ‘రిచా కౌర్’. మన దేశంలోనే మహిళలకు ఆంతర్జాతీయ స్థాయి లోదుస్తులకు ఓ బ్రాండ్ రూపొందించే ప్రయత్నం చేశారు. అదే Zivme. ఆ బ్రాండ్ ఎంత విజయవంతం అయ్యిందో చూడాలంటే zivame.com/లోకి వెళ్లాల్సిందే!

 

సైరీ చాహల్ ¬- సైరీ చాహల్ అవకాశాలను అందిపుచ్చుకునే ఓ వ్యాపారవేత్త. అందుకనే ఇంటర్నెట్ మొదలైన రోజుల్లోనే ఓ వెబ్సైటుని ప్రారంభించి లాభాలను సాధించారు. తన సంగతి సరే! కానీ ప్రతిభ ఉన్నా ఇంటిపనులలో సతమతం అయిపోయే స్త్రీల పరిస్థితి ఏంటి అన్న ఆలోచన వచ్చింది సైరీకి. అంతే! SHEROS పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. ప్రతిభకు తగిన ఉపాధిని కల్పించడంలో వేలాదిమంది స్త్రీలకు SHEROS సంస్థ ఓ మాధ్యమంగా నిలుస్తోంది (sheros.in).

(బిజినెస్ ఇన్సైడర్ సౌజన్యంతో)

- నిర్జర.

 

 

By
en-us Political News

  
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.