సికిందరాబాద్ అల్ల‌ర్ల సూత్ర‌ధారి ఆవుల అరెస్టు

Publish Date:Jun 18, 2022

Advertisement

కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం ‘అగ్నిపథ్’ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో శుక్రవారం తీవ్ర విధ్వంసం సృష్టించిన కేసులో కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ అల్లర్లను పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు ప్రోత్సహించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆవుల సుబ్బారావును అతని ప్రకాశం జిల్లా కంభంలో పోలీసులు అదుపులోకి తీసుకుని, నరసరావుపేటకు తరలించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆవుల సుబ్బారావు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్లకు సుబ్బారావు పాత్ర ఉందనే అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సుబ్బారావుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 9 ఆర్మీ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి.

పక్కా ప్రణాళికతోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. సైన్యం లో చేరేందుకు తమ అకాడమీలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులను రెచ్చగొట్టి సుబ్బారావు ఈ విధ్వం సాన్ని ప్రోత్సహించినట్లు పోలీసు గుర్తించారు. అగ్నిపథ్ వల్ల నష్టం కలుగుతుందని వీడియో సందేశం ద్వారా ఆర్మీ అభ్యర్థులను సుబ్బారావు రెచ్చగొట్టినట్లు పోలీసులు తేల్చారు. సుబ్బారావు ఆధ్వర్యంలోనే ఆందోళనకారులు సికింద్రాబాద్ వచ్చినట్లు గుర్తించారు. నిరసనకారులకు సుబ్బారావు తమ అకాడమీ లోనే షెల్టర్ ఇచ్చినట్లు కూడా పోలీసులు తేల్చారు. ఆందోళనకారులకు వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలను ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ అకాడమీలు సరఫరా చేసినట్లు పోలీసు విచారణలో వెలుగు చూసిందని తెలుస్తోంది.

సికింద్రాబాద్ స్టేషన్ అల్లర్ల కేసులో ఇంతవరకు పోలీసులు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు 12 మంది యువకులు ప్రధాన కారకులని పోలీసుల అనుమానం. వీరంతా ఆర్మీ ఉద్యోగాల ఆశావహులను రెచ్చగొట్టారని ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేష్ బాక్స్, 17/6 గ్రూప్ తో పాటు పలు పేర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఈ వాట్సాప్ సందేశాలు ఇప్పటికే వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో పాల్గొన్న పలువురు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్ లో అల్లర్ల వెనుక కరీంనగర్ లోని స్టార్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు వసీం హస్తం ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సికింద్రాబాద్ స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన ఆందోళనకారులపై పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐఆర్ఎస్, ఐపీసీ, జీఆర్పీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఐఆర్ఏ 150 సెక్షన్ కింద నేరం రుజువైతే యావజ్జీవ లేదా మరణశిక్షకు గురయ్యే అవకాశం ఉంది. ఈ కేసుల్లో చిక్కు కున్న వారు సైన్యంలో పనిచేసేందుకు అనర్హులవుతారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు కూడా ఇబ్బందులు వస్తాయి.  శిక్ష‌ణ‌నిచ్చేవారే ఉద్రిక్త ప‌రిస్థితులు క‌ల్పించేందుకు పూనుకుంటే స‌మాజం ఏం కావాలి?    

అగ్నిప‌థ్ ప‌థ‌కంతో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల దేశ‌మంత‌టా తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త ఇంకా  వెల్లువెత్తుతోంది. అన్ని రాష్ట్రాల్లో దాడులు, హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. అయితే శుక్ర‌వారం సికింద్రాబాద్‌లో జ‌రిగిన దాడులు, హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు ముఖ్యంగా  రైళ్లకు  నిప్పు పెట్ట‌డా లు వంటివి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ  క‌నీ వినీ ఎరుగ‌నివి. ఇంత స్థాయిలో యువ‌త తిరుగుబాటు, దాడు ల‌కు పూనుకోవ‌డానికి వారిని రెచ్చ‌గొట్టిన‌ది  సాయి డిఫెన్స్ అకాడ‌మీ వ్య‌వ‌స్థాప‌కుడు ఆవుల సుబ్బారావు అని తేలింది. 

