చంద్రబాబుతో అనుబంధం వెరీ స్పెషల్ అంటున్న సోము!

Publish Date:Mar 11, 2025

Advertisement

పొత్తు సాకుగా చూపి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో తన పబ్బం గడుపుకుంటోంది. తెలుగుదేశం వ్యతిరేకులకు కూటమి కోటాలో పదవులు దక్కేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలో తెలుగుదేశం క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. అయినా చంద్రబాబు మిత్రధర్మం, కూటమి బంధం అంటూ క్యాడర్ ను సముదాయించడానికే ప్రయత్నిస్తున్నారు. అయితే 2019-2024 మధ్య కాలంలో అధికారంలో ఉన్న జగన్ కు వంత పాడి.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సోము వీర్రాజుకు ఎమ్మెల్యే కోటీ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ టికెట్ లభించడాన్ని తెలుగుదేశం క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నది. అలాగే జనసేనానిపై కూడా సోము అప్పట్లో చేసిన విమర్శలను గుర్తు చేస్తూ జనసేన క్యాడర్ కూడా సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ టికెట్ ఏమిటని బీజేపీపై గుర్రుగా ఉన్నారు. ఎవరేమనుకుంటే నాకేం.. పబ్బం గడిస్తే చాలన్నట్లుగా బీజేపీ హైకమాండ్ వ్యవహరిస్తున్నది. 

ఈ నేపథ్యంలో కూటమి పార్టీల అభీష్ఠానికి వ్యితిరేకంగా బీజేపీ హైకమాండ్ ఆశీస్సులతో ఎమ్మెల్సీ టికెట్ దక్కించుకున్న సోము వీర్రాజు.. ఇప్పుడు చంద్రబాబుతో తన అనుబంధం వెరీ స్పెషల్ అంటున్నారు. ఎంత స్పెషల్ అంటే చంద్రబాబు, మోడీ మధ్య అనుబంధం ఎలాంటిదో.. చంద్రబాబుతో తన అనుబంధం కూడా అలాంటిదేననీ చెబుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేసిన సోము వీర్రాజు ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

సోము వీర్రాజు మాజీ సీఎం జగన్ కోవర్టు అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆయన ఈ సందర్భంగా ఖండించారు. అదంతా అవాస్తవమని చెబుతూ 2019లో జగన్ సీఎం అయ్యేంత వరకూ తనకు ఆయనతో పరిచయం కూడా లేదన్నారు. అయితే చంద్రబాబుతో మాత్రం తొలి నుంచీ ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. 2014లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పుడే చంద్రబాబు తనకు మంత్రి పదవి ఆఫర్ చేశారని సోము వీర్రాజు చెప్పుకున్నారు. అయితే ఆ ఎన్నికలలో సోము అసలు పోటీ యే చేయలేదు.  ఆ తరువాత ఎప్పుడో ఎమ్మెల్సీ అయ్యారు. అయినా కూడా సోము వీర్రాజు ఎన్నడూ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడిన సందర్భం లేదు.

అంతే కాకుండా రాజధాని అమరావతి విషయంలో కూడా సోము వీర్రాజు జగన్ విధానాలనే సమర్ధించారు. జగన్ హయాంలో సోము వీర్రాజు వ్యవహార శైలిపై బీజేపీ రాష్ట్ర నేతలే మండిపడ్డారు. సోముకు వ్యతిరేకంగా బీజేపీ అధిష్ఠానానికి అప్పట్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ వచ్కకచిన తరువాత సోము వీర్రాజు ఒక్క సారిగా స్వరం మార్చేశారు. తాను ఎప్పుడూ అమరావతి రాజధానికే మద్దతుగా నిలిచానని చెప్పుకొస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ కోసం తాను ఎటువంటి లాబీయింగ్ చేయలేదనీ, బీజేపీ అధిష్ఠానమే తన సీనియారిటీకి గుర్తింపుగా టికెట్ ఇచ్చిందని చెప్పుకున్నారు. అంతే కాదు మీడియా ముందు ఆయన తాను ఎప్పుడూ వైసీపీకి అనుకూలంగా లేననీ, వైసీపీ విధానాలకు గట్టిగా వ్యతిరేకించాననీ చెప్పుకోవడానికి నానా తంటాలూ పడ్డారు. మీడియా ఎదుట ఆయన ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ, జగన్ హయాంలో ఆయన వ్యవహరించిన తీరును, ఆయన జగన్ అనుకూల వైఖరినీ ఎవరూ మరిచిపోరు. ఇప్పుడు తాను వైసీపీకి అనుకూలంగా ఎన్నడూ వ్యవహరించలేదని ఎంతగా చెప్పుకున్నా ఎవరినీ నమ్మించలేరు.  

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.