ఆ ఏడుగురిదీ ధిక్కారమే? జగన్ చేతులెత్తేశారా?

Publish Date:Mar 21, 2025

Advertisement

వైసీపీ లేని, రాని ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీకి చెందిన జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేలూ సమష్టిగా పోరాడుతున్నారని అంతా భావించారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం ఆరు నెలల పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే సభ్యత్వం కోల్పోయే ప్రమాదం ఉందని తెలిసినా వారు అందుకు సిద్ధపడే శాసన సభను బాయ్ కాట్ చేశారని అంతా భావిస్తూ వచ్చారు. అయితే ఎప్పుడైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సెషన్ కు జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేలూ హాజరయ్యారో.. అప్పుడే అందరికీ   అనర్హత వేటుతో శాసన సభ సభ్యత్వాన్ని కోల్పోయి ఉప ఎన్నికను ఎదుర్కొనే ధైర్యం జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికీ లేదని అర్ధమైపోయింది.

అందుకే కేవలం అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెట్టడానికే వారు ఆ ఒక్క రోజూ సభకు వచ్చారని స్పష్టమైపోయింది. అదలా ఉంచితే..  ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం రోజు వచ్చి సంతకం పెట్టినా అది రెగ్యులర్ సెషన్ లోకి రాదని స్పీకర్ సభా నిబంధనలను ఉటంకిస్తూ స్పష్టత ఇవ్వడంతో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి వ్రతమూ చెడింది. ఫలమూ దక్కలేదన్నట్లైంది. దీంతో ఇక చేయగలిగిందేముంది, రోట్లో తలపెట్టాం.. రోకలి పోటుకు ఎదురు చూడాల్సిందే అన్నట్లుగా జగన్ అండ్ కో చేతులెత్తేశారు. కానీ ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు ఇక్కడే తమ ధిక్కారాన్ని సున్నితంగానైనా పార్టీ అధినేత జగన్ కు తెలియజేయాలనుకున్నారు. జగన్ అభీష్ఠానికి విరుద్ధంగా, కనీసం ఆయనకు సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీకి వెళ్లి హాజరు పట్టీలో సంతకం పెట్టి వచ్చేశారు.  సభలో వారు ఏ కార్యక్రమంలోనూ పాల్గొన లేదు. కేవలం అసెంబ్లీకి వెళ్లి హాజరు పట్టీలో సంతకం పెట్టి వచ్చేశారంతే. దీని వల్ల పుణ్యమూ పురుషార్థమూ దక్కుతాయని వారు భావించారు.

అయితే అలా దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టేసినంత మాత్రాన వారు సభకు హాజరైనట్టుగా తాను పరిగణిం చబోననీ, అయినా దొంగల్లా అసెంబ్లీకి రావాల్సిన ఖర్మ ఎందుకు దర్జాగా వచ్చి సభా కార్యక్రమాల్లో పాలు పంచుకోండి అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వారికి హితవు పలికారు. అయితే జగన్ కు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అసెంబ్లీలో అడుగుపెట్టి సంతకాలు పెట్టేసిన ఏడుగురు ఎమ్మెల్యేల విషయంలో జగన్ ఏం చర్య తీసుకుంటారన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. చర్య అంటూ తీసుకుంటే జగన్ పార్టీ బలం అసెంబ్లీలో నాలుగుకు పడిపోతుంది. పోనీ చర్య తీసుకోకుండా వదిలేస్తే ఇక ఎమ్మెల్యేలెవరూ జగన్ ను లెక్క చేసే పరిస్థితి ఉండదు. దీంతో వీరి విషయంలో జగన్ పరిస్థితి కక్కలేక.. మింగలేక అన్నట్లు తయారైందని నెటిజనులు సెటైర్లు పేలుస్తున్నారు. 

