నిలబడి నీళ్లు తాగకూడదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..!

Publish Date:Jun 13, 2024

Advertisement

సకల జీవులకు నీరే ప్రాణాధారం. మానవ శరీరంలో దాదాపు 70శాతం నీరు ఉంటుంది. మనిషి జీవితం చాలా వరకు నీటి మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రతి రోజూ 3 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలని అంటుంటారు.  కానీ నీరు తాగే విధానంలోనే దాని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఉంటాయి. కొందరు నీటిని నిలబడుకుని తాగుతారు. మరికొందరు చాలా వేగంగా ఒక్కసారే నీటిని తాగుతారు. ఇంకొందరు  మెల్లిగా నీటిని తాగుతారు.  అయితే నీరు ఎలా తాగితే మంచిది? ఎలా తాగకూడదు? వైద్యులు చెబుతున్న విషయాల వైపు ఓ లుక్కేస్తే..


నిలబడి నీళ్లు తాగడం వల్ల జరిగేది ఇదీ..


నిలబడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే  కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉంటే మాత్రం  అస్సలు నిలబడి నీళ్లు తాగకూడదు.


కీళ్లనొప్పులు ఉన్నవారు ఎప్పుడూ నిలబడి నీళ్లు తాగకూడదు. అలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు పెరుగుతాయి. నిలబడి నీరు త్రాగడం వల్ల శరీరంలో ద్రవం పెరుగుతుంది. ఇది కీళ్ల నొప్పులను పెంచుతుంది.

నిలబడి నీరు తాగడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.

నిలబడి నీరు త్రాగడం  జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఆ నీరు త్వరగా పొట్టలోకి చేరి శరీరం కింది భాగంలో గాయం అవుతుంది.


నీరు త్రాగడానికి సరైన మార్గం..

నీరు తాగేటప్పుడు హాయిగా కూర్చొని  తాగాలని వైద్యులు చెప్తున్నారు.  ఒక్కసారిగా నీళ్లు తాగే బదులు చిన్న చిన్న గుక్కలుగా తాగాలి. నెమ్మదిగా నీటిని తాగడం ద్వారా శరీరం  ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది.  శరీరానికి అవసరమైన అన్ని ఖనిజాలు అందుతాయి. అంతేకాదు చిన్న గుక్కలుగా నీరు తాగేటప్పుడు నీటిలో లాలాజలం కలిసి జీర్ణక్రియ పెరగడంలో సహాయపడుతుంది.


                                              *రూపశ్రీ.

By
en-us Political News

  
తిప్పతీగ గురించి ఈ మధ్యకాలంలో చాలా సమాచారం వ్యాప్తి అవుతోంది.  ఒకప్పుడు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా పెరిగేవి తిప్పతీగ మొక్కలు.  ఇప్పుడు ఇళ్ళలో పెంచుకోవడం లేదా ఆన్లైన్ లో తిప్పతీగ పొడర్స్..
శరీరంలో ఏదైనా అవయవం లేదా ప్రాంతం అసౌకర్యానికి లోనైనప్పుడు, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.  సాధారణంగా శరీరంలో కలిగే నొప్పులు  ఒకటి రెండు రోజులలో వాటికవే తగ్గిపోతాయి....
బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం? ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే..
కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు, స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం, వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం, రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం, పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.