Publish Date:Oct 11, 2022
ఎంత బాగా ఆడినా, ఎంతగా ప్రశంసలు పొందినా కొందరికి దురదృష్టం వెన్నాడుతూనే ఉంటుంది. చాలా కాలం నుంచి భారత్ జట్టులో కీలకపాత్రవహించి జట్టు విజయాల్లో పాలుపంచుకోవాలనుకున్న స్టార్ బ్యాట్స్ మన్లు ప్రపంచకప్ జట్టుకి ఎంపిక కాకుండా జట్టుకు దూరం కావడం జరుగుతూనే ఉంది. అం దుకు పెద్ద ఉదాహరన వివిఎస్ లక్ష్మణ్. ఇపుడు సంజూ శాంసన్. సంజూ 2022 ప్రపంచకప్ కి చివరి నిమి షంలో అవకాశం కోల్పోయాడు.
సంజూ ఇటీవల ఎంతో అద్భుతంగా రాణిస్తున్న బ్యాటర్లలో ఒకడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో తలపడుతు న్న వన్డే సిరీస్ మొదటి మ్యాచ్లో 63 బంతుల్లో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నిం గ్స్ సెలక్టర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రేక్షకులు, తోటి ప్లేయర్లు అతన్ని వరల్డ్ కప్ జట్టులో ఉండా లని కోరు కున్నారు. కానీ అతనికి దినేష్ కార్తిక్, రిషబ్ పంత్ గట్టిపోటీనే ఇచ్చారు. రాంచీలో జరిగిన రెండో మ్యాచ్ లో కూడా 36 బంతుల్లో 30 పరుగులు చేయడంలో జట్టు కీలకదశలో ఇన్నింగ్స్ను నిలబెట్ట డంలో నమ్మదగ్గ బ్యాటర్గా ఆకట్టుకున్నాడు. శ్రేయస్ అద్బుత సెంచరీ చేయడంతో సిరీస్ బెస్ట్ ప్లేయర్గా నిలిచినప్పటికీ, సంజూ శాంసన్ ఎంతో మంచి ప్లేయర్గా అందరి మన్ననలు అందు కున్నాడు.
దక్షిణాఫ్రికా, భారత్ వన్డే సిరీస్లో సంజూ తన స్థాయిని ప్రదర్శించడానికి, సెలక్టర్లను ఆకట్టుకోవడానికి కాయ కష్టం చేశాడు. కానీ అదృష్టం వరించలేదు. అతని స్థానంలో రిషబ్ పంత్, దినేష్ కార్తీక్లకు అవ కాశం ఇచ్చారు. అయితే, బ్యాటింగ్ లైన్లో 5వ స్థానంలో చెప్పుకోదగ్గ బ్యాటర్గా సెలక్టర్లు గుర్తిం చారు. అయితే, దినేష్ కార్తీక్ కూడా లేట్గా గొప్ప గుర్తింపు పొందిన ప్లేయర్గానే గుర్తింపు పొంది జాతీయ జట్టు లోకి రావడం గమనార్హం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sanju-samson-missed-out-world-cup-chance-39-145251.html
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.