Publish Date:Apr 29, 2022
ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కూతురు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. మంచి సంబంధం అనుకొని పెళ్లి చేశారు. కట్నం, బంగారం భారీగానే ముట్ట జెప్పారు. త్రీ మంత్స్ హ్యాపీ. దెన్ స్టార్టెడ్ ప్రాబ్లమ్స్. వాడు మొగుడు కాదు డబ్బు పిశాచి అని ఆలస్యంగా తెలిసొచ్చింది. అదనపు కట్నం కోసం నిత్యం భార్యను టార్చర్ చేసేవాడు. మామ ఆస్తిలో సగం రాసివ్వాలంటూ గొడవ గొడవ చేసేవాడు. ఆ శాడిస్ట్ మొగుడి టార్చర్ పడలేక.. పుట్టింటికి వచ్చేసింది ఆ భార్య. అయినా, వదిలిపెట్టలేదు. ఫోన్ చేసి బూతులు తిట్టేవాడు. ఫోన్ ఎత్తకపోతే.. ఆమె చెల్లెలికి కాల్ చేసి సతాయించేవాడు. ఓ రోజు నేరుగా భార్య ఇంటికి వచ్చాడు. ఆస్థి కోసం మళ్లీ తిట్టి.. కొట్టి.. పుస్తెల తాడు తెంచేశాడు. ఇక వీడు మారడు.. వీడితో పడలేను అనుకుంది ఆ అభాగ్యురాలు. భర్త వెళ్లిపోగానే బెడ్రూమ్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్లో జరిగిన ఆ ఆత్మహత్య.. సిరిసిల్లలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ సైకో భర్త ఇంటిముందు ఆందోళన చేశారు మృతురాలి బంధువులు. కేటీఆర్ ఇలాఖాలో జరిగిన ఈ దారుణం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల జోక్యంతో కేసు మరో మలుపు తిరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే....
సిరిసిల్లకు చెందిన జూపల్లి శ్రీనివాసరావు.. హైదరాబాద్ కూకట్పల్లిలో సెటిల్ అయ్యారు. ఇద్దరు కుమార్తెలు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న పెద్ద కూతురు నిఖితకు సిరిసిల్లకే చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి చేటి ఉదయ్తో గతేడాది జూన్లో పెళ్లైంది. 10 లక్షలు క్యాష్, 35 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. అయితే, శ్రీనివాసరావుకు సొంతూరులో 4.25 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. అందులో సగం భూమిని తనకు ఇవ్వాలంటూ భర్త ఉదయ్.. భార్య నిఖితను వేధిస్తున్నాడు. సగం భూమి ఇచ్చేందుకు శ్రీనివాసరావు ఒప్పుకోవడం లేదు. తమ మరణానంతరం ఆస్తి ఇద్దరు కూతుర్లకు చెరిసగం అని చెబుతున్నాడు. కానీ, ఉదయ్ మాత్రం ఇప్పుడే ఆస్థి పంచి ఇచ్చేయాలని పట్టుబట్టేవాడు. లేదంటే, అదనపు కట్నం కావాలంటూ భార్యను టార్చర్ చేసేవాడు. దీంతో శ్రీనివాసరావు ఇటీవల అల్లుడికి మరో రూ.10 లక్షలు ఇచ్చారు. అయినా ఉదయ్ వేధింపులు ఆగలేదు. నిఖిత అత్తమామలైన అశోక్రావు, శ్యామల, మరిది ఉపేందర్ సైతం ఉదయ్కే వంత పాడుతుండటంతో నిఖిత ఈ ఉగాది రోజున (ఏప్రిల్ 2న) కూకట్పల్లిలోని పుట్టింటికి వచ్చేసింది. అయినా రోజూ ఫోన్లో భార్యను వేధించేవాడు భర్త. ఫోన్ తీయకపోతే ఆమె సోదరి నీతకు ఫోన్ చేసి తిట్టేవాడు. మామూలుగా ఉండకపోయేది వాడి టార్చర్ అంటున్నారు.
ఇక, ఇటీవల నిఖిత ఇంటికి వచ్చిన ఉదయ్ పెద్ద గొడవ చేశాడు. భార్యాభర్తలకు తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. భార్య మెడలోని మంగళసూత్రాన్ని తెంపి నేలకేసి కొట్టాడు. నిఖితను తీవ్రంగా కొట్టి వెళ్లిపోయాడు. ఉదయ్ వేధింపులు భరించలేకపోయిన నిఖిత మనస్తాపం చెంది.. బెడ్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. రాత్రి 10 దాటినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలుకొట్టి చూడగా.. అప్పటికే ఆమె ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయి ఉంది.
నిఖిత ఆత్మహత్యకు కారణమైన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి బంధువులు సిరిసిల్లలోని ఉదయ్ ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన చేశారు. సిరిసిల్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/software-employee-sucide-with-her-husband-tarcher-25-135217.html
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.