రబ్బర్ స్టాంప్ మాట‌కు అర్ధం అప్పుడూ ఇప్పుడూ ఒక్క‌టేనేమో!

Publish Date:Jul 5, 2022

Advertisement

ఒక‌రిని అన్న‌పుడు తామూ ప‌డాలిగ‌దా!  బిజెపికీ ఈ సూత్రం వ‌ర్తిస్తుంది. గ‌తంలో మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధా నిగా వున్న‌పుడు ఆయ‌న్ను సోనియా మాట జ‌వ‌దాట‌డ‌ని, కాంగ్రెస్ స్టాంప్ ప్ర‌ధాని అంటూ  తోచిన‌ట్టు కామెంట్లు చేసిన విప‌క్షాల మాట ఇపుడు బిజెపి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి ముర్మీ విష‌యంలో విన‌వ‌స్తుంటే ఇబ్బం దిగా మారింది. రాష్ట్ర‌ప‌తి స్థాయిలో వుండేవారు ఏ ప్ర‌భుత్వానికి ప‌క్ష‌పాత ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రించ‌రు. కానీ ప్ర‌స్తుతం బిజెపి కోరి వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తి మ‌హిళ‌ను రాష్ట్ర‌ప‌తిని చేయాల‌న్న ప‌ట్టుద‌ల వెనుక వారికి అనుకూలించే వ్య‌క్తి ఉన్న‌త ప‌ద‌విలో వుండ‌టం అవ‌స‌ర‌మ‌న్న ఆలోచ‌నకే బ‌లాన్నిస్తోంది. 

ఒరిస్సాకి చెందిన ముర్మీ ఎంపిక గురించి  విప‌క్షాల త‌ర‌ఫున అధ్య‌క్ష‌ప‌ద‌వి పోటీలో వున్న య‌శ్వంత్ సిన్హా చేసిన ర‌బ్బ‌ర్ స్టాంప్ కామెంట్‌కు బిజెపీ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. ఒక ఆదివాసీ మ‌హిళ‌ను ఉన్న‌త స్థానంలోకి తీసుకోవ‌డంలో బిజెపికి మ‌రో ఆలోచ‌న లేద‌ని, సిన్హా చేసిన కామెంట్ విప‌క్షాల మాన‌సిక వైఖ రిని తెలియ‌జేస్తుంద‌ని బిజెపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సి.టి.ర‌వి వ్యాఖ్యానించారు. కానీ, మోదీ నాయ క‌త్వంలోని బిజెపి ప్ర‌భుత్వం ఏదీ త‌మ‌కు అన‌నుకూల‌మైన‌దిగా తీసుకోర‌ని అంద‌రికీ తెలిసిన‌దే. ముర్మీ ఎంపిక వెనుక త‌మ పార్టీ, ప్ర‌భుత్వం వెనుక‌బ‌డిన వ‌ర్గాల ప‌ట్ల ఎంతో గౌర‌వం వుంద‌న్న‌ది ప్ర‌ద‌ర్శించ‌డా నికి త‌ప్ప వాస్త‌వానికి వారు వారి ప్ర‌గ‌తికి చేసిందేమీ లేద‌న్న అభిప్రాయాలు, నినాదాలే దేశ మంతా విన బ‌డుతున్నాయి. వాటిని దాట‌వేయ‌డానికి ఇపుడు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భాన్ని త‌మ‌కు అనుకూలం చేసుకోవాల‌నుకున్నారు. 

అందుకే గ‌ట్టి అభ్య‌ర్ధి కోసం వెతికి వేసారే బ‌దులు వెనుక‌బ‌డిన జాతికి చెందిన మ‌హిళ‌ను పోటీకి దింప‌డం స‌మంజ‌స‌మ‌ని బిజెపీ అభిప్రాయ‌ప‌డింది. ఈ నెల 18వ తేదీ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. త‌ప్ప‌కుండా తమకు కావ‌ల‌సిన అభ్య‌ర్ధి గెల‌వాలంటే ముర్మీ కంటే త‌గిన అభ్య‌ర్ధి వేరెవ్వ‌రూ వుండ‌ర‌ని బిజెపి వ‌ర్గీయు లు న‌మ్మారు. ఇలాగ‌యితేనే విప‌క్షాల అభ్య‌ర్ధి రాజ‌కీయాల‌ల్లో ఆరితేరిన య‌శ్వం త్ సిన్హాను ఓడించ‌డానికి అవ‌కాశం వుంటుంది. 

