పెద్దలంటే భారం కాదు బాధ్యతని చాటి చెప్పే సీనియర్ సిటిజన్స్ డే!

Publish Date:Aug 21, 2023

Advertisement

వృద్ధాప్యం.. ప్రతి మనిషికి తప్పని దశ.  మనిషికి అంతిమ దశ కూడా ఇదే.. ఇక జీవితం ముగింపుకు వచ్చిందని, వృద్దులు కాటికి కాళ్ళు చాపుకున్నవారని చాలామంది అర్థం చేసుకుంటూ ఉంటారు.  బాల్యం, కౌమరం, యవ్వనం, నడివయసు ఎలాంటివో వృద్ధాప్యం కూడా అలాంటిదే. కానీ వృద్ధులను చాలామంది చిన్న చూపు చూస్తుంటారు, శక్తి కోల్పోయి, బిడ్డల మీద ఆధారపడే  నిస్సహాయులుగా ఎంతోమంది వృద్దులు ఈ సమాజంలో బ్రతుకు  వెళ్లదీస్తున్నారు. తమ జీవితాన్ని త్యాగం చేసి బిడ్డలకు జీవితాన్నిచ్చిన వృద్ధుల గురించి ఈ సమాజం, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి  పెద్దవారి కోసం, వారి బాగోగుల గురించి చర్చించేందుకు ఒక ప్రత్యేక రోజు ఉండటం నిజంగా సంతోషించాల్సిన విషయం. 

  ప్రపంచ వ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్ డే ప్రతి సంవత్సరం ఆగస్టు 21వ తేదీన జరుపుకుంటారు. ఈ సీనియర్ సిటిజన్స్ డే ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక చరిత్ర ఏంటి  తెలుసుకుంటే..

వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే ని మొదటి సారి 1988లో జరుపుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ఆగస్టు  21ని  సీనియర్ సిటిజన్స్ డే గా అధికారికంగా ప్రకటించారు.  జీవితాంతం తన వారి కోసం జీవించి, చివరి దశలో కూడా తమ అనుభవాలు,  జ్ఞానంతో మంచి భవిష్యత్తును ముందు తరాలకు  అందించే వృద్ధులు సురక్షితంగా, గౌరవంగా బ్రతకడానికి కావలసిన పరిస్థితులు ఉండాలని రోనాల్డ్ రీగన్ కోరుకున్నారు. 

కానీ జీవితంలో పసిబిడ్డగా మొదలుపెట్టి కౌమారం, యవ్వనం, నడివయసు నుండి పండిపోయిన వయసులో నిండైన అనుభవాలు, జ్ఞానం సంపాదించిన ప్రతి మనిషి తన జీవితంలో ఉద్యోగ బాధ్యతల నుండి రిటైర్మెంట్ అయితే తీసుకోగలుగుతున్నాడు.  కానీ  ఆ అవసాన దశలో ఆ వ్యక్తి జీవితం నిజంగానే విశ్రాంతిగా ఉంటోందా? ఈ ప్రశ్న వేసుకుంటే చుట్టూ ఎంతో మంది వృద్ధుల జీవితాలు సమాధానాలుగా కనిపిస్తాయి. ఇప్పటికీ చాలా మంది పెద్దవారు రిటైర్మెంట్ తర్వాత  మనవళ్ళను , మనవరాళ్ళను చూసుకోవడంలోనూ, లేదా ఉద్యోగస్థులైన పిల్లల బాగోగులు చూసుకుంటూ గడిపేస్తున్నారు. ఇక ఆడవారైతే ఉద్యోగం నుండి విశ్రాంతి లభించినా ఇంటి పనులతో క్షణం విశ్రాంతి లేకుండా జీవిస్తున్నారు. మరికొందరు పిల్లల ప్రేమాభిమానాలు దొరకక ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉండాల్సి వస్తుంది. ఇంకొందరు పెద్దవారు తమ పిల్లలు పట్టించుకోక వదిలేస్తే, పొట్టకూటి కోసం  శక్తికి మించిన పనులు చేసుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నారు. దగ్గరగా ఉన్నప్పుడు చాలామందికి పెద్దల విలువ తెలియదు. వారు చేజారిపొక ముందే పిల్లలు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

పెద్దవాళ్ళు, తమ పిల్లల కోసం చేసే పనుల్ని భారంగా కాక బాధ్యతలా పంచుకుంటారు. మరి పిల్లలు వారికి అవసరమైన సమయంలో నిజంగానే  చేతిని అందిస్తున్నారా?. అని ప్రశ్నించుకోవలసిన సమయమిది. వృద్ధాప్యం తెచ్చిన నిస్సహాయత వాళ్ళని మన దృష్టిలో నిరుపయోగంగా మార్చేస్తుంది. వారి పనులు కష్టంగా మారిపోతుంటాయి. కానీ వృద్ధులు, పిల్లలు ఒకలాంటి వారేనని అంటారు.  చిన్నతనంలో  అమ్మానాన్న పిల్లలకు చేసే పనుల్లో ఎక్కడా విసుగు ఉండదు. పైగా ఆ పనులు చేయడంలో సంతృప్తిని అనుభవిస్తారు. అదేవిధంగా పెద్దలకోసం ఏదైనా పని చేస్తే అది పిల్లల బాధ్యత అనే విషయం గుర్తించాలి.  

చాలమంది పెద్దలు పిల్లల దగ్గర   సహాయం తీసుకోవడానికి మొహమాటపడుతుంటారు. ఇక పెళ్ళి చేసి అత్తారింటికి పంపిన కూతురు నుండి తమ కష్టం చెప్పడానికి కూడా ధైర్యం చేయరు. కానీ కూతుళ్ళు అయినా, కొడుకులు అయినా తల్లిదండ్రుల గురించి, అలాగే అత్తమామల గురించి కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ  "మేమున్నాం. మీకేం కాదు" అనే భరోసా ఇవ్వగలగాలి.

 కనీసం ఒక్కరోజు లేదా కనీసం ఒక్క గంట వాళ్ళతో మనసారా నవ్వుతూ మాట్లాడాలి. అది  తల్లితండ్రులు కావచ్చు. లేదా దగ్గర వ్యక్తులు అయిన తాతా, బామ్మలు కావచ్చు. ఖాళీ సమయంలో నెలకి ఒక్కసారయినా వాళ్ళతో మనసు పంచుకోవడం అలవాటు చేసుకోవాలి.  వాళ్ళు కుటుంబ బాధ్యతల్లో పడి చేయలేకపోయిన పనులు చేయడానికి  సహాయం చెయ్యచ్చు. హాబీగా చేయాలనుకుని, నేర్చుకోవాలని కుదరక ఆగిపోయిన పనులు ఈ వృద్దాప్యంలో నేర్చుకోవడానికి సపోర్ట్ చెయ్యడం  వారి వృద్ధాప్య కాలం సజావుగా గడిచిపోవడానికి సహకరిస్తుంది. 

అసలు ఈ సీనియర్ సిటిజన్స్ డే ఉద్దేశం  వృద్దులకు  ఉన్న హక్కుల గురించి అవగాహన కలిగించడం. వారు తమ చివరి రోజుల్లో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి  ప్రభుత్వం ఇస్తున్న వనరులు గురించి తెలిసేలా చేయడం. పిల్లల కోసం జీవితంలో ఎన్నో వదులుకుని పిల్లల్ని పెద్ద చేసిన  తల్లితండ్రులు వృద్దాప్యంలో అదే పిల్లల కారణంగా బాధపడకుండా ఉండేలా చేయడం. ఈ విషయాలను వృద్దులకు తెలియజేయడమే కాదు, ప్రతి ఇంట్లో వృద్ధుల గురించి ఆ కుటుంబం వారు ఆలోచించి, వారిని సంతోషంగా ఉంచాలి. ఒకప్పుడు వారి సమయాన్ని లాక్కున్న పిల్లలు, తిరిగి వారికోసం సమయాన్ని కేటాయించాలి. అప్పుడే వృద్ధుల జీవితం భారంగా కాకుండా అనుభవాల ఫలాలను మోస్తున్న నిండు పండ్ల చెట్టులా అందరికీ ఫలాలను అందిస్తుంది. 

                                         *నిశ్శబ్ద.

By
en-us Political News

  
వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకం. వివాహ వయస్సు కాలక్రమేణా పెరుగుతోంది. చదువు పూర్తయిన తర్వాత అబ్బాయి అయినా  అమ్మాయి అయినా  కెరీర్‌లో స్థిరపడిన సెటిల్ అయిన తర్వాత  మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటారు...
ప్రతి ఒక్కరికి తమ జీవితం బాగుండాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం ఏదేదో చేయాలని కూడా ఆనుకుంటారు. కానీ తమ జీవితం బాగుండక పోవడానికి ఎన్నో పరిస్థితులు,  తమ చుట్టూ ఉన్న వ్యక్తులు కారణం అని అనుకుంటూ ఉంటారు...
జనవరి నెలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, అన్నింటికంటే ముఖ్యంగా ఇది సంవత్సరం ప్రారంభ నెల. ఈ నెలలో  చల్లని గాలి,  నిర్మలమైన  ఆకాశం కూడా ఉంటుంది.  దీనిలాగే ఈ నెలలో జన్మించిన పిల్లలు కూడా కొన్ని ప్రత్యేక వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు....
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు...
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.