సోనియా గాంధీ ఫిర్ ఏక్ బార్ ?!

Publish Date:Sep 28, 2022

Advertisement

అవును. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు సోనియా చెంతకు చేరుతుందా? మరోసారి, ఆమె ఆ బాధ్యతలను భుజానికి ఎత్తుకోక తప్పదా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కుంటున్న బహుముఖ సంక్షోభం వెనక పైకి కనిపించే కోణం ఒకటైతే, అంతర్గతంగా వినిపిస్తున్నకథనం మరోలా ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం. పార్టీ పగ్గాలు కుటుంబేతరులకు అప్పగించేందుకు సోనియా గాంధీ ఎంత మాత్రం సుముఖంగా లేరు. అంతే కాదు, చివరకు ప్రియాంకా వాద్రాకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు ఆమె మనసు అంగీకరించడం  లేదు. కూతురు మనమ్మాయే అయినా అల్లుడు మన వాడు కాదు, పైగా, అతగాడు మామూలోడు కూడా కాదు. నిజానికి, ఇప్పటికే పార్టీలో ఒక వర్గం వాద్రా కనుసన్నల్లో పనిచేస్తోందనే అనుమాన, భయాలు సోనియాను వెంటాడు తున్నాయి. అందుకే 2019లో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సందర్భంగా, సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టక తప్పని పరిస్థితిని సృష్టించి, తాత్కాలిక అనే ట్యాగ్ లైన్ తో బాధ్యతలు స్వీకరించారు.

ఇప్పుడు అదే పద్దతిలోనే మరో మారు, అదే పరిస్థితి క్రియేట్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయని, పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి పార్టీ పగ్గాలు వదిలితే, ఇక మళ్ళీ పార్టీని తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడం అయ్యే పని కాదని సోనియా గాంధీ చాలా గట్టిగా నమ్ముతారనేది ఎవరూ కాదనలేని నిజం. నిజానికి, ఒక్క కాంగ్రెస్ అనే కాదు, ఏ కుటుంబ పార్టీ కూడా పార్టీ పగ్గాలు కుటుంబ వ్యక్తులకు అప్పగించరు. అలాంటిది  ఒకసారి పార్టీ పగ్గాలు వదిలితే ఎమౌవుతుందో అనుభవ పూర్వకంగా తెలుసు కున్న సోనియా గాంధీ, అందుకు అసలే ఇష్టపడరని అంటున్నారు. 

రాజీవ్ గాంధీ ఆకస్మిక మరణం తర్వాత, పీవీ నరసింహ రావు, సీతారాం కేసరికి పార్టీ ప్రభుత్వ పగ్గాలు వదిలేసిన సమయంలో ఎదురైన చేదు అనుభవాలు ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే 2019లో రాహుల్ గాంధీ క్లియర్ కట్ గా గాంధీ కుటుంబం బయటి వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని పట్టు పట్టినా ఆమె అది తమకు మోయలేని భారమే అయినా ఆ బరువు బాధ్యతలను నెత్తి కెత్తుకున్నారు. ఏదో ఒకనాటికి రాహుల్ గాంధీ మనసు మార్చుకుని పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని ఆశించారు. అయితే మూడేళ్లయినా, రాహుల్ తీరు మాలేదు. బాధ్యతలు లేని అధికారాలకు అలవాటు పడిన రాహుల్  పార్టీ అధ్యక్షుడు ఎవరైనా ఇప్పటిలానే, ఎప్పటికీ ‘అధినాయకుడు’ గా ఉండి పోయేందుకే నిర్ణయించుకున్నారు. 

ఈ నేపధ్యంలో విధేయుడు అనుకున్న అశోక్ గెహ్లాట్ ను, అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తే ఎన్నికకు ముందే తిరుగుబాటు జెండా ఎగరేశారు. అఫ్కోర్స్, అది కూడా సోనియా స్క్రిప్ట్ లో భాగమనే వాదన మరొకటి ఉందనుకోండి అంది వేరే విషయం. గెహ్లాట్ తిరుగుబాటు, సోనియా  రాహుల్  స్క్రిప్ట్ ప్రకారం జరిగినా  గెహ్లాట్ స్వయంగా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం కథ నడిపినా, సోనియా గాంధీ మరొకరికి పార్టీ పగ్గాలు అప్పగించే  అవకాశం లేదని, అంతర్గత వర్గాల వర్గాల సమాచారం.అందుకే మళ్ళీ మరోమారు రాహుల గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలనే  రాగాలు మొదలయ్యాయని అంటున్నారు.

అలాగే కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్, ఏకే అంటోనీ, ముకుల్ వాస్నిక్, ఖర్గే వంటి మరికొందరు ‘విధేయుల’ పేర్లు ప్రచారం లోకి వచ్చినా, చివరకు రాహుల్ గాంధీ అంగీకరించని పక్షంలో మళ్ళీ  ఫిర్ ఏక బార్ సోనియానే పార్టీ చీఫ్ అంటున్నారు.  అయితే ఇది ఇంతవరకు జరిగిన కథ. ఇది ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, చివరకు శుభం కార్డు ఎప్పుడు, ఎలా పడుతుందో ... చూడవలసిందే అంటున్నారు.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.