ప్ర‌స్తుతం య‌శ్వంత్ బంగ‌ళూరులో ప్ర‌చారంలో వున్నారు. ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ స‌మావేశంలో మాట్లాడు తూ బిజెపి ప్ర‌భుత్వం చాలారోజులుగా ఇ.డి, సిబిఐ, ఐటీ శాఖ‌ల‌ను త‌న‌కు అనుకూలించే విధంగా ఉప యోగిస్తూన్న‌ద‌ని విమ‌ర్శించారు. త‌మ విరోధుల ఆట‌క‌ట్టించేందుకు బిజెపి ప్ర‌భుత్వం ఎప్పుడూ ఈ స్వ‌తంత్ర సంస్థ‌లను అస్త్రాలుగా వాడుతోంద‌న్నారు. కేంద్రం మాట, ఆదేశానుసార‌మే ఆ సంస్థ‌లు ప‌ని చేస్తున్నాయి. అందుకు వుదాహ‌ర‌ణే బిజెపీయేత‌ర పార్టీ నాయ‌కుల ఆస్తులు, నివాసాల‌పై ఇ.డి, ఐ.టీ దాడులు మితిమీరి జ‌ర‌గ‌డం. ఈ సంగ‌తి ప్ర‌జ‌లంద‌రికీ అర్ధ‌మ‌యింది. భ‌విష్య‌త్తులో రాజ్యాంగ ప‌ర‌మైన అంశాల్లో త‌మ‌కు ఎదురులేకుండా చేసుకోవ‌డానికే బిజెపి వ‌ర్గం ముర్మీని  రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి త‌గిన అభ్య ర్ధిగా ప్ర‌చారం చేస్తోంది.  ఇది మోదీ రాజ‌కీయ‌చ‌తుర‌త తెలిసిన అంద‌రి మాట‌. 

మోదీ టీమ్ మ‌ళ్లీ ఒక్క‌టి గుర్తుంచుకోవాలి.  గ‌తంలో చేసిన కామెంట్లు త‌మ‌వారి విష‌యంలోనూ విన‌వ‌స్తుం టాయ‌న్న‌ది. గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌హ‌యాంలో మ‌న్మోహ‌న్ సింగ్‌ను విప‌క్షంలో వుండ‌గా ర‌బ్బ‌రు స్టాంప్ ప్ర‌ధాని అంటూ అప‌హాస్యం చేసిన‌వారు దాన్ని అంత సుల‌భంగా మ‌ర్చిపోవ‌డం త‌గ‌దు. ముర్మి విష‌యంలో మోదీ ఎంతో అద్భుతంగా ప్ర‌చారం చేసుకున్న‌పుడు ఆమె రాష్ట్ర‌ప‌తిగా బిజెపీ ప్ర‌భుత్వానికి ర‌బ్బ‌రుస్టాంప్ రాష్ట్ర‌ప‌తిగా మార‌వ‌చ్చ‌న్న కామెంటు నీ అంతే  సుల‌భంగా తీసుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్ర‌భ‌త్వం అన్ని వ్య‌వ‌స్థ‌ల్నీ త‌మ‌కు అనుకూలించే విధంగా ప‌నిచేసేలా మార్చేశాయి గ‌నుక‌. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి విష‌యంలో బిజెపి ఎంపిక చేసుకున్న ముర్మీ వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన వ్యక్తే కావ‌చ్చ‌, గ‌తం లో  ఝార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ గిరీ చేప‌ట్టి వుండ‌వ‌చ్చు. కానీ ప్ర‌స్తుత‌ రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఆమెను రాష్ట్ర ప‌తి అభ్య‌ర్ధిగా తీసుకురావ‌డంలో అంత‌రార్ధం త‌మ‌కు భ‌విష్య‌త్తులో రాజ్యాంగ‌బ‌ద్ధ‌, చ‌ట్ట‌బ‌ద్ధ వ్య‌వ‌హారాల్లో ఎలాంటి అడ్డంకులైనా తొల‌గించుకోను వీలుండేందుకు అనే భావ‌నా ప్ర‌క‌టిత‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో నే బ‌హుశా య‌శ్వంత్ సిన్హా  ఆమెను బిజెపి వారి ర‌బ్బ‌రు స్టాంప్ అని కామెంట్ చేసి వుండ‌వ‌చ్చు.  మ‌రి బిజెపీ నాయ‌క‌త్వంలోని ప్ర‌భుత్వం కూడా రిటార్ట్‌ను అంగీక‌రించాల్సిందేగా!

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.