By
en-us Political News

  
‘కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల కాలంలో 50 వేల ఉద్యగాలు ఇచ్చింది’ ఈ మంత్రాన్ని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు’ రోజూ జపిస్తూనే ఉంటారు.  మరో వంక ఇందులో గత ప్రభుత్వం ఘాతాలోకి ఎన్ని పోతాయి,కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలోకి ఎన్ని వస్తాయి
  తెలంగాణ  ప్రభుత్వం ఈ నెల ( మార్చి) 19 న 2025 – 2026 వార్షిక బడ్జెట్’ ను సభకు సమర్పించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, రూ’ 3.04,965 కోట్ల అంచనాలతో,బరువు ‘తక్కువ’ బడ్జెట్’ను సభకు సమర్పించారు.
సీఎం రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌  వర్నింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఒకే వేదికపై కనిపించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో ప్రతి రోజూ, ప్రతి నిమిషం కాంగ్రెస్, బీఆర్ఎస్ బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తుంటాయి.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపిల్ రానే వచ్చేసింది. ఆదివారం  ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. సన్ రైజర్స్ హైద్రాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది.
మత్తు పదార్థాల వలె సెల్ ఫోన్లకు అతుక్కుపోయేవారి సంఖ్య  రోజురోజుకి పెరిరిపోతుంది. ట్రాయ్ 2024  సెప్టెంబర్ నివేదిక ప్రకారం తెలంగాణలో 4.19 కోట్ల మంది ఉన్నట్లు వెల్లడైంది.
 ఎంఆర్ పిఎస్ అధ్యక్షుడు  మందకృష్ణ వైకాపా అధినేత వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల వైకాపా ప్రభుత్వం ఎస్ సి వర్గీకరణ కోసం  ఒక్క ప్రయత్నం కూడా చేయలేదన్నారు జగన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఆ పార్టీలోని మాదిగ నేతలు పునరాలోచించుకోవలన్నారు.
ఆంధ్ర ప్రదేశ్  అవనిగడ్డలో  ఐసిస్ డ్రగ్ కలకలం రేపింది.  తాజాగా ఈగల్ టీం దాడుల్లో విస్తుకోల్పోయే నిజాలు వెల్లడయ్యాయి. ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలు వినియోగించే డ్రగ్స్  కృష్ణా జిల్లా అవనిగడ్డ వీధుల్లో లభ్యం కావడంతో అధికారుల  ఫీజులు ఎగిరిపోయాయి.
తెలంగాణ రాజకీయాలలో అనూహ్య సంఘటన జరిగింది. ఉప్పూ నిప్పులా ఉండే రేవంత్ రెడ్డి, హరీష్ రావులు శుక్రవారం భేటీ అయ్యారు. మాజీ మంత్రి పద్మారావుగౌడ్ తో కలిసి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ కు వెళ్లిన హరీష్ రావు ఆయనతో దాదాపు పావుగంట సేపు చర్చలు జరిపారు.
తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని ఆయన టీటీడీ అధికారులను ఆదేశించారు.
నటుడు,  వైకాపా నేత పోసాని కృష్ణమురళికి తాత్కాలికంగా రిలీఫ్ లభించినప్పటికీ విడుదలపై ఉత్కంఠత నెలకొంది. కూటమి నేతలపై  పోసాని అనుచిత వ్యాఖ్యలు చేసిన  నేపథ్యంలో ఎపిలో 17 పోలీస్ స్టేషన్లలో  కేసులు నమోదయ్యాయి. మొత్తం ఐదు కేసులో బెయిల్ లభించినప్పటికీ పోసాని విడుదల కాలేదు.
నాగపూర్ లొ మూడు రోజుల అనంతరం కర్ఫ్యూ ఎత్తివేశారు. నాగపూర్ లో ఇటీవల హింసాకాండకు చెలరేగడానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
వెండి తెర పైనో, బుల్లి తెర పైనో, కనిపించిన ప్రతి ఒక్కరూ సెలబ్రిటీనేనా? ఇంకేమైనా అర్హతలు, యోగ్యతలు అవసరం అవుతాయా? అంటే సమాధానం చెప్పడం కష్టం కాదు గానీ, ఇబ్బందికరంగా ఉంటుంది.
డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు ఇండియన్స్ కు మరణ శిక్ష విధించే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. నిరుడు జులైలో సింగపూర్ ప్లాగ్ ఉన్న ఓడలో నిషేధిత డ్రగ్ అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు భారతీయుల సమాచారం ఇండో నేషియా పోలీసులకు అందింది. వెంటనే రైడ్స్ చేయడంతో 106 కిలోల గంజాయి మాదక ద్రవ్యాలను స్వాధీనం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.