సాయి డిఫెన్స్ అకాడెమీ  సైనిక శిక్ష‌ణా కేంద్రాన్నించీ  ప్ర‌తీ యేడూ చాలామందికి శిక్ష‌ణ‌నిచ్చి సైన్యంలో చేర‌డానికి వీలు క‌ల్పిస్తున్నారు. అయితే ఈ సారి కేంద్రం అగ్నిప‌థ్ ప‌థ‌కంతో  సైనిక శిక్ష‌ణ‌లో వున్న యువత‌కు అన్యాయ‌మే జ‌రుగుతుంద‌న్న‌ది స్ప‌ష్ట మ‌యింది. 17 నుంచి 23 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌లో యువ‌త శిక్ష‌ణ‌లో వున్న‌వారికి అగ్నిప‌థ్ ప‌థ‌కం ద్వారా సైన్యంలోకి తీసుకున్న‌ప్ప‌టికీ వారికి  కేవ‌లం నాలుగేళ్లు మాత్ర‌మే ఉద్యోగ భ‌ద్ర‌త వుంటుంది. ఆ త‌ర్వాత తొల‌గించ‌వ‌చ్చు. ఈ  నియ‌మం దేశంలో సైనిక శిక్ష‌ణ పొందుతున్న యువ‌త‌కు ఆశాభంగ‌మ‌యింది. దాన్ని వ్య‌తిరేకిస్తూ దేశంలో యువ‌త తిరగ బ‌డ్డారు. కానీ కేంద్రం ఇసుమంత కూడా వెన‌క‌డుగు వేయ‌లేదు.   ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డానికే  గ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంది. 

ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌లో రైళ్ల ద‌గ్ధం, హైద‌రాబాద్ లో అనేక ప్రాంతాల్లో అల్ల‌ర్లు, పోలీసుల లాఠీచార్జీ చివ‌ర‌గా ఫైరింగ్ కూడా చోటుచేసుకుంది. అస‌లు కుర్రాళ్లు ఇంత‌గా రెచ్చి పోవడానికి రైళ్ల రాక‌పోక‌ల‌ను స్థంభింప‌జేయ‌డానికి వారిని రెచ్చ‌గొట్టింది ఆవుల సుబ్బారావు డిఫెన్స్  అకా డ‌మీ సృష్టించిన ప్ర‌త్యేక యాప్ పుణ్య‌మే అన్న‌ది తేట‌తెల్ల‌మ‌యింది. వాట్స‌ప్ గ్రూప్ ద్వారా వేగంగా స‌మా చారం విస్త‌రించి మ‌రింత మంది రెండు తెలుగు రాష్ట్రాల యువ‌త విరుచుకుప‌డ్డార‌న్న‌ది బ‌య‌ట ప‌డిం ది.  ఇదంతా చాలా ముందుగానే ప్లాన్ చేసుకుని అమ‌లు చేసిన ప‌థ‌కంగా తోస్తోంద‌ని ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తున్న విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రీ దారుణ‌మేమంటే అటు ఆంధ్రా నుంచి పెద్ద సంఖ్య‌లో యువ‌త వ‌చ్చి ఇక్క‌డ దాడుల్లో పాల్గొన‌డానికి కావ‌ల‌సిన మ‌ద్ద‌తు సుబ్బారావు సృష్టించిన యాప్ ద్వారానే ల‌భించింద‌న్న వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. శిక్షణ‌నిచ్చిన వారే ఇలాంటి దాడులు, దారుణాల‌కు ప్రోత్స హించ‌డం అమానుష‌మే అవుతుంది. కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ డిఫెన్స్ అకాడెమీలు, శిక్ష‌ణా కేంద్రాలు మ‌రో విధంగా శాంతియుతంగా త‌మ గోడును తెలియ‌జేయాలి అనే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. కానీ చాలా కాలం నుంచి శిక్ష‌ణ పొందుతూ ఎంతో ఆశ‌తో ఎదురుచూస్తున్న యువ త‌కు కేంద్రం అగ్నిప‌థ్ నిర్ణ‌యం పెద్ద షాక్ అనాలి. వూహించ‌ని నిర్ణ‌యానికి వూహించ‌ని ప‌రిణామాలే చోటుచేసుకున్నాయి. 